Kadam

కెనడా కేంద్రంగా భారత్‌పై ఖలిస్థానీ ఉగ్రవాదుల కుట్రలు! CSIS సంచలన రిపోర్ట్‌

కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (CSIS) తాజా నివేదికలో కెనడాలోని ఖలిస్తానీ తీవ్రవాదులు భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలు, నిధుల సేకరణ, ప్రణాళికలు రచిస్తున్నారని వెల్లడించింది. ఇది భారతదేశం ఎప్పటినుంచో లేవనెత్తుతున్న ఆందోళనలను ధృవీకరిస్తుంది. కెనడా ప్రభుత్వం “ఉగ్రవాదం” అనే పదాన్ని అధికారికంగా ఉపయోగించడం ఇదే మొదటిసారి.కెనడా ప్రధాన నిఘా సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (CSIS) సంచలన సమాచారం బయటపెట్టింది. ఖలిస్తానీ తీవ్రవాదులు ప్రధానంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, నిధుల సేకరణకు, ప్రణాళిక వేయడానికి కెనడాను …

Read More »

శ్రీవారికి భక్తులు సమర్పించిన మొబైల్ ఫోన్లు ఆన్ లైన్ లో వేలం.. ఎప్పుడంటే..

కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని రకరకాల కోరికలు కోరుకుంటారు. ఆపదల మొక్కుల వాడు తమ కోర్కెని తీర్చిన తర్వాత బూరి విరాళాలను, కానుకలను సమర్పించుకుంటారు. ఇలా కానుకలుగా బంగరం వెండి వస్తువులు, నగదు, భూమి వంటి వాటితో పాటు ప్రస్తుతం మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రికల్ వస్తువులను కూడా సమర్పిస్తున్నారు. శ్రీవారికి కానుకలుగా వచ్చిన మొబైల్ ఫోన్లను ఆన్ లైన్ లో ఈ వేలం వేయనున్నది టీటీడీ. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు తిరుమల తిరుపతిలో ఉన్న ఇతర అనుబంధ …

Read More »

టోనీ బ్లెయిర్‌తో లోకేష్ భేటీ.. ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్ష

బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్(టిబిఐ) వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూడిల్లీలో భేటీ అయ్యారు. న్యూడిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో టోనీ బ్లెయిర్‌ను మంత్రి లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. గతేడాది జులై నెలలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబాయిలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఎఐ టూల్స్ …

Read More »

థాంక్ గాడ్ రక్షించినందుకు.. సోనమ్ చేతిలో రాజాకి బదులుగా నేను మరణించే వాడిని అంటున్న యువకుడు.. ఎందుకంటే..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హత్య కేసు గురించి తెలిసిందే. హనీమూన్ కి వెళ్ళిన రఘు వంశీ, సోనమ్ ల కథ ఓ సినిమా స్టోరీని తలపిస్తున్న రియల్ స్టోరీ. అయితే ఇప్పుడు మరొక సంఘటన వెలుగులోకి వచ్చి ఆశ్చర్య పరుస్తోంది. సోనమ్ చేతిలో మరణించాల్సి వ్యక్తిని నేనే.. దేవుడి దయవలన అదృష్టవశాత్తు నేను రక్షించబడ్డాను.. రఘువంశీకి మరణించాడు అని ధార్ వ్యాపారవేత్త సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు సోనమ్ జీవితంలో ఉన్న మరో రహస్యాన్ని వెల్లడించాడు. తనకు సోనమ్ పెళ్లి …

Read More »

సెల్‌ఫోన్‌ సమర్పించాలన్న ఏసీబీ నోటీసులకు కేటీఆర్‌ రిప్లై.. ఏమన్నారంటే?

ఫార్ములా-ఈ రేస్ కేసులో మొబైల్ ఫోన్ సమర్పించాలని కోరుతూ ACB జారీ చేసిన నోటీసులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ.. ఏసీబీ అధికారుల తీరు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తుందని KTR తన లేఖలో స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి కేసులలో అదే విషయాన్ని పేర్కొందని ఏసీబీకి రాసిన లేఖలో రాసుకొచ్చారు.తెలంగాణలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం …

Read More »

జంతు హింస.. పాలమూరు బయోసైన్సెస్‌పై కేసు నమోదు! ఆ ఇన్‌ఫెక్షన్లు మనుషులకు కూడా ప్రమాదమే..?

పాలమూరు బయోసైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో తీవ్రమైన జంతుహింస జరుగుతోందని జంతు హక్కుల సంస్థ ‘పెటా’ ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థపై బూత్‌పూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం కర్వెనలోని ల్యాబొరేటరీలో జంతువుల మందులు, పెస్టిసైడ్లు, వైద్య పరికరాల పనితీరును పరీక్షించడానికి అశాస్త్రీయంగా పరిశోధనలు చేస్తున్నారని ‘పెటా ఇండియా’ శాస్త్రవేత్త, రీసెర్చ్‌ పాలసీ అడ్వైజర్‌ డా.అంజనా అగర్వాల్‌ గతంలో సంచలన ఆరోపణలు చేశారు. పాలమూరు బయోసైన్సెస్‌లో 800 శునకాలను ఉంచేందుకు కేటాయించిన స్థలంలో సుమారు 1,500 ఉంచారు. దీనివల్ల అవి తరచూ …

Read More »

రైతులకు సంకెళ్లు.. రేవంత్ సర్కార్ ఆగ్రహం.. ముగ్గురు పోలీసు అధికారుల సస్పెండ్..

జోగుళాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ శివారులోని ఇథనాల్‌ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకెళ్లిన ఘటనపై రేవంత్‌ సర్కార్‌ సీరియస్‌ అయింది. ఇథనాల్ ఫ్యాక్టరీ విధ్వంసం కేసులో అరెస్టయిన 12 మంది రైతులను మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జైలు నుంచి అలంపూర్ కోర్టుకు తీసుకెళ్లే సమయంలో సంకెళ్లు వేయడాన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసు ఉన్నతాధికారులు.. ఒక ఆర్‌ఎస్సై , ఇద్దరు ఏఆర్‌ఎస్సైలను సస్పెండ్ చేశారు. ముగ్గురు సస్పెన్షన్‌కు సంబంధించి ఉత్తర్వులు …

Read More »

ఆషామాషీగా బకచర్లకు అనుమతులు రానివ్వం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ అంశం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు. సముద్రంలోకి వృథాగా పోయే జలాలనే వినియోగిస్తామని ఏపీ నేతలు చెప్పడం విస్మయం కలిగిస్తోందన్నారు. తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం త్రీపాయింట్‌ …

Read More »

జగన్‌ రెంటపాళ్ల పర్యటనపై పొలిటికల్ రచ్చ.. ఎఫెక్ట్‌ ఎలా ఉండబోతోంది..?

వందమందే రావాలన్నారు.. కానీ వందలాది మందొచ్చారు..! ఆంక్షలున్నాయ్ అదుపులో ఉండాలన్నారు.. అబ్బే అవేం పట్టవంటూ అల్లకల్లోలం చేశారు. ఫలితంగా రోజంతా టెన్షన్‌… అడుగడుగునా జనసందోహంతో సాగిన వైసీపీ అధినేత జగన్‌ పర్యటనపై పొలిటికల్‌ ఫైట్‌ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లింది. శాంతిభద్రతలకు భంగం అంటూ కూటమి కన్నెర్ర చేస్తుంటే.. పరామర్శకు వెళ్తే పగబడతారా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. మరీ టూర్‌ ఇంపాక్ట్‌ ఏపీలో ఎలా ఉండబోతోంది..? నమోదుకాబోయే కేసులెన్ని..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇసుకేస్తే రాలనంత జనం..! వందలాది మంది పోలీసులు పహారా కాసినా అదుపుచేయలేని …

Read More »

ఉలిక్కిపడిన మారేడుమిల్లి.. ఎన్‌కౌంటర్‌లో కీలక మావోయిస్టు నేతల మృతి..

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి జిల్లా రంపచోడవరం- మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు కీలక మావోయిస్టు నేతలు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యురాలు అరుణతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు, గాజర్ల రవి అలియస్‌ ఉదయ్‌, ఏవోబీ స్పెషల్‌ జోన్‌ కమిటీ ఏసీఎం అంజు ఉన్నారు. వరుస ఎన్‌కౌంటర్లతో ఇప్పటికే సతమతం అవుతున్న వేళ అల్లూరి జిల్లా ఎదురుకాల్పుల్లో ముగ్గురు కీలక నేతలు మృతి చెందడం మావోయిస్టులకు మరింత షాకిస్తోంది.అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్‌లోని కింటుకూరు …

Read More »