Kadam

ప్రియుడి ప్రేమకు బానిసై భార్య దారుణం.. భర్తును అడ్డుతొలగించుకునేందుకు ఏం చేసిందో తెలిస్తే..

మదనపల్లి మండలం రెడ్డి గాని పల్లెలో 39 ఏళ్ల చంద్రశేఖర్ అనుమానాస్పద మృతి నిప్పు లాంటి నిజాన్ని బయట పెట్టింది. ఈ నెల 3న జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు భర్తను హత్య చేసింది భార్యేనని తేల్చారు. చంద్రశేఖర్ భార్య రమాదేవిని అరెస్ట్ చేసి వాస్తవాలు బయట పెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డి గాని పల్లికి చెందిన చంద్రశేఖర్ రమాదేవిలకు 7 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రమాదేవి …

Read More »

వడోదర బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం… మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

గుజరాత్‌లోని వడోదరలో బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. పద్రా దగ్గర మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి కూలిపోయింది. అకస్మాత్తుగా వంతెన కూలిపోవడంతో వాహనాలు, ప్రయాణికులు నదిలో పడిపోయారు. నదిలో వాహనాలు పడిపోవడంతో 10 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే ముప్పు ఉంది. రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా వాహనాలు నదిలో …

Read More »

హైదరాబాద్‌ కల్తీకల్లు ఘటనలో ఒకరు మృతి… గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి

హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగిన ఘటనలో ఒకరు మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారం అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ కల్లు తాగి జనం అస్వస్థతకు గురికావడంతో అధికారులు యాక్షన్‌లోకి దిగారు. కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు కల్లు కాంపౌండ్లు సీజ్‌ చేశారు ఎక్సైజ్ పోలీసులు. కల్లు కాంపౌండ్ల నిర్వాహకులు పరారీలో ఉన్నారు. కూకట్‌పల్లి సమీపంలోని హైదర్‌నగర్‌లో కల్తీ కల్లు తాగి 15 …

Read More »

ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు.. ఈసారి కన్వీనర్‌ కోటా సీట్లు ఎన్ని ఉన్నాయంటే?

రాష్ట్ర వ్యప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌ గడువును జులై 9 వరకు పొడిగించినట్లు జేఎన్టీయూ ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ బి. బాలునాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. జులై 7న మొత్తం 900 విద్యార్థులకు గాను 806 మంది కౌన్సెలింగ్ హాజరయ్యారు. కాగా ఈసారి మొత్తం 171 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో.. 1.14 లక్షలకుపైగా బీటెక్‌ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం సీట్లలో కన్వీనర్‌ …

Read More »

మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలో తప్పిదాలు.. సమాధానాల స్థానంలో ‘చుక్కలు’ దర్శనం! అభ్యర్ధుల గగ్గోలు

ఇటీవల విడుదలైన మెగా డీఎస్సీ ఆన్ లైన్ పరీక్ష రెస్సాన్స్ షీట్లు చూసి అభ్యర్ధులు గుడ్లు తేలేస్తున్నారు. తాము రాసిన ప్రశ్నలకు జవాబులు రాకుండా చుక్కలు వచ్చాయని.. కొందరికి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాయనట్లు వచ్చిందని మరో అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమాధానాలు గుర్తించినా తప్పుగా చూపుతోందని, అన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించినా కొన్నింటినే ఆన్సర్‌ చేసినట్టు నమోదైందని ఆధారాలతో సహా చూపుతున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని అభ్యర్ధులంతా సోమవారం రాత్రి డైరెక్టరేట్‌ ఎదుట ఆందోళనకు దిగారు.. మెగా …

Read More »

టీటీడీ ఏఈవో రాజశేఖర్‌ బాబుపై సస్పెన్షన్ వేటు.. కారణం ఇదే!

తిరుమల తిరుపతి దేశస్థానంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏ.రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. రాజశేఖర్ బాబు టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలతో ఈవో శ్యామలరావు అతన్ను సస్పెండ్ చేశారు.  కాగా తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన రాజశేఖర్ టీటీడీలో ఏఈవోగా పనిచేస్తున్నారు. అయితే ఇతను ప్రతీ ఆదివారం స్థానికంగా ఉన్న చర్చిలో ప్రార్థనలు చేసేందుకు వెళ్తున్నారని.. అక్కడ ప్రార్థనల్లో పాల్గొంటున్నారని స్థానిక భక్తల నుంచి టీడీకి విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు అందాయి. దీంతో ఈ వ్యవహారంపై  విచారణ జరిపిన …

Read More »

ఇవాళ చిత్తూరు జిల్లాలో జగన్‌ పర్యటన… బంగారుపాళ్యం మామిడిమార్కెట్‌ను సందర్శించనున్న వైసీపీ బాస్‌

ఏపీలో మామిడిపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. రైతుల ఇబ్బందులు తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగేందుకు వైసీపీ అధినేత ఇవాళ చిత్తూరు వెళ్తున్నారు. బంగారుపాళ్యం మామిడిమార్కెట్‌ను జగన్‌ సందర్శించనున్నారు. జగన్‌ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది పోలీస్‌ శాఖ. మ్యాంగో మార్కెట్‌లో 500 మందికి మాత్రమే అనుమతించారు. హెలిప్యాడ్ దగ్గరకు 30 మందికి మాత్రమే అనుమతిచ్చారు పోలీసులు. రోడ్‌షోలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు ఎస్పీ. షరతులు ఉల్లంఘిస్తే రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పోలీస్‌ ఆంక్షలపై వైసీపీ నేతలు ఫైర్‌ అవుతున్నారు. …

Read More »

ఈదురుగాలులు బాబోయ్‌.. జరభద్రం! నేడు, రేపు వానలే వానలు..

ఆగ్నేయ దిక్కులో ఈశాన్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. మరోవైపు ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోని అల్పపీడనం వరకు సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజులు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు తెలంగాణలోని …

Read More »

ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి టార్గెట్‌గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్‌.. సీఎం చంద్రబాబు సీరియస్!

వైసీపీ నేతలపై తీరుపై మరోసారి సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టార్గెట్‌గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరం అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రశాంతి రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎంత చేసినా వైసీపీ …

Read More »

ఇవాళ ఏపీ క్యాబినెట్ భేటీ… పలు కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ఉద‌యం 11 గంట‌ల‌కు సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న మంత్రిమండలి భేటీ కానుంది. క్యాబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వ‌నుంది. ప్రభుత్వం ఇప్పటికే 54,000 ఎకరాల భూమిని సేకరించింది. మరో 20 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై ఇవాళ్టి క్యాబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. రాజధాని అమరావతిలో 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెల‌ప‌నుంది. రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్‌కు …

Read More »