బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో షాక్ తగిలింది. నల్గొండ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పార్టీ నాయకులే కార్యాలయానికి కూల్చివేయాలని.. లేదంటే మున్సిపల్ శాఖ అధికారులు కూల్చేశారని హెచ్చరించింది. పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసేలా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆఫీస్ నిర్మాణం చేయకముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కదా..? అని ప్రశ్నించింది. పార్టీ ఆఫీసు నిర్మించిన తర్వాత ఎలా అనుమతి ఇస్తారని పిటిషనర్ను …
Read More »గంగ ఒడికి గణనాథుడు
హైదరాబాద్లో మహా నిమజ్జనం ప్రశాంతం ఈసారి పూర్తిగా నీళ్లలో ఖైరతాబాద్ గణేశుడు 25 అడుగుల లోతు.. 35 అడుగుల వెడల్పుతో వారం రోజులుగా పూడిక తీయడంతోనే రూ.30.01 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ పలుచోట్ల రూ.10 లక్షలు దాటిన వేలం నిమజ్జనం తీరుపై పొన్నం ఏరియల్ వ్యూ ఎన్టీఆర్ మార్గ్కు సీఎం.. ఏర్పాట్ల పరిశీలన పారిశుధ్య కార్మికులు, క్రేన్ ఆపరేటర్లతో మాట నిమజ్జనంపై ప్రభుత్వ వ్యవస్థల పనితీరు భేష్.. రేవంత్ పర్యవేక్షణ అభినందనీయం: రాజాసింగ్ ‘గణేశ్ మహరాజ్ కీ జై’.. ‘గణపతి బొప్పా మోరియా.. …
Read More »హమ్మయ్యా.. తగ్గిన బంగారం ధర.. వెండి రూ.1000 డౌన్..
బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త. నాలుగు రోజుల పాటు వరుసగా పెరుగుతూ బెంబేలెత్తించిన పసిడి ధరలు ఇవాళ దిగివచ్చాయి. క్రితం రోజుతో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు రికార్డ్ గరిష్ఠాల నుంచి తగ్గుముఖం పడుతున్న క్రమంలో దేశీయంగా ఆ ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోవడంతోనూ కొనుగోళ్లు కాస్త స్తబ్దుగా కొనసాగుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, పండగల సీజన్ మొదలైన క్రమంలో దేశీయంగా బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. గత ఆగస్టు …
Read More »త్వరలోనే అన్ని గ్రామాలకు ఇంటర్నెట్.. 20 MB స్పీడ్తో అన్లిమిటెడ్ డేటా.. మంత్రి తీపికబురు
తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ వినిపించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే తెలంగాణలోని అన్ని గ్రామాలకు ఫైబర్ నెట్వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చి ఇంటర్నెట్ కనెక్షన్ల సదుపాయం కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. మంగళవారం (సెప్టెంబర్ 17న) రోజున కరీంనగర్లో ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న తర్వాత.. స్థానిక ఆర్ అండ్ బీ గెస్టు హౌస్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశారు. తెలంగాణలోని అన్ని గ్రామాలకు …
Read More »అందరి చూపు సెప్టెంబర్ 17వైపే.. ఓవైపు నిమజ్జనం, మరోవైపు విమోచనం.. సర్వత్రా ఉత్కంఠ..!
ప్రస్తుతం తెలంగాణ ప్రజలందరి దృష్టి సెప్టెంబర్ 17 పైనే ఉంది. ఆరోజు హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓవైపు.. సెప్టెంబర్ 17వ తేదీనే హైదరాబాద్లో మహానిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఖైరతాబాద్ మహా గణపతితో పాటు నగర వ్యాప్తంగా ఉన్న బడా గణేషులు మంగళవారం రోజునే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కానున్నాయి. కాగా.. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం కూడా ఉండటంతో.. రాజకీయ కార్యక్రమాలు కూడా జోరుగా జరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఈరోజున వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. …
Read More »హైదరాబాద్వాసులకు ఆమ్రపాలి తీపికబురు.. నిమజ్జనానికి వచ్చేవారికి ఉచిత భోజనం..!
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాల కోలాహలం ఇప్పటికే మొదలైంది. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి సందర్భంగా గణనాథులను ప్రతిష్ఠించగా.. మూడో రోజు నుంచే నగరంలో నిమజ్జనాలు మొదలయ్యాయి. అయితే.. హైదరాబాద్లోని బడాబడా గణేషులు తొమ్మిదో రోజున లేదా పదకొండో రోజున గంగమ్మ ఒడికి చేరుకోవటం ఆనవాయతీగా వస్తోంది. ఇందులో భాగంగానే.. సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం రోజున ఖైరతాబాద్ మహగణపతి నిమజ్జనం జరగనుంది. అదే రోజున నగరవ్యాప్తంగా ఉన్న భారీ గణనాథులు కూడా.. గంగమ్మ ఒడి చేరుకునేందుకు హుస్సేన్ సాగర్కు క్యూ కట్టనున్నాయి. అయితే.. …
Read More »22 గ్రామాలకు సోలార్ పవర్.. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు, డిప్యూటీ సీఎం ఆదేశం
తెలంగాణలో డిమాండ్కు తగ్గ ఉత్పత్తి చేసేందుకు వీలుగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఇటీవల అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. వివిధ శాఖల పరిధిలో వాడుకలో లేని భూముల్లో సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పాలని ఆదేశించారు. సోలార్ విద్యుత్ను ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని రైతులకు ఫ్రీగా సోలార్ పంప్సెట్లు అందజేయాలన్నారు. తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లెలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని అధికారులకు సూచించారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా తొలిదశలో 22 గ్రామాలను …
Read More »హైదరాబాద్లో కొత్త రైల్వే స్టేషన్.. త్వరలోనే ప్రారంభం, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడు స్టేషన్ల నుంచి వివిధ రాష్ట్రాలకు ప్రధాన ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక నగర శివార్లలోని చర్లపల్లి వద్ద రూ.415 కోట్ల పెట్టుబడితో కేంద్రం కొత్త రైల్వే టెర్మినల్ నిర్మిస్తోంది. ప్యాసింజర్, గూడ్స్ ట్రైన్ల సేవలందించేకు గాను అత్యాధునిక సౌకర్యాలతో ఈ టెర్మినల్ నిర్మిస్తుంటగా.. పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. తర్వలోనే స్టేషన్ ప్రారంభం కానుండగా.. తాజాగా సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నాలుగు …
Read More »వారి అకౌంట్లలో మాత్రమే ‘రైతు భరోసా’ డబ్బులు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
వర్షాకాలం రావటంతో.. రైతులంతా ప్రభుత్వంవైపు ఆశగా చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం నగదు సాయం ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు. శుక్రవారం (సెప్టెంబర్ 13న) జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో మాట్లాడిన మంత్రి తుమ్మల.. రైతు భరోసా డబ్బులు విడుదలపై కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా డబ్బులు.. ఈసారి పంట వేసి సాగు చేస్తున్న వారికే ఇస్తామని తుమ్మల స్పష్టం చేశారు. కొండలు, గుట్టలకు ఎట్టి పరిస్థితిలో ఇవ్వబోమని క్లారిటీ …
Read More »వినాయకచవితికి బ్యాంక్ హాలిడే ఉందా? తెలుగు రాష్ట్రాల్లో శనివారం బ్యాంకులు పనిచేస్తాయా? లేదా?
సెప్టెంబర్ 7. నెలలో తొలి శనివారం. మరి బ్యాంకులకు సెలవు ఉంటుందా? ప్రతి నెలలో రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది కదా ఇలా అడుగుతున్నారేంటి అనుకుంటున్నారా? బ్యాంకులకు సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల్ని నిర్ధరిస్తుంటుంది. జాతీయ సెలవులు సహా ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు.. ఇతర ప్రాంతీయ పండగల సందర్భంగా ప్రాంతాల్ని బట్టి సెలవులు మారుతుంటాయి. జాతీయ సెలవులు మాత్రం.. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. జనవరి 26- గణతంత్ర దినోత్సవం, ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం, …
Read More »