ఏడాది కాలంగా అగ్నిగుండాన్ని తలపిస్తున్న తెలంగాణ రాజకీయాల్లో.. తాజాగా మరో సంచలనం నమోదైంది. మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదుకావడం దుమారం రేపుతోంది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ.. ఆయనను ఏవన్గా నిర్ధారించింది. ఈ అంశంపై పాలక ప్రతిపక్షాలు ఎవరివాదన వారిదే అన్నట్టుగా … పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి.ఫార్ములా E కార్ రేసుకు సంబంధించి కేటీఆర్పై కేసు నమోదు కావడం… తెలంగాణ రాజకీయాల్లో మంటలు పుట్టిస్తోంది. ఈ అంశంపై పాలక ప్రతిపక్షాలు ఎవరివాదన వారిదే అన్నట్టుగా సాగుతోంది. ఈ …
Read More »పెద్దాపూర్ గురుకులంలో వరుస పాముకాట్లు.. 2 రోజుల్లో ఇద్దరు విద్యార్ధులు ఆస్పత్రిపాలు
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్ధుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి. గురుకుల పాఠశాలల్లో నిత్యం ఏదో ఒక ఘటన చోటు చేసుకోవడంతో వార్తల్లో నిలుస్తున్నాయి. ఫుడ్ పాయిజన్, పాముకాట్లు.. సంగతి సరేసరి. ఇప్పటికే ఎందరో ఆస్పత్రి పాలవగా.. కొందరు విద్యార్ధులు మృత్యువాత పడ్డారు కూడా. తాజాగా మరో ఇద్దరు విద్యార్ధులకు పాముకాటుకు గురయ్యారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాలు సమస్యల నిలయంగా మారాయి. ఇటీవల కాలంలో వరుస ఫుడ్ పాయిజన్లు, పాముకాట్లు, విద్యార్ధులు ఆత్మహత్యలతో పలువురు విద్యార్ధులు తనువు చాలించారు. …
Read More »తెలంగాణ పాలిటిక్స్లో అతిపెద్ద సంచలనం.. మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదు!
నాలుగు సెక్షన్లు నాన్బెయిలబుల్ కేసులే పెట్టిన ఏసీబీ అధికారులు, A-1గా కేటీఆర్, A-2గా అరవింద్ కుమార్, A-3గా BLN రెడ్డి పేర్లను చేర్చారు. అధికార దుర్వినియోగం కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది.తెలంగాణ పాలిటిక్స్లో అతిపెద్ద సంచలనం.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కేటీఆర్పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. …
Read More »తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ తేదీన ఏ పరీక్షంటే
తెలంగాణ పదో తరగతి విద్యార్ధుల పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ గురువారం (డిసెంబర్ 19) విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఏ తేదీన ఏ పరీక్ష ఉంటుందో ఆ వివరాలు మీ కోసం..తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21వ తేదీ …
Read More »కానిస్టేబుళ్ల నియామకంలో వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించాల్సిందే.. హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ నియామకాల్లో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని కోరుతూ భారీ సంఖ్యలో హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా వీరి పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హోంగార్డు అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసు కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆరు వారాల్లో …
Read More »విగ్గు రాజా.. వీడు మామూలోడు కాదు.. ఏకంగా 50 మందిని..
అందమైన ఫోటోలు, ఆకర్షణీయమైన వివరాలతో తనను ఐఏఎస్, ఐపీఎస్ వంటి హోదాల్లో ఉన్న వ్యక్తిగా చూపిస్తాడు. వివాహం కోసం క్రమంగా సంబంధిత అమ్మాయి తల్లిదండ్రులతో చర్చలు మొదలుపెట్టి వారి నమ్మకాన్ని పొందుతాడు. తాను తీరా పెళ్లికి సిద్ధమయ్యాననగానే ఆర్థిక సమస్యల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు అడుగుతాడు.హైదరాబాద్ లో నిత్యపెళ్లికొడుకు వంశీకృష్ణపై మరోసారి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తప్పుడు వేషధారణతో, విగ్లు పెట్టుకుని, మ్యాట్రిమోని వెబ్సైట్లను వేదికగా చేసుకుని, అమాయకులను మోసం చేస్తూ దోచుకుంటున్న అతడి మోసాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 50 మంది అమ్మాయిల …
Read More »వామ్మో! జొమాటోలో రూ.10 వాటర్ బాటిల్ 100 రూపాయలా? కంపెనీ స్పందన ఏంటంటే?
బ్రయాన్ ఆడమ్స్ కాన్సర్ట్లో వాటర్ బాటిళ్ల విక్రయానికి సంబంధించి హైదరాబాద్ టెక్కీ ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి ఆఫ్ లీటర్ వాటర్ బాటిల్ రూ. 10 మాత్రమే. కానీ, ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫారమ్ జొమాటో అదే వాటర్ బాటిల్ ను 100 రూపాయలకు విక్రయిస్తుందని చెప్పడమే ఈ పోస్ట్ సారాంశంహైదరాబాద్ కు చెందిన పల్లబ్ దే ఐటీ ఉద్యోగి. ఇటీవల అతను బ్రయాన్ ఆడమ్స్ మ్యూజిక్ కన్సర్ట్లో పాల్గొన్నాడు. ఆ …
Read More »తాతకి తెలియకుండా అసెంబ్లీకి మనమరాలు.. కట్ చేస్తే.. సర్ప్రైజ్ ఇచ్చిన ఎమ్మెల్యే
తెలంగాణలో గత రోజులుగా శీతకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గ్యాలరీ పాసులు తీసుకొని విద్యార్థులకు సమావేశాలు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా చూపిస్తారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వచ్చారన్న విషయం తెలుసుకున్న ఓ ఎమ్మెల్యే సమావేశాల నుంచి బయటకు వచ్చి ఓ పాపను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఇంతకీ ఆ పాప ఎవరు?అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే వాటిని చూసేందుకు ప్రజల్లోనూ, విద్యార్థుల్లోనూ ఎంతో ఆసక్తి ఉంటుంది. మన ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తాయి, చట్టాల రూపకల్పన ఎలా జరుగుతుందో విద్యార్థులకు తెలిపేందుకు ఆయా …
Read More »ధరణి కంటే భూభారతి ఏ విధంగా గ్రేట్? రైతుల భూ సమస్యలన్నీ తీరుస్తుందా?
ధరణి ఓ అద్భుతం అన్నారు. ఎంతో కసరత్తు చేసి మరీ కొత్త చట్టం తీసుకొచ్చామన్నారు. కాని, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా కనిపించింది. ధరణిని సెట్రైట్ చేస్తున్న కొద్దీ కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. మరి.. భూభారతి ఎలా ఉండబోతోంది? ఎలాంటి సమస్య లేకుండా పరిష్కారం లభిస్తుందా?ధరణి.. ఇకపై భూ భారతిగా మారుతోంది. ధరణి స్థానంలో భూమాతను తెస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే.. భూ సమస్యల నివారణకు తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. భూ దస్త్రాలు, యాజమాన్య …
Read More »వీడేం దొంగరా సామీ..! చోరీకి వచ్చి ఏం ఎత్తుకెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
వాళ్లు మామూలు దొంగలు కాదు. సింపుల్గా వస్తారు. గేటు తీసుకుని దర్జాగా వెళ్తారు. ఏదో అందినకాడికి తీసుకెళ్లే రకం కాదు.. ఇంట్లో కనిపించిన నీళ్ల బిందెను ఎత్తుకెళ్లారు. ఈ తతంగం అంతా ఇంటి అవరణలో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.మనం దొంగతనాలు గురించి వింటూ ఉంటాం..! మనం కూడా కొన్ని సందర్భాల్లో బాధితులమే.. రకరకాల దొంగతనాలు చూసి ఉంటాం. ఈ విచిత్ర దొంగతనం కొంచెం కామెడీగా ఉంది. కానీ నిజం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో విచిత్ర దొంగతనం జరిగింది. స్థానికుల …
Read More »