హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ రూట్లో ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్‌.. ప్రత్యేక రాయితీలు

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎన్నటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌- విజయవాడ రూట్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు శుభవార్త తెలిపారు..

ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) శుభవార్త తెలిపింది. విజ‌య‌వాడ రూట్‌లో ప్రయాణించే వారికి ఈ గుడ్‌న్యూస్‌ అందించింది. హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ మార్గంలో ప్రత్యేక రాయితీల‌ను ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది. ల‌హారి- నాన్ ఏసీ స్లీప‌ర్ క‌మ్ సీట‌ర్, సూప‌ర్ ల‌గ్జరీ స‌ర్వీసుల్లో 10 శాతం రాయితీ, అదే రాజ‌ధాని ఏసీ బ‌స్సుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు టీజీఆర్టీసీ తెలిపింది.ఈ మేరకు బుధవారం ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ రాయితీతో కల్పించే డిస్కౌంట్‌ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించింది. టీజీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించింది. ఈ విషయాన్ని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వెల్లడించారు. విజ‌య‌వాడ రూట్‌లో ప్రయాణించే వారికి టికెట్లపై ఆర్టీసీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు.

About Kadam

Check Also

ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు వచ్చేశాయ్..

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు 2025 మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలయ్యాయి. నాంపల్లిలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *