దసరా పండుగ రోజు ఏపీకి కేంద్రం సూపర్ న్యూస్.. మరోసారి నిధుల విడుదల.. ఈసారి ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం కింద తొలి విడతగా ఏపీకి రూ.593.26 కోట్లు నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు ఈ నిధులు కేటాయిస్తారు. మరోవైపు ఇటీవలే కేంద్రం గోదావరి పుష్కరాలకు సైతం నిధులు విడుదల చేసింది. అఖండ గోదావరి ప్రాజెక్టు కింద తూర్పుగోదావరి జిల్లాలో పుష్కర పనుల కోసం రూ.100 కోట్లు విడుదల చేశారు.2027లో గోదావరి పుష్కరాలు రానున్నాయి. అప్పటిలోగా ఈ నిధుల సాయం పుష్కర ఘాట్లు, ఇతరత్రా ఏర్పాట్లు చేయనున్నారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నుల్లో వాటా కూడా విడుదల చేసింది. రాష్ట్రాలకు పన్నుల్లో వాటా కింద 1,78,173 కోట్ల రూపాయలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 2024 అక్టోబర్ నెలలో చెల్లించాల్సిన సాధారణ వాయిదాకు అదనంగా ఒక ముందస్తు వాయిదా విడుదల చేసింది. పండుగల సీజన్‌ నేపథ్యంలో.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి వీలుగా పన్నుల వాటా విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన పన్నుల వాటాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 7,211 కోట్లు, తెలంగాణకు రూ. 3,745 కోట్లు వచ్చాయి. ఈ లోపే 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

About amaravatinews

Check Also

డైరెక్టర్ ఆర్జీవీకి మరో తలనొప్పి.. ఈసారి రంగంలోకి సీఐడీ.. విచారణకు హాజరయ్యేనా…

2019లో రామ్‌గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో ఓ సినిమా తీశారు. ఆ మూవీపై తెలంగాణ హైకోర్టులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *