ఆంధ్రప్రదేశ్లో రేషన్కార్డులు ఉన్న ప్రజలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రకాల సరుకుల్ని పంపిణీ చేయనున్నారు. రేషన్ షాపుల్లో ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఎంఎల్ఎస్ పాయింట్లకు సరిపడా సరుకులు రవాణా చేసేలా పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంది. ఇవాళ్టి నుంచి కార్డుదారులందరికీ సరుకులు పంపిణీ చేయనున్నారు. దాదాపు ఐదు నెలల తర్వాత పూర్తిస్థాయిలో సరుకుల్ని ప్రజలకు పంపిణీ చేయనున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర కిలో రూ.180పైనే ఉంది. అలాగే పంచదార రేటు కూడా పెరిగింది.. దీంతో నవంబరు నుంచి రేషన్కార్డులు ఉన్నవారికి.. బియ్యంతో పాటు సబ్సిడీ ధరలకు నాణ్యమైన కందిపప్పు, పంచదారను అందిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే పౌరసరఫరాలశాఖ అధికారులు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి.. కిలో కందిపప్పు రూ.67కు, అరకిలో పంచదార రూ.17కు నేటి నుంచి అందిస్తున్నారు. ఈ సరుకుల్లో జొన్నలు కావాలనుకునేవారు.. బియ్యానికి బదులుగా ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు జొన్నలు తీసుకోవచ్చని పౌరసరఫరాలశాఖ అధికారులు తెలిపారు.