వేణు స్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి.. ఇటీవల అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితంపై జాతకం చెప్పిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నరోజునే రంగంలోకి దిగిన వేణుస్వామి.. మూడేళ్లలో వీరిద్దరూ విడిపోతారంటూ జాతకం చెప్పారు. ఈ మేరకు వీరిద్దరి జాతకాలను వేణుస్వామి విశ్లేషణ చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన అక్కినేని ఫ్యాన్స్.. వేణుస్వామిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే, తాజాగా వేణుస్వామిపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందింది.

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంతమంది జర్నలిస్టులు.. వేణుస్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వేణుస్వామిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నీరెళ్ల శారదను కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన శారద.. వేణుస్వామిపైన మాత్రమే కాకుండా ఆయన వీడియోలను ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానెల్స్‌పై కూడా విచారణ చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వేణుస్వామిని పిలిపించి వివరణ అడుగుతామని అన్నారు.

About amaravatinews

Check Also

రజాకార్ సినిమాను తప్పకుండా చూడాలన్న బండి సంజయ్.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?

తెలంగాణ చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం రజాకార్. యాటా సత్యనారాయణ తెరకెక్కించిన ఈ సినిమాలో అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *