Ind vs Aus 4th Test Match: బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియాకు మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ లో తెలుగు యువకుడు నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) సెంచరీతో అదరగొట్టాడు. ఆసిస్ గడ్డపై అతి పిన్న వయసులో సెంచిరీ చేసిన మూడో భారతీయ ఆటగాడిగా ఘనత సాధించాడు. 105 పరుగులతో అజేయంగా నిలిచి నాలుగో టెస్ట్లో భారత్ను ఓటమి అంచుల నుంచి గట్టెక్కించాడు.బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా …
Read More »బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేస్తున్నారా.. ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారో తెలుసా..
మూడు పూటలా కడుపు నిండా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అని పెద్దలు అంటుంటారు. ముఖ్యంగా ఉదయం టిఫిన్ తప్పకుండా చేయాలని లేకపోతే ఆరోగ్యానికి ఇబ్బంది అని అంటుంటారు. అయితే కొంత మంది మాత్రం అది తప్పని అంటుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏం లేదని..పైగా ఆరోగ్యానికి మంచిది అని అంటున్నారు. అయితే బ్రేక్ ఫాస్ట్ తినాల వద్దా? తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయి? బ్రేక్ ఫాస్ట్ చేస్తే మంచిదా..?చేయక పోతే మంచిదా? తెలుసుకుందాం..ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం, ఇప్పుడున్న …
Read More »పవన్ మన్యం పర్యటనలో అంతా తానై వ్యవహరించిన IPS.. ఆ తర్వాత సంచలన నిజం
పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ నెల 20న జరిగిన ఏపి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపం చోటుచేసుకుంది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో పవన్ కళ్యాణ్ పర్యటనకు సుమారు 1500 మంది సిబ్బందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఆ టూర్కి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ శ్యామ్, జిల్లా ఎస్పి మాధవ రెడ్డి సైతం హాజరయ్యారు. అయితే..డిసెంబర్ 20న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మన్యం జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో …
Read More »సంక్రాంతికి ఊరెళ్లేవారికి అద్దిరిపోయే శుభవార్త.. ఇది కదా కావాల్సింది
సంక్రాంతి పండుగ అంటే ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికోసం సొంత గ్రామాలకు వెళ్లేందుకు అందరూ సిద్ధం అవుతారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో హైదరాబాద్ మహానగరం సగానికిపైగా ఖాళీ అయిపోతుంది. మరి దీనికోసం ఏపీఎస్ఆర్టీసీ ఏయే ప్రణాళికలు చేసిందంటే..ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేవారి కోసం తీపికబురు చెప్పింది. సంక్రాంతి పండుగ అంటే ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు చెప్పనక్కర్లేదు. ఇందుకోసం సొంతూళ్లకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటారు. ఇప్పటికే చాలామంది టికెట్లు బుక్ చేసుకున్నారు. అందులోనూ హైదరాబాద్ నుంచి ఏపీకి …
Read More »ఎల్లలు దాటిన స్నేహం.. ఫ్రెండ్ పెళ్లి కోసం జర్మన్ నుంచి వచ్చిన దంపతులు.. హిందూ సాంప్రదాయ దుస్తులల్లో పెళ్లింట సందడి..
స్నేహానికి మించింది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. స్నేహానికన్న మిన్న ఈ లోకానా లేదురా..అనే కూడా సాంగ్ ఉంది. సరిగ్గా అలానే ఎల్లలు దాటి స్నేహం కోసం…స్నేహానికి విలువిస్తూ దేశం కాని దేశం నుంచి స్నేహితుని పెళ్లి వేడుకను కనులారా చూసి నూతన దంపతులకు ఆశీర్వాదం ఇచ్చేందుకు జర్మనీ దేశానికి చెందిన ఒక విదేశీ జంట ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో జరిగిన స్నేహితుని వివాహానికి హాజయ్యారు.ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన మాటురి ప్రియాంకకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ కు చెందిన …
Read More »శ్రీవారి భక్తులకు అలెర్ట్.. త్వరలో వైకుంఠ ద్వార సర్వ దర్శన టోకెన్లు రిలీజ్.. ఎప్పుడు, ఎక్కడ లభ్యమవుతాయంటే..
తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టిన పలు కార్యకమాల గురించి భక్తులకు తెలియజేశారు. వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేశామని చెప్పారు.వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు …
Read More »కోడి కనిపిస్తే ఫసక్.. ఒరెయ్.. మీకు ఇదేం రోగంరా బాబు..!
చోరీకి కాదేదీ అనర్హం అన్నట్లు.. దొంగలు రెచ్చిపోతున్నారు. ఎక్కడైనా విలువైన వస్తువులను దొంగతనం జరగడం గురించి విన్నాం. వీళ్లు మాత్రం వేరే రేంజ్.. చికెన్ షాపులను మాత్రమే టార్గెట్ చేస్తారు.. దర్జాగా ఆటోలో వస్తారు.. చికెన్ షాపు బయట కనిపించే కోళ్లను తస్కరిస్తారు. కోళ్లను మెల్లగా ఆటోలో వేసుకుని జారుకుంటారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో కోళ్ల మాయమవుతండటంతో అనుమానం వచ్చిన యాజమానులు సీసీ కెమెరాలను పరిశీలించడంతో అసలు వ్యవహారం బయటపడింది.ఎవరైనా విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, డబ్బు దొంగిలిస్తారు. …
Read More »అమ్మ బాబోయ్.. బెంబేలెత్తిస్తున్న బెబ్బులి..! పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతుంది. పాదముద్రల ఆధారంగా పులి కదలికను పసి గడుతున్నారు అటవీశాఖ సిబ్బంది. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. డప్పు దండోరా వేస్తూ కొత్తగూడ, నల్లబెల్లి గ్రామాల ప్రజలను అటవీశాఖ సిబ్బంది అప్రమత్తం చేసింది. బెంగాల్ టైగర్ సంచరిస్తున్నట్లు అంచనా వేసిని అటవీ శాఖ, ఆడ పులి జాడ వెతుక్కుంటూ కొత్తగూడ ఏరియాకు వచ్చినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ మగపులి కోనాపురం, ఓటాయి, కామారం సమీప అడవుల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారుఅటు అదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న పెద్ద …
Read More »రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ఇదిగో క్లారిటీ…
తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్, సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ సర్కార్ సెలవుల్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ సంక్రాంతి సెలవులపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు ఏయే తేదీల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణలో సంక్రాంతి హాలిడేస్ ఎన్ని రోజులు అనే చర్చ మొదలైంది. దీంతో అకడమిక్ …
Read More »క్లాస్ రూమ్లో ఒంటరిగా విద్యార్థిని.. ఆమె వద్దకు వెళ్లి ప్రొఫెసర్ వికృత చేష్టలు
తిరుపతి SV అగ్రికల్చర్ కాలేజీలో ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. క్లాస్ రూమ్లో ఒంటరిగా ఉన్న స్టూడెంట్తో ఉమామహేష్ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఉమామహేష్ను అదుపులోకి తీసుకొని తిరుపతి రూరల్ పీఎస్కు తరలించారు పోలీసులు.టెంపుల్ సిటీలో ఆచార్యుడి వక్రబుద్ధి బయట పడింది. క్లాస్ రూమ్లో ఒంటరిగా ఉన్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆచార్యుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర …
Read More »