హైదరాబాద్ RTC ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి ఆ రూట్‌లో ప్రత్యేక సర్వీసులు

హైదరాబాద్ ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి ఇక నుంచి నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. రామోజీ ఫిల్మ్‌సిటీ మీదుగా నాలుగు ఆర్టీసీ (205 F) బస్సులను నేటి నుంచి నడపనున్నట్లు కాచిగూడ డిపో మేనేజర్‌ వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి ప్రతి అర గంటకు ఒక బస్సు చొప్పున ఈ బస్సులురాకపోకలు సాగిస్తాయన్నారు. రాత్రి 8.40 గంటలకు కాచిగూడ నుంచి చివరి బస్సు ఉంటుందన్నారు.

అబ్దుల్లాపూర్‌ మెట్‌ నుంచి ప్రతిరోజు ఉదయం 7.10 గంటలకు బస్సు ఉంటుందని.. ప్రతి అరగంటకు ఒక బస్సు చొప్పున రాత్రి 10 గంటల వరకు ఇక్కడి నుంచి బస్సులు నడుస్తాయన్నారు. ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు నల్గొండ చౌరస్తా, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, రామోజీ ఫిల్మ్‌సిటీ మీదుగా రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. ఈ అవకాశాన్ని బస్సు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.

About amaravatinews

Check Also

రతన్ టాటా రూ.15 వేల కోట్లు ఎవరికి వస్తాయి? వీలునామాలో ఎవరి పేర్లు ఉన్నాయి?

రతన్‌టాటా ప్రస్తుతం మన మధ్య లేరు. గొప్ప వ్యాపారవేత్త.. అంతకుమించిన మహా మనిషి. వ్యాపారానికి, విలువలు జోడించిన వ్యక్తి. దిగ్గజ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *