ఆడ ‘తోడు’ కోసం ‘టైగర్ జానీ’ అలుపెరగని ప్రయాణం.. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు 340 కి.మీ ప్రేమయాత్ర..!

ప్రేమ, విరహం మనుషులకే కాదు జంతువులకూ ఉంటుంది. అందుకు సరైన ఉదాహరణ టైగర్ జానీ అనే పెద్ద పులి. ఆడ తోడు కోసం ఈ టైగర్ అలుపెరుగని ప్రయాణం సాగిస్తోంది. ఒకటి కాదు‌ రెండు కాదు ఏకంగా నెల రోజులుగా నడక సాగిస్తూనే ఉంది. ఇప్పటికే 340 కి.మీ దాటిన ప్రేమయాత్ర ఇంకా సాగుతూనే ఉంది. మహారాష్ట్ర అడవుల నుంచి కొండలు, గుట్టలు దాటి తెలంగాణ కవ్వాల్ అభయారణ్యంలోకి చేరుకుంది.

నిర్మల్ జిల్లా సమీపంలోని మహబూబా ఘాట్ వద్ద ఈనెల 11న ఓ పులి రోడ్డు దాటుతూ వాహనదారుల కంట పడిన విషయం తెలిసిందే. ఆ పులి టైగర్ జానీ అనే మగ పులిగా గుర్తించారు. 6-8 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న టైగర్ జానీ.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వాట్ తాలూకా అడవుల నుంచి ఆదిలాబాద్ అడువుల బాట పట్టింది. కిన్వాట్, భైంసా, కుంటాల, సారంగాపూర్, ఇచ్చోడ మీదుగా ప్రస్తుతం ఉట్నూరుకు చేరుకుందు. దాదాపు 340 కి.మీ ఈ పులి సంచారం చేసింది.

అయితే ఆ పులి తెలంగాణకు రావటానికి ప్రధాన కారణం ఆడ తోడుగా అటవీ అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆడ తోడు కోసం టైగర్ జానీ తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. మగ పులులు చలికాలంలో తరచుగా ఇటువంటి సుదీర్ఘ ప్రయాణాలను ప్రారంభిస్తాన్నారు. ఇది వాటికి సంభోగ కాలమని.. పులలు అవి ఉన్న ఏరియాలో సరైన జత దొరకపుడు సహచర ఆడ పులిని వెతుకుతూ ఇలా సుదీర్ఘ ప్రయాణాలు చేస్తాయని చెప్పారు.

అక్టోబర్ మూడో వారంలో టైగర్ జానీ తన ప్రయాణాన్ని ప్రారంభించి ఉంటుందని బాజీరావు వెల్లడించారు. ముందుగా ఇది ఆదిలాబాద్‌ బోథ్‌ మండల అడవుల్లో కనిపించిందని.. ఆ తర్వాత.. నిర్మల్‌ జిల్లా కుంటాల, సారంగాపూర్‌, మామడ, పెంబి మండలాల మీదుగా ఉట్నూర్‌లోకి ప్రవేశించిందన్నారు. హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ నేషనల్ హైవే-44 దాటుకుని తిర్యాణి ప్రాంతం వైపు వెళ్లినట్లు చెప్పారు.

About amaravatinews

Check Also

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *