ఏపీలో 16మంది ఐపీఎస్‌లు బదిలీ.. వెయిటింగ్‌లో ఉన్నవాళ్లకు పోస్టింగ్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 మంది ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. వినీత్‌ బ్రిజ్‌లాల్‌, పీహెచ్‌డీ రామకృష్ణ, ఎం.రవిప్రకాష్‌తో పాటు వెయిటింగ్‌లో ఉన్న ఎస్పీ స్థాయి అధికారులకూ పోస్టింగ్‌లు వచ్చాయి. ఎస్‌ఐబీ ఐజీగా ఉన్న వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను సీఐడీకి బదిలీ చేశారు. బ్రిజ్‌లాల్ స్థానంలోకి పీఅండ్‌ఎల్‌ (ప్రొవిజన్స్‌ అండ్‌ లాజిస్టిక్స) ఐజీ పీహెచ్‌డీ రామకృష్ణను బదిలీ చేశారు. సెబ్‌ రద్దు కావడంతో సెబ్‌ ఐజీగా ఉన్న ఎం రవిప్రకాష్‌ను పీఅండ్‌ఎల్‌ ఐజీగా పోస్టింగ్‌ దక్కింది. విశాఖపట్నం జేసీపీ కె.ఫక్కీరప్పను ఇంటెలిజెన్స్‌కు బదిలీ చేశారు. ఆ స్థానంలో ఉన్న అట్టాడ బాబూజీని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

అలాగే వెయిటింగ్‌లో ఉన్న ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డికి డీజీపీ కార్యాలయంలో అడ్మిన్‌ డీఐజీగా, మరో డీఐజీ విజయరావుకు రోడ్‌ సేఫ్టీలో పోస్టింగ్‌ దక్కింది. శాంతిభద్రతల ఏఐజీగా సిద్ధార్థ్‌ కౌశల్‌, విశాఖ శాంతిభద్రతల డీసీపీగా మేరీ ప్రశాంతిని నియమించారు. అనకాపల్లి ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌‌ను కాకినాడ ఏపీఎస్పీకి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో విశాఖ డీసీపీ తుహిన్‌ సిన్హాను అనకాపల్లి ఎస్పీగా నియమించింది ప్రభుత్వం. వెయిటింగ్‌లో ఉన్న జీఆర్‌ రాధికకు ఒంగోలు పీటీసీ, తిరుమలేశ్వర్‌రెడ్డికి విజయవాడ డీసీపీ (క్రైమ్స్‌), ఆరిఫ్‌ హఫీజ్‌కు ఇంటెలిజెన్స్‌, రాజమండ్రి ఆర్‌వీ-ఈవో సుబ్బారెడ్డికి పీటీవోలో పోస్టింగ్స్‌ ఇచ్చారు. ఈ మేరకు సీఎస్ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు ఎస్పీగా ఉన్న నాన్‌కేడర్‌ ఐపీఎస్‌ కేవీ శ్రీనివాసరావును హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

గత ప్రభుత్వ హయాంలో ఆరోపణలు ఎదుర్కొన్న కొంతమంది అధికారులకు కూడా పోస్టింగ్స్ దక్కాయి. అలాగే వెయిటింగ్‌లో ఉన్న అధికారుల్లో 16 మందిని రోజూ ఉదయం 10 గంటలకు డీజీపీ కార్యాలయానికి వచ్చి సంతకాలు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ 16మందిలో ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి, సీహెచ్‌.విజయరావులకు తాజా బదిలీల్లో పోస్టింగ్‌లు దక్కాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెయిటింగ్‌లో ఉన్న పలువురు ఐపీఎస్ అధికారులకు కూడా ప్రభుత్వం పోస్టింగ్‌‌లు ఇచ్చింది.

About amaravatinews

Check Also

డైరెక్టర్ ఆర్జీవీకి మరో తలనొప్పి.. ఈసారి రంగంలోకి సీఐడీ.. విచారణకు హాజరయ్యేనా…

2019లో రామ్‌గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో ఓ సినిమా తీశారు. ఆ మూవీపై తెలంగాణ హైకోర్టులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *