ఏపీ మహిళలకు దీపావళి బొనాంజా ప్రకటించిన చంద్రబాబు.. ఆ రోజే ప్రారంభం

Chandrababu on Free Gas scheme in Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. దీపావళి నుంచి మరో హామీని అమలుచేయనున్నట్లు ప్రకటించారు. సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన ఉచిత గ్యా్స్ సిలిండర్ పథకం దీపావళి నుంచి ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌‍లో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్న చంద్రబాబు.. సంక్షేమంతో పాటుగా అభివృద్ధి పనులను కూడా చేపడతామని తెలిపారు. మరోవైపు ఏపీ ఎన్నికల ప్రచారం సమయంలో మహాశక్తి పథకం కింద మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని ఎన్డీఏ కూటమి హమీ ఇచ్చింది. ఈ హామీని నెరవేరుస్తూ తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనుంది.

About amaravatinews

Check Also

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్.. ఆ ఛార్జీల పెంపుపై మంత్రి కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ చార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి విద్యుత్ చార్జీలు పెంచే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *