అందులో తప్పేముంది.. ఏపీలో సోషల్ మీడియా పోస్టుల కేసులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌‌లో సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ పిల్ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేస్తున్నారంటూ జర్నలిస్టు విజయబాబు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగ్గా.. ఈ కేసులకు సంబంధించి పిల్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేంటని ప్రశ్నించింది.

చివరికి న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా పోస్టులుపై పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. ఒకవేళ పోలీసులు పెట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించొచ్చని తెలిపింది. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై.. పోలీసులు చట్టనిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటే తాము ఎలా నిలువరించగలమని వ్యాఖ్యానించింది. పిల్‌‌కు సంబంధించి తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.

గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతకరమైన పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటోంది. వరుసగా కేసులు నమోదు చేస్తూ.. పలువుర్ని అరెస్ట్ చేసింది. మరికొందరికి విచారణకు రావాలని నోటీసులు జారీ చేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఉన్నారు. అంతేకాదు పలువురు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్‌లపైనా కేసులు నమోదయ్యాయి. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, పోసాని వంటి వారిపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు.

About amaravatinews

Check Also

వంశీ కేసులో దర్యాప్తు ముమ్మురం చేసిన పోలీసులు

– లెక్కలన్నీ తేలుస్తాం…! అందరిని బయటకు తీస్తాం..! అంటూ వల్లభనేని వంశీ కేసులో దూసుకుపోతున్నారు పోలీసులు. ఓవైపు టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌… …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *