ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట.. మొత్తానికి ఆ ఫైల్ కదిలింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన ఫైల్ కదిలింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన క్రమశిక్షణా కేసుల వివరాలను తనకు పంపాలని సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆదేశించారు. అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలు, జిల్లాస్థాయి అధికారులంతా ఉద్యోగులపై నమోదైన కేసులను తక్షణమే సమీక్ష చేయాలని.. పెండింగ్‌ కేసుల వివరాలతో ఒక నోట్‌ను తనకు పంపాలంటూ సీఎస్‌ అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు సీఎస్ నీరబ్‌కుమార్ మెమో జారీ చేశారు.

2022లో ప్రభుత్వం ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన కేసులను సంబంధిత శాఖ కానీ, కమిషనర్‌ ఆఫ్ ఎంక్వైరీ కానీ‌ 3 నుంచి 6 నెలల వ్యవధిలో విచారణ పూర్తి చేయాలని ఉంది. ఈ ఆదేశాలను అధికారులు పాటించడం లేదని.. అందుకే ఉద్యోగులు కోర్టును ఆశ్రయిస్తున్నారని.. ఇప్పటి వరకు ఎన్ని కేసులు ఎన్ని కేసులు పెండింగ్‌ ఉన్నాయో పేర్కొంటూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని సెప్టెంబరులో హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సీఎస్ నీరబ్‌కుమార్ ఆ ఫైల్ పంపాలని ఆదేశించారు.

మరోవైపు నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు. కరోనాతో పాటూ సహజ మరణాలు సంభవించి.. దాదాపు 3 వేల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు చనిపోయారన్నారు. అలాగే పంచాయతీరాజ్‌ శాఖలో కారుణ్య నియామకాలు అమలు చేయకపోవడంతో ఆయా కుటుంబాలు కష్టాల్లో ఉన్నాయన్నారు. అందుకే ప్రభుత్వం అర్హులైన వారి కుటుంబసభ్యులకు ఒకేసారి ఉద్యోగాలు కల్పించేలా కేబినెట్ భేటీలో చర్చించాలని కోరారు.అలాగే 12వ పీఆర్సీ కమిషనర్‌ నియామకంతోపాటు 30 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని, పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలని కూడా అడిగారు. మరోవైపు ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సీవీ ప్రసాద్, బీ రాధాకృష్ణ ఎన్నికైనట్లు ఆ సంఘం ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు ఉపాధ్యక్షులుగా నాగూర్, ప్రసాద్, అదనపు కార్యదర్శిగా సూర్యుడు, సంయుక్త అధ్యక్షుడిగా చెంగల్‌రెడ్డి, కోశాధికారిగా వి.శివరంగయ్య, మహిళా కార్యదర్శిగా పద్మజ ఎన్నికయ్యారు.

ఏపీ రవాణా శాఖ కమిషనర్‌ మనీ ష్‌కుమార్‌ సిన్హా, జాయింట్‌ కమిషనర్‌ రమ్యశ్రీపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. ఆ ఇద్దరు అధికారుల్ని వెంటనే ఆ పోస్టుల నుంచి తొలగించాలని కోరారు. ఈ మేరకు సీఎస్, రవాణాశాఖ కార్యదర్శికి వినతి పత్రాలు అందజేశారు. రవాణాశాఖ కమిషనర్‌ తమ పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నారని.. కోర్టు తీర్పులో లేని అంశాలను ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

About amaravatinews

Check Also

ఈ సారి భారతరత్న దక్కేది ఎవరికి? రేసులో ముందున్న ఆ ఇద్దరు..!

రిపబ్లిక్ డే వేళ భారతరత్న ఈ సారి ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ మొదలయ్యింది. గత ఏడాది భారతరత్న చరిత్రలోనే అత్యధికంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *