రిమాండ్ ఖైదీ అంటే 14రోజుల పాటు జైల్లో ఉంటారు. కానీ విచిత్రంగా నటుడు పోసాని కృష్ణమురళి మాత్రం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. పైగా పోసాని.. ముందు మాకే కావాలంటూ పోలీసులు క్యూ కడుతున్న పరిస్థితి. ఇంతకీ ఆయన ఎందుకు వాంటెడ్గా మారారు?ఓ వైపు ఫిర్యాదులు… ఇంకోవైపు కేసులు.. పోసాని కృష్ణమురళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి రోజుకో జైలు అన్నట్టుగా మారిపోయింది. అనుచిత వ్యాఖ్యల కేసులో నరసరావుపేట పీఎస్లో నమోదైన కేసులో పోసాని గుంటూరు జైల్లో ఉన్నారు. అయితే కర్నూలు జిల్లా …
Read More »ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక రూలింగ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా అంశంపై కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారని స్పీకర్ తెలిపారు. ఇందులో సభాపతిని, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చారని పేర్కొన్నారు. లోక్సభలో టీడీపీ నేత ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారనేది అవాస్తమన్నారు. తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు.ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక రూలింగ్ ఇచ్చారు. బెదిరింపులు, అభియోగాలతో జగన్ తనకు లేఖ రాశారన్నారు. ప్రతిపక్ష …
Read More »కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం తెలిపామా..? తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన సీఎం చంద్రబాబు
తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కృష్ణానది, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుందంటూ తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము అభ్యంతరం తెలిపలేదని.. వృధా నీటిని ఉపయోగించుకుంటున్నామని వివరించారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదం తారాస్థాయికి చేరింది.. కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతోందంటూ తెలంగాణ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి …
Read More »నాగబాబు కోసం పవన్ కల్యాణ్ సరికొత్త గేమ్ ఫ్లాన్.. మంత్రి పదవికి బదులు ఎంపీ పదవి..!
రాజ్యసభ వచ్చేలోపు కేబినెట్ హోదా ఉండే కార్పొరేషన్ పదవిని నాగబాబుకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం తిరుగుతూ, పర్యావరణానికి అనుకూలంగా ఉండే పదవిని నాగబాబుకు ఇవ్వమని ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరినట్టు సమాచారం. త్వరలో ఈ విషయంలో స్పష్టత రానుంది.మెగా బ్రదర్ నాగబాబుకు ముఖ్యమైన కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఆయన్ను ఎమ్మెల్సీని చేసి కేబినెట్లోకి తీసుకోవాలని భావించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల్లో ఒక స్థానం …
Read More »ఇదే అభివృద్ధి బడ్జెట్ అంటోన్న కూటమి ప్రభుత్వం.. వైసీపీ రియాక్షన్ ఏంటంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్కు బాటలు వేస్తూ 3.22లక్షల కోట్లతో అద్భుత బడ్జెట్ ప్రవేశపెట్టామంది కూటమి ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశామంది. అయితే బడ్జెట్పై వైసీపీ విమర్శలు గుప్పించింది. ఆత్మస్తుతి, పరనింద తప్ప బడ్జెట్ అంతగొప్పగా లేదంటూ సెటైర్లు వేసింది. దీంతో ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి..ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టారు. రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. …
Read More »ఏపీ వార్షిక బడ్జెట్లో రాజధాని అమరావతికి నిధులు! ఎన్ని కోట్లు కేటాయించారంటే..?
శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సూపర్ 6 పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు. 2025-26కు సంబంధించి రూ.3,22,359 కోట్ల భారీ బడ్జెట్ ను రూపొందించారు. వాటిలో రాజధాని అమరావతికి ఎన్ని కోట్ల నిధులు కేటాయించారో ఇప్పుడు చూద్దాం..ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఉదయం 10 గంటలకు …
Read More »గుడ్న్యూస్.. ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు అందేది ఆ నెల నుంచే..!
AP Budget 2025: ఈ బడ్జెట్లో వ్యవసాయానికి 48 వేల కోట్లను కేటాయించింది ప్రభుత్వం. అలాగే పాఠశాల విద్యాశాఖ 31,806 కేటాయించింది. ఇక బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు కేటాయించగా, వైద్యరోగ్య శాఖకు 19265 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది..ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ పథకాన్ని మే నెల నుంచి అమలు చేయనున్నట్లు బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ప్రకటించారు. తల్లికి వందనం పథకం …
Read More »అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్!
2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్టులో విద్యా, పురపాలక, తెలుగు భాషాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్, మున్సిపాలిటీలకు స్వయం పాలన, తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రణాళికలు ప్రముఖ అంశాలను ప్రస్తావించారు. ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు, మద్యపాన నిరోధక ప్రచారాలకు కూడా నిధులు కేటాయించారు.2025-26 ఆర్థిక సంవత్సరానిక గాను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో విద్యా, మున్సిపాల్టీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక …
Read More »3 లక్షల కోట్లతో ఏపీ పూర్తిస్థాయి బడ్జెట్.. అభివృద్ధికే అధిక కేటాయింపులు
అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రూ.3,22,359.33 కోట్లతో ఏపీ బడ్జెట్ ఉండగా.. రెవెన్యూ వ్యయం అంచనా- రూ.2,51,162 కోట్లని చెప్పారు. గత ప్రభుత్వ తప్పిదాలను.. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టిన ఆర్థిక మంత్రి. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని హిరోషిమాపై అణుదాడితో పోల్చారు పయ్యావుల. తమ పిల్లల భవిష్యత్ కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో.. ఇప్పుడూ అంతకు మించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు …
Read More »తుది దశకు చేరుకున్న ఏపీ బడ్జెట్ కసరత్తు.. కీలక శాఖలకు భారీగా కేటాయింపులు.!
ఓ వైపు సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాలు.. మరోవైపు అభివృద్ధి ప్రణాళికలు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆ దిశగా బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఆర్థిక మంత్రి కేశవ్తో కలిసి దీనికి తుది రూపు దిద్దుతున్నారు.ఏపీ బడ్జెట్కు కౌంట్డౌన్ మొదలైంది. ఈ బడ్జెట్కు ముఖ్య లక్ష్యం రాష్ట్ర GSDP వృద్ధి రేటు 15 శాతం సాధించడం, 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడమే. ఇందుకోసం మూలధన వ్యయాన్ని పెంచుతూ, …
Read More »