వేణు స్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి.. ఇటీవల అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితంపై జాతకం చెప్పిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నరోజునే రంగంలోకి దిగిన వేణుస్వామి.. మూడేళ్లలో వీరిద్దరూ విడిపోతారంటూ జాతకం చెప్పారు. ఈ మేరకు వీరిద్దరి జాతకాలను వేణుస్వామి విశ్లేషణ చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన అక్కినేని ఫ్యాన్స్.. వేణుస్వామిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే, తాజాగా వేణుస్వామిపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందింది.

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంతమంది జర్నలిస్టులు.. వేణుస్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వేణుస్వామిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నీరెళ్ల శారదను కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన శారద.. వేణుస్వామిపైన మాత్రమే కాకుండా ఆయన వీడియోలను ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానెల్స్‌పై కూడా విచారణ చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వేణుస్వామిని పిలిపించి వివరణ అడుగుతామని అన్నారు.

About amaravatinews

Check Also

రాజకీయాలకు దూరంగా ఉన్నా విమర్శిస్తున్నారు.. అందుకే స్పందించను.. మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు..

నేను రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నా.. అయినా.. కొందరు నాపై అకారణంగా విమర్శలు చేస్తున్నారు .. ఆ విమర్శలకు నేను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *