ఈ రోజుల్లో ఇలాంటి శిక్షలా..? మాజీ మావోయిస్టు చనిపోతే ఒక్కరూ రాలే..!

కాలం మారుతున్నా.. కొందరు దురాచారాలను మాత్రం వీడటం లేదు. కులం పేరుతో ఇప్పటికీ దారుణాలకు పాల్పడుతున్నారు. మనిషి బతికున్నప్పడే కాదు.. చనిపోయిన తర్వాత కూడా వారిని హింసిస్తున్నారు. తాజాగా అటువంటి దారుణ ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకునంది. ఓ మాజీ మావోయిస్టు చనిపోతే.. కుల కట్టుబాట్లకు తలొగ్గి ఎవరూ అంత్యక్రియల్లో పాల్గొనలేదు. చివరకు డబ్బు కొట్టేవాళ్లు కూడా రాకపోవటంతో పక్క గ్రామం నుంచి రప్పించి రెండు కుటుంబాల వారే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా అక్భర్పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన బండమీది సాయిలు(71) మాజీ మావోయిస్టు. 1975 నుంచి 1985 వరకు ఆయన పీపుల్స్వార్ పార్టీలో పని చేశారు. తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసిపోయాడు. భార్య, బిడ్డలతో కలిసి గ్రామంలోనే ఉంటున్నాడు. గ్రామంలోనే సాయిలుతో పాటు ఆయన అన్న కుటుంబీకులు కూడా నివాసముంటున్నారు. దళితుడైన సాయిలు కుటుంబానికి, మరో దళిత ఫ్యామిలీకి గత కొంతకాలంగా భూవివాదం తలెత్తింది. దీంతో పదిహేను రోజుల కింద ఈ విషయంలో గ్రామంలోనే కుల పెద్ద మనుషులు పంచాయితీ పెట్టారు.

About amaravatinews

Check Also

ఇక విద్యార్థుల సెల్‌ఫోన్లకే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. మంత్రి లోకేశ్‌ వెల్లడి

మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ 2.0 వెర్షన్‌ను మరిన్ని సేవలకు అనుసంధానిస్తున్నట్లు మంత్రి లోకేష్‌ శాసనసభలో తెలిపారు. ఈ ఏఐ ఆధారిత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *