lottery king: ఒకప్పుడు కూలీ, ఇప్పుడు లాటరీ కింగ్‌.. ఏటా రూ.15వేల కోట్ల టర్నోవర్.. ఈడీ దర్యాప్తులో సంచలనం

Lottery king: లాటరీ కింగ్‌ శాంటియాగో మార్టిన్‌.. వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ అధికారుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ఎలక్షన్ బాండ్ల సమాచారం బయటికి వచ్చి సమయంలో లాటరీ కింగ్ శాంటియాగో మార్టినే పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. వివిధ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో ఈ లాటరీ కింగ్‌ శాంటియాగో మార్టిన్‌.. ఏకంగా 5 ఏళ్లలోనే రూ.1300 కోట్లు వివిధ రాజకీయ పార్టీలకు అందించాడు. ఇదంతా లాటరీ బిజినెస్‌తో సంపాదించిందే కావడం గమనార్హం. అయితే లాటరీ బిజినెస్‌లో మోసాలకు పాల్పడి వేల కోట్ల సంపదను కూడబెట్టినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఒక్క ఏడాదిలోనే రూ.15 వేల కోట్లు సంపాదించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తులో వెల్లడైంది. ఈడీ దాడులతో శాంటియాగో మార్టిన్ ఆస్తులు, మోసాలు మొత్తం వెలుగులోకి వచ్చాయి.ఫ్యూచర్‌ గేమింగ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థను స్థాపించిన శాంటియాగో మార్టిన్‌.. లాటరీల పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో 2014లో దీనిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత 2018లో శాంటియాగో మార్టిన్‌ సహా ఆయన బంధువులు, ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్‌లో పనిచేసిన ఉద్యోగులపై ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఇటీవల అతడి రూ.1000 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఈ క్రమంలోనే మరింత లోతైన దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు బయటికి వచ్చాయి.

లాటరీ బిజినెస్‌లో వచ్చిన అక్రమ సొమ్ముతో ఆస్తులు కొనేందుకు శాంటియాగో మార్టిన్‌ ఏకంగా 350కి పైగా బోగస్ కంపెనీలను ప్రారంభించినట్లు తేలింది. అంతేకాకుండా ఎన్నో కార్లు కొనుగోలు చేశాడు. లాటరీ టికెట్లు కొనే వారికి కచ్చితంగా లాటరీ తగిలే టికెట్లను విక్రయించి.. వారి నుంచి ఆస్తులను కొనుగోలు చేసేవాడని దర్యాప్తులో ఈడీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా.. తన బంధువులు, ఫ్రెండ్స్‌ను లాటరీ డిస్ట్రిబ్యూటర్లుగా నియమించాడు. వీళ్లు ప్రైజ్‌ విన్నింగ్‌ లాటరీ టికెట్లను తమ వద్దే ఉంచుకుని మిగతా టికెట్లను మాత్రమే అమ్మేవారు.

ఈడీ అధికారుల తనిఖీల్లో అలాంటి వందలాది టికెట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈడీ అటాచ్‌ చేసిన ఆస్తుల్లో కొన్నింటిని శాంటియాగో మార్టిన్‌ అమ్మేసినట్లు అధికారులు గుర్తించారు. లాటరీ టికెట్లు విక్రయించి.. ఫ్యూచర్‌ గేమింగ్‌ సంస్థ ఏడాదికి రూ.15వేల కోట్ల ఆదాయాన్ని పొందినా.. ప్రభుత్వానికి మాత్రం చాలా తక్కువ మొత్తంలో లాభాలను చూపించిందని ఈడీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ ఫ్యాచర్ గేమింగ్ కంపెనీకి సిక్కిం ప్రభుత్వ లాటరీ స్కీమ్‌ నుంచే భారీగా లాభాలు వచ్చాయని.. ఆ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్‌ ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

About amaravatinews

Check Also

ఎప్పుడో పుట్టిన వైరస్.. ఇప్పుడెందుకు పేట్రేగుతోంది..? HMPVకి అంత సీనుందా..

హ్యూమన్‌ మెటాన్యుమో వైరస్. ఇది HMPV ఫుల్‌ నేమ్. ఆ పేరులోనే ఉంది.. ఇది మనిషిలోని ఊపిరితిత్తులకు సోకే వైరస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *