విశాఖ: ఆటో డ్రైవర్‌కు రూ.10వేలు జరిమానా.. అమ్మో పోలీసులే అవాక్కు, కారణం ఏంటో తెలుసా!

విశాఖపట్నంలో ఆటో డ్రైవర్‌కు పోలీసులు భారీ జరిమానా విధించారు. డ్రైవర్ నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించి ఆటోలో స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు జరిమానా విధించినట్లు వన్‌టౌన్‌ ట్రాఫిక్‌ సీఐ చెప్పారు. వన్‌టౌన్ ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.. ఆ సమయంలో పూర్ణమార్కెట్ నుంచి జగదాంబకూడలికి వెళ్తున్న ఆటోను ఆపారు.. అందులో ఏకంగా 20 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. ఆటోలో ఏకంగా 20మందిని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు.. అంతమందిని ఎలా ఎక్కించావురా బాబూ అంటూ ప్రశ్నించారు. ఆ డ్రైవర్‌కు రూ.10వేల జరిమానా విధించారు. విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు, స్కూళ్ల యాజమాన్యాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఐ కోరారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి స్కూల్ విద్యార్థుల్ని, ప్రయాణికుల్ని ఎక్కించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు ఇకపై వాహనాల తీనిఖీలను ముమ్మరం చేస్తామని.. ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.

అపరిచితుల నుంచి వస్తున్న మెసేజ్‌లకు స్పందించొద్దని సూచిస్తున్నారు పోలీసులు. వారు ఏటీఎం పిన్, పాస్‌వర్డ్‌లను అడిగితే చెప్పొద్దని..సైబర్ నేరాలపై ఫిర్యాదుల కోసం 1930కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు మొబైల్‌లోకి మాల్వేర్ ఇన్‌స్టాల్ చేసి, రిమోట్ యాక్సెస్ సాయంతో తెలియకుండానే అకౌంట్‌లలో డబ్బుల్ని దోచేస్తారు.. కాబట్టి ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్‌లను ఎవరికి చెప్పొద్దని.. ఎలాంటి లింక్‌లు క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

About amaravatinews

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *