amaravatinews

విశాఖ రైల్వే జోన్‌పై అప్‌డేట్.. రైల్వే మంత్రి కీలక ప్రకటన

విశాఖ రైల్వే జోన్‌ అంశానికి సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది. రైల్వే జోన్ కోసం కొత్తగా భూమి కేటాయించనున్నట్లు మాచారం. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. విశాఖ రైల్వే జోన్ అంశమై ఏపీ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని చెప్పారు. ఈ విషయమై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా తనతో ఎప్పుటికప్పుడు మాట్లాడుతున్నారని రైల్వే మంత్రి తెలిపారు. విశాఖ రైల్వేజోన్ కార్యాలయం ఏర్పాటు కోసం గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలం.. నీళ్లు నిలిచే ప్రాంతమని.. వేరే …

Read More »

తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్.. కోడలికి పార్టీ పగ్గాలు..!?

ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏపీలో జనసేన, బీజేపీతో జట్టు కట్టి.. వైఎస్స్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిన చంద్రబాబు.. ఇప్పుడు తెలంగాణలో కనుమరుగైన టీడీపీని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. ఏపీ ఎన్నికల తర్వాత సీఎం హోదాలో తెలంగాణకు వచ్చిన చంద్రబాబుకు.. ఘన స్వాగతం లభించింది. బేగంపేట విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు బైక్ ర్యాలీతో తెలుగు తమ్ముళ్లు స్వాగతం పలికారు. గతంలో టీడీపీలో పని చేసి.. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న కాంగ్రెస్ …

Read More »

జమ్మూ కాశ్మీర్‌లో మళ్లీ ఎదురుకాల్పులు.. ఇద్దరు జవాన్లకు గాయాలు.. కొనసాగుతున్న ఆపరేషన్

గత కొన్ని నెలలుగా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతుండటం దేశం మొత్తం తీవ్ర ఆందోళనకరంగా మారాయి. సరిహద్దుల నుంచి దేశంలోని ఉగ్రవాదులు చొరబడటం, ఇక్కడ ఉన్న ఉగ్రవాద మద్దతుదారులు రెచ్చిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. త్వరలోనే జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఉగ్రవాద దాడులు రోజురోజుకూ పెరుగుతుండటం సంచలనంగా మారుతోంది. తాజాగా జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు గాయాల పాలయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో శనివారం భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య …

Read More »

ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వారికి గుడ్‌న్యూస్.. నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

Bank Deposits: గతంతో పోలిస్తే ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఇస్తున్నాయి బ్యాంకులు. అయితే, ఇతర పెట్టుబడి మార్గాల్లో అంతకు మించిన రాబడులు వస్తున్న క్రమంలో బ్యాంకుల్లో డిపాజిట్ (Fixed Deposits) చేస్తున్న వారి సంఖ్య తగ్గిపోతోంది. డిపాజిట్లు తగ్గినట్లయితే అది బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని బ్యాంకులకు కీలక సూచనలు చేశారు. బ్యాంకుల్లో డిపాజిట్లు …

Read More »

వయనాడ్‌లో ప్రధాని మోదీ.. కొండ చరియలు విరిగిపడ్డ ప్రాంతం పరిశీలన

Narendra Modi: ఇటీవల కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగినపడిన ఘటన దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. గత నెల 30 వ తేదీన వయనాడ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తులో 416 మంది దుర్మరణం చెందగా.. 150 మందికి పైగా గల్లంతయ్యారు. వందలాది మంది గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా వయనాడ్‌లో ప్రకృతి విపత్తు చోటు చేసుకున్న ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ క్రమంలోనే బాధితులకు అండగా నిలిచిన ప్రధాని …

Read More »

Varalakshmi Vratam 2024 ఈసారి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది..పూజా విధానం, శుభ ముహుర్తం ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి…

Varalakshmi Vratam 2024 హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం దీక్ష ఆచరించిన వారికి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే ఈరోజున లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. దక్షిణ భారతదేశంలో వరలక్ష్మీ వ్రతం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా, లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు ఇంట్లో సంపద, ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. …

Read More »

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం రేసులోకి అనూహ్యంగా ఆయన.. ఈ సారి ఛాన్స్ ఆ జిల్లాకేనా?

నామినేటేడ్ పోస్టులు సహా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పదవుల భర్తీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పదవుల భర్తీపై ఇప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు నేతలతో చర్చించారు. పొలిట్ బ్యూరో సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. విడతల వారీగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమయంలోనే మరో కీలక పదవిని రాయలసీమకు చెందిన ఆ నేతను ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం రాయలసీమకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా …

Read More »

మటన్ మసాలా రూ.8 వేలు, మటన్ కూర రూ.7 వేలు.. జైలులో వీఐపీ ఖైదీలకు స్పెషల్ ఫుడ్

Jail Inmates: మటన్ మసాలా రూ.8 వేలు, మటన్ కూర రూ.7 వేలు.. ఏంటి.. ఏదైనా ఫైవ్ స్టార్ హోటల్‌లో ఫుడ్ రేట్లు అనుకుంటున్నారా. కాదండీ జైలులో వీఐపీ ఖైదీలకు అందించే ఆహారం రేట్లు. అదేంటీ జైలులో అందరికీ ఒకే రకమైన భోజనం ఉంటుంది కదా అని ఆలోచిస్తున్నారా. సాధారణంగా అయితే అందరికీ ఒకే ఫుడ్ పెడతారు. కానీ కొందరు వీఐపీ ఖైదీలు మాత్రం అడ్డదారిలో జైలు సిబ్బందితో ఇలాంటి వంటకాలు తెప్పించుకుంటారు. తాజాగా ఓ జైలులో జరుగుతున్న అవినీతి ఆరోపణలు బయటికి రావడం …

Read More »

దూసుకుపోతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. ఇంటికే BSNL సిమ్ కార్డ్ డెలివరీ.. సింపుల్‌ ప్రాసెస్‌ ఇదే!

BSNL SIM Card Online : ఇటీవల రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, Vi రీఛార్జ్ ప్లాన్‌లను 15 నుంచి 20 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో అందరిచూపు ఒక్కసారిగా ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్‌ (BSNL)పై పడింది. ఈ క్రమంలో BSNL తన వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ప్రైవేట్‌ టెలికాం కంపెనీల రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు పెరిగినప్పటి నుంచి BSNL కస్టమర్లను విపరీతంగా పెంచుకుంది. ఇప్పుడు కోట్లాది మంది వినియోగదారుల కోసం BSNL కొత్త కొత్త ఆఫర్లను తీసుకువస్తోంది. ఈ …

Read More »

మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య.. నిందితులకు ఉరిశిక్ష వేస్తామన్న సీఎం

Junior Doctor: పశ్చిమ బెంగాల్‌లో మెడికల్ స్టూడెంట్‌పై హత్యాచారం జరగడం తీవ్ర దుమారం రేపుతోంది. రాజధాని కోల్‌కతాలో ఉన్న ఓ మెడికల్ కాలేజీలో అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించిన ఆ మహిళా ట్రైనీ డాక్టర్ విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిందని.. ఉదయం చూసేసరికి శవంగా కనిపించినట్లు తోటి మెడికల్ స్టూడెంట్స్ తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా.. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించగా.. కీలక విషయాలు బయటికి వచ్చాయి. బాధితురాలిపై దారుణంగా లైంగిక దాడి జరిగిందని.. ఆమె శరీరంపై, ప్రైవేటు భాగాలపై …

Read More »