నిన్నటి మధ్య అండమాన్ సముద్రం ఆనుకుని ఉన్న గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ప్రాంతంలో నున్న ఉపరితల ఆవర్తనం ఈరోజు అనగా 14 డిసెంబర్ 2024 ,ఉదయం 0830 గంటలకు దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో, డిసెంబర్ 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి రెండు రోజులలో బాగా గుర్తించబడిన అల్పపీడనంగా బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముంది. …
Read More »మొబైల్ ఫోన్ లాక్కున్నాడనీ.. టీచర్ను కత్తితో పొడిచిన స్టూడెంట్!
క్లాస్ రూంలోకి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని టీచర్లు ఎన్ని సార్లు చెప్పినా కొందరు విద్యార్ధులు తరచూ వాటిని తీసుకురావడం ఆ కాలేజీలో షరా మామూలైంది. దీంతో ఓ టీచర్ విద్యార్ధులందరినీ వెతికి వారి వద్ద నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఫోన్లు లాక్కున్న టీచర్ పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని కొందరు విద్యార్ధులు పన్నాగం పన్నారు. ఈ క్రమంలో ..కాలేజీకి మొబైల్ ఫోన్లు తెచ్చిన విద్యార్థుల నుంచి ఓ టీచర్ వాటిని స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఆగ్రహంలో ఊగిపోయిన ఇంటర్ విద్యార్థి టీచర్పై …
Read More »ఎల్కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. అపోలో ఆస్పత్రిలో చికిత్స
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా గతంలో కూడా అద్వానీ వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ చాలాసార్లు ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన వయస్సు 97 ఏళ్లు. రెండు రోజుల క్రితం అద్వానీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలోనూ వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రికి వచ్చారు. అద్వానీ రాజకీయ ప్రస్థానం.. దేశ విభజనకు ముందు ప్రస్తుతం పాకిస్థాన్ భూభాగంలోని కరాచీలో 1927 నవంబరు 08న అద్వానీ జన్మించారు. జాతీయ …
Read More »అద్దెకొచ్చి ఎంత పని చేశారురా.. చివరికి సీన్ సితారయ్యింది.!
శ్రీకాకుళం జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపాయి.జిల్లాలో రెండు వేరువేరు ఘటనలలో రూ.72.25 లక్షల దొంగ నోట్లను పోలిసులు పట్టుకున్నారు. మెళియాపుట్టి మండలం పట్టుపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని..శ్రీకాకుళం జిల్లాలో నకిలీ కరెన్సీ చెలామణి చేసే ముఠాల గుట్టును రట్టు చేశారు పోలిసులు. రెండు వేరువేరు ఘటనలలో భారీగా దొంగ నోట్లను పట్టుకున్నారు. జిల్లాలోని మెలియాపుట్టి, జి.సిగడాం పోలీస్ స్టేషన్లు పరిధిలో మొత్తం రూ. 72.25 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనలకు సంబంధించి ఎనిమిది మందిని …
Read More »ఖతర్నాక్ కిలేడీ… ఆదరించిన వారికే సున్నం పెట్టింది.. నమ్మకంగా ఉంటూ చివరకు ఇలా..
ఒంగోలులో పదినెలల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది… ఇంట్లో పడుకుని ఉన్న బాబును ఇంటి పక్కనే ఉంటున్న మరో మహిళ ఎత్తుకెళ్లింది… బాలుడు కిడ్నాపయ్యాడని తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ను పట్టుకుని బాలుడ్ని సంరక్షించారు… బాలుడ్ని తల్లిదండ్రులకు అప్పగించారు… తమ బిడ్డను సురక్షితంగా తమకు అప్పగించిన పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలు ప్రగతి నగర్లో శుక్రవారం పదినెలల బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు… ఇంటి దగ్గర ఉన్న బాలుడ్ని అదే కాలనీలో …
Read More »భారత్లో ప్రవహిస్తున్న బంగారం నది.. జల్లెడ పట్టినకొద్దీ స్వర్ణం! ఇప్పటికీ వీడని మిస్టరీ..
భారత దేశంలో ప్రవహించే ముఖ్యమైన నదులలో స్వర్ణరేఖ నది ఒకటి. దీనినే గోల్డెన్ రివర్ అని కూడా అంటారు. ఈ నది నీళ్లే కాదు, బంగారంతో ప్రవహిస్తుందని మీకు తెలుసా..? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. రోజూ అక్కడి ప్రజలు బంగారం కోసం వెతుకుతారు. ఆ కథేంటో ఇక్కడ తెలుసుకుందాం.భారత దేశం నదులకు పుట్టినిల్లు. నదిని మన దేశంలో నదీమ తల్లిగా పూజిస్తారు. దేశవ్యాప్తంగా నదులు, వాటి ఉపనదులతో కలిపి 400కు పైగా ప్రవహిస్తున్నాయి. ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకతతో పాటు ఓ …
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తా.. మీ ప్రేమతో నా హృదయం నిండిపోయింది.. అల్లు అర్జున్..
ఈ క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్. చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. అనంతరం తన తండ్రితో కలిసి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన బన్నీకి అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. బన్నీకి ఆప్యాయంగా …
Read More »ముగిసిన ఓటింగ్.. బిగ్బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
బిగ్బాస్ సీజన్ 8 ముగింపుకు చేరుకుంది. రేపు (డిసెంబర్ 15న) జరగబోయే గ్రాండ్ ఫినాలేతో ఈ సీజన్ విన్నర్ ఎవరనేది తెలియనుంది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ గౌతమ్, నబీల్, ప్రేరణ, నిఖిల్, అవినాష్ ఉన్నారు. వీరిలో ముందు నుంచి గౌతమ్, నిఖిల్ మధ్య టైటిల్ పోరు హోరా హోరీగా జరుగుతుంది. బిగ్బాస్ ఇన్ఫినిటీ సీజన్ 8 రేపటితో ఎండ్ కార్డ్ పడనుంది. 2024 సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ షో దాదాపు 105 రోజులపాటు నడిచింది. డిసెంబ్ 15న ఈ …
Read More »తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటినుంచో తెలుసా.?
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షల నిర్వహణంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపుపై రెండు సార్లు గడువు పెంచిన అధికారులు.. వార్షిక పరీక్షల తేదీలను ఖరారు చేస్తున్నారు. 2025 మార్చిలో ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు దాదాపు అధికారులు నిర్ణయానికి వచ్చారు. మార్చి చివరి నాటికి ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. అందుకనుగుణంగా మార్చి 3 తేది నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించాలని చూస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకెండ్ ఇయర్ ఎగ్జామ్స్ కి దాదాపు 15 నుంచి 20 …
Read More »చేపలను వేయించడానికి ఏ నూనె మంచిదో తెలుసా..? ఈ టిప్స్ మీ కోసమే..!
మనలో చాలా మంది చేపల కూర కంటే ఫిష్ ఫ్రైనే ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటి చేపల వేయించేటప్పుడు ఇంట్లో వంటకు ఉపయోగించే నూనెను ఉపయోగిస్తాము. అయితే ఫిష్ ఫ్రై కోసం ఉపయోగించే నూనె విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలంటున్నారు పోషకాహార నిపుణులు. చేపలను వేయించడానికి వాడే నూనెలో ఎక్కువ స్మోక్ పాయింట్ లేకపోతే, అది చేపలను వేయించేటప్పుడు తడిగా, జిడ్డుగా మారుస్తుంది. చేపలు వేగిన తరువాత కూడా పెద్దగా రుచిగా ఉండవు. కారంగా ఉంటుందని చెబుతున్నారు. మనలో చాలా మంది చేపల కూర …
Read More »