ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త.. నేటి నుంచే మొదలు, మంచి అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు ఉన్న ప్రజలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రకాల సరుకుల్ని పంపిణీ చేయనున్నారు. రేషన్ షాపుల్లో ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు సరిపడా సరుకులు రవాణా చేసేలా పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంది. ఇవాళ్టి నుంచి కార్డుదారులందరికీ సరుకులు పంపిణీ చేయనున్నారు. దాదాపు ఐదు నెలల తర్వాత పూర్తిస్థాయిలో సరుకుల్ని ప్రజలకు పంపిణీ చేయనున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర కిలో రూ.180పైనే ఉంది. అలాగే పంచదార రేటు కూడా పెరిగింది.. దీంతో నవంబరు నుంచి రేషన్‌‌కార్డులు ఉన్నవారికి.. బియ్యంతో పాటు సబ్సిడీ ధరలకు నాణ్యమైన కందిపప్పు, పంచదారను అందిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే పౌరసరఫరాలశాఖ అధికారులు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి.. కిలో కందిపప్పు రూ.67కు, అరకిలో పంచదార రూ.17కు నేటి నుంచి అందిస్తున్నారు. ఈ సరుకుల్లో జొన్నలు కావాలనుకునేవారు.. బియ్యానికి బదులుగా ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు జొన్నలు తీసుకోవచ్చని పౌరసరఫరాలశాఖ అధికారులు తెలిపారు.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *