తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. టీటీడీ నవంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇవాళ శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణం టోకెన్ల నవంబరు నెలకు సంబంధించిన కోటాను ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అంతేకాదు నేడు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన నవంబరు నెల ఆన్ లైన్ కోటాను విడుదల చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల …
Read More »ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టీర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా కోస్తా, రాయలసీమలోని పలు …
Read More »టీటీడీ ఛైర్మన్గా ఎవరూ ఊహించని వ్యక్తి.. ఏపీ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ వైరల్, 25మందికి పదవులు!
ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల కోసం కూటమి పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.. త్వరలోనే అధికారికంగా జాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఈ నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పలువురికి నామినేటెడ్ పోస్టులు ఖాయం అయ్యాయంటూ ఓ జాబితా వైరల్ అవుతోంది. కూటమిలోని మూడు పార్టీలకు చెందిన నేతల పేర్లుో ఈ లిస్టులో ఉన్నాయి. టికెట్ దక్కని నేతలు, పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికి ప్రాధాన్యం …
Read More »నకిలీ టికెట్లతో తిరుమల దర్శనం.. 4 టికెట్లకు రూ.11 వేలు.. సిబ్బంది చేతివాటం
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం దాదాపు లక్ష మంది తిరుపతికి వస్తారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకోగా.. చాలా మంది సర్వదర్శనానికే వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలోనే సర్వదర్శనానికి 24 గంటల సమయం కూడా పడుతుంది. అయితే టికెట్ బుక్ చేసుకోకుండా వచ్చిన భక్తులు.. తిరుమలలో రద్దీ చూసి భయపడి దళారులను ఆశ్రయించి.. అధిక ధరలకు టికెట్లు కొంటూ ఉంటారు. కొన్నిసార్లు నకిలీ టికెట్లు కొని మోసపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా భక్తుల వీక్నెస్ను …
Read More »శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్ ద్వారా విడుదల చేయనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు లక్కీ డిఫ్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేస్తామని టీటీడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 21వ తేదీ వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారణ సేవా టికెట్ల విడుదల చేస్తామని …
Read More »జగన్కు ప్రతిపక్ష నేత హోదా.. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చన్నారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. తిరుపతి ఎస్వీ జంతు ప్రదర్శనశాల సందర్శించిన సభాపతి.. మొక్క నాటారు. శాసనసభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తున్నామని.. జగన్ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చన్నారు. జగన్ చేయి ఎత్తి అడిగితే మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు.. ప్రతిపక్ష హోదా విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. జగన్ ప్రతిపక్ష హోదా అంశంపై చట్టపరిధిలో ఉన్నట్లుగానే నిర్ణయాలు ఉంటాయన్నారు. అసెంబ్లీకి రాని …
Read More »Tirumala: శ్రీవారి ఆలయానికి కొప్పెర హుండీ బహూకరణ.. ఈ హుండీ ప్రత్యేకతలు ఇవే!
తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనం తర్వాత ఆ వడ్డీకాసులవాడికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మరికొంత మంది తమకు వీలైనంత మేరకు ధన, వాహన, వస్తు రూపేణా శ్రీవారి ఆలయ బాధ్యతలు చూసే టీటీడీ ట్రస్టుకు విరాళంగా అందిస్తుంటారు. ఇంకొంతమంది తిరుమల ఆలయానికి నగలు, వస్తువులు బహుమానంగా అందిస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి ఆలయానికి కొప్పెర హుండీ బహుమతిగా అందింది. కొప్పెరవారిపల్లికి చెందిన కామినేని శ్రీనివాసులు, అతని కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయానికి కుప్పెర …
Read More »తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆ టోకెన్లు పెంచే ఆలోచనలో టీటీడీ..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అలా వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ నిత్యం కృషి చేస్తూ ఉంటుంది. అయితే రద్దీ వేళల్లో శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సి ఉంటుంది. ఈ సమయాన్ని తగ్గించేందుకు కూడా టీటీడీ చర్యలు ప్రారంభించింది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఉద్యోగులను …
Read More »తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒక్కరోజులోనే, సరికొత్త రికార్డు
తిరుమల శ్రీవారి హుండీకి చాలా రోజుల తర్వాత కాసుల వర్షం కురిసింది. కొన్ని నెలల తర్వాత భారీగా ఆదాయం సమకూరింది.. చాన్నాళ్లకు స్వామివారి హుండీ ఆదాయం ఒక్క రోజులో రూ.5కోట్ల మార్కును దాటేసింది. బుధవారం తిరుమల శ్రీవారిని 72,967మంది భక్తులు దర్శించుకున్నారు.. 32,421మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి బుధవారం ఒక్కరోజే 5.26 కోట్లు ఆదాయం సమకూరింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎస్ఎస్డీ టికెట్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 10 …
Read More »టీడీపీ నేత పోస్టుతో ఆగిన ఐఏఎస్ పోస్టింగ్?.. ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
అనంతపురం జాయింట్ కలెక్టర్గా ఐఏఎస్ అధికారి డి. హరితకు ఇచ్చిన పోస్టింగ్ను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. డి. హరితను అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆమె ఇంకా జేసీగా రిపోర్టు చేయలేదు. అయితే ఈ లోపే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. పోస్టింగ్ రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం.. హరితను సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు …
Read More »