Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలను ప్రారంభించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. వీటి ద్వారా ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 82 వేల మందికి పైగా విద్యార్థులకు ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య అందనుందన్నారు. ఇందులో తెలంగాణకు కేటాయించిన ఏడు నవోదయ విద్యాలయాలు జగిత్యాల, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్‌ మల్కాజ్ గిరి, సూర్యాపేట, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం నవోదయ, కేంద్రీయ విద్యాలయాలకు రూ. 8,232 కోట్లు కేటాయించారు.

తెలంగాణలో కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలుపుతూ కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని.. యావత్ తెలంగాణ ప్రజలతో పాటుగా వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. తెలంగాణలో జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరుతూ గతంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. దాదాపు రూ.340 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ 7 JNVల ద్వారా మరో 4,000 మంది తెలంగాణ విద్యార్థులకు 6 నుండి 12వ తరగతి వరకు హాస్టల్ వసతితో సహా అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్య అందనుందని, 330 మందికి కొత్తగా ఉపాధి లభించనుందన్నారు. తెలంగాణ ప్రజల తరపున ప్రధాని మోదీతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు కిషన్‌ రెడ్డి.

About Kadam

Check Also

తెలంగాణతో అమెజాన్ భారీ ఒప్పందం.. రూ.60,000 కోట్ల పెట్టుబడులతో అతిపెద్ద డేటా సెంటర్!

దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఎదుగుతోందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. ఐటీలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *