వేసవి చివరిలో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. జూన్‌లో ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా

ఆపదమొక్కుల వాడు కోనేటి రాయుడు మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది తిరుమల కొండ కిటికిట లాడింది. జూన్ నెలలో సగటున 80వేల మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకోవడంతో హుండీ ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది. అవును జూన్ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో హుండీ ఆదాయం కూడా రికార్డ్ స్థాయిలో లభించిందని టీటీడీ ప్రకటించింది.తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో అపరకుభేరుడు ఆయనే. వెంకన్న ఆదాయం కూడా ఇప్పుడు అంతకంతకు పెరుగుతుండటమే నిదర్శనం. తిరుమలేశుడి ఆదాయంలో హుండీ ఆదాయం కీలకంగా మారిపోవడంతో …

Read More »

అవన్నీ అవాస్తవాలు.. భక్తులు నమ్మొద్దంటూ టీటీడీ విజ్ఞప్తి.. ఎందుకంటే

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరతారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కలు తీర్చుకుంటారు. అయితే తిరుమల క్షేత్రంలో హోటల్స్ లో లభించే ఆహారపదార్ధాల ధరల గురించి టీటీడీ తాజాగా ఓ ప్రకటన రిలీజ్ చేసింది.తిరుమల తిరుపతి క్షేత్రం హిందువులకు పరమ అవిత్రమైన స్థలం. కలియుగ వైకుంఠం క్షేత్రం తిరుమలలో కొలువైన స్వామివారిని దర్శించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటారు. కోనేటి రాయుడి కోసం తిరుమలకు చేరుకుంటారు. …

Read More »

8 రోజులు, 5 దేశాలు.. దశాబ్దంలోనే సుదీర్ఘ విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ..

భారత ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల సుదీర్ఘ పర్యటనకు బయలుదేరనున్నారు. గత దశాబ్ద కాలంలో మోడీ చేస్తున్న అత్యంత సుదీర్ఘమైన విదేశీ పర్యటన ఇది. ఈ పర్యటనలో ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను సందర్శించనున్నారు. ముఖ్యంగా బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం ఈ పర్యటనలోని ప్రధాన ఉద్దేశ్యం. గ్లోబల్ సౌత్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, వాణిజ్యం, రక్షణ, శక్తి రంగాల్లో సహకారాన్ని …

Read More »

ఆ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో సంబంధం లేదు

ఆకస్మిక మరణాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ తో ఎటువంటి సంబంధం లేదని వెల్లడించింది. ICMR, AIIMS చేసిన అధ్యయనాలలో కోవిడ్-19 వ్యాక్సిన్లకి ఆకస్మిక మరణాలకు మధ్య ఎటువంటి సంబంధం లేదని తేలిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది.కాసేపట్లో పెళ్లి అందరూ సంతోషంగా ఉన్న వేళ వరుడు కుప్పకూలి చనిపోతాడు..100 కేజీల బరువెత్తె సామర్థ్యం ఉన్న యుకుడు జిమ్ చేస్తూ అకస్మాత్తుగా ప్రాణాలు వదులుతాడు. సరదాగా ఫ్రెండ్స్ తో ప్లే గ్రౌండ్ లో క్రికెట్ …

Read More »

హస్తినలో ధూంధాంగా లాల్ దర్వాజ బోనాలు.. ఇండియా గేట్ వద్ద విరిసిన తెలంగాణ సంస్కృతీ శోభ..

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వాటి నుంచి బోనాలు, బతుకమ్మ సహా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా తెలంగాణ పండుగలను ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు జరగని వేడుకలు సైతం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎంతో వైభవంగా తెలంగాణ పండుగలు ఢిల్లీలో జరుగుతున్నాయి. జూన్‌ 30 సోమవారం తెలంగాణ గవర్నర్ జిష్ణు వర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ధూంధాంగా నిర్వహించారు.11 ఏళ్లుగా సింహవాహిని శ్రీ మహంకాళి …

Read More »

పార్టీలకు అసలు సిసలు సంజీవనిగా బనకచర్ల.. మూడు పార్టీల మధ్య సర్కస్ ఫీట్లు

తెలంగాణలో రాజకీయ పార్టీలకు అసలు సిసలు సంజీవనిగా మారింది బనకచర్ల. కాసేపు ఓ పార్టీకి పాజిటివ్‌గా మారి.. ఆ వెంటనే ఇంకో పార్టీ వైపు బెండవుతూ.. మూడు పార్టీలతో దాగుడుమూతలాడుతోంది బనకచర్ల టాపిక్. ప్రస్తుతానికి బనకచర్లలో ఏ పార్టీది అప్పర్‌హ్యాండ్.. ఏ పార్టీ వెనకబడింది..?ఇన్నాళ్లూ రెండు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ సెగ రేపింది గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు. అనుమతులు అంత ఈజీగా ఇచ్చేది లేదని డీపీఆర్‌ను కేంద్రప్రభుత్వం తిరుగుటపాలో పంపడంతో ఇంట్రస్టింగ్ టర్న్ తీసుకుంది. మరి.. బనకచర్ల వివాదం టీకప్పులో తుపానుగా మారి చప్పున చల్లారిపోయినట్టేనా? ఇలా …

Read More »

తెలంగాణ కుంభమేళ.. మేడారం మహా జాతర తేదీలు ఖరారు.. ఎప్పుడంటే

30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని, 31న అమ్మవార్ల వనప్రవేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. మూడో రోజునే గద్దెలపై కొలువుదీరి ఉన్న సమ్మక్క, సారలమ్మ వనదేవతలు, గోవింద రాజు, పగిడిద్దరాజుల వారి వన ప్రవేశం కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ మేరకు పూజారులు తేదీలను నిర్ణయించారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరగనుంది.ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది మేడారం మహా జాతర.. ఈ మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే …

Read More »

సిగాచీ ప్రమాదం..పోలీసుల ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు

సిగాచీ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ఇప్పటివరకు 43మంది కార్మికులు మరణించిగా.. ఇంకా పలువురి మృతదేహాలు లభ్యం కాలేదు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ ముమ్మరం చేశారు. ఎఫ్ఐఆర్ లో పోలీసులు సంచలన విషయాలు నమోదు చేశారు.పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ఇప్పటివరకు 43మంది కార్మికులు మరణించగా.. ఇంకా పలువురి మృతదేహాలు లభ్యం కాలేదు. మరోవైపు సహాయక …

Read More »

అంజనీపుత్రునికి 10 వేల వడలతో అభిషేకం.. ఎక్కడంటే…?

దేవుడికి జలాభిషేకం, పాలాభిషేకం, పుష్పఅభిషేకం చేయడం చూసాం కానీ శ్రీకాకుళం జిల్లాలో భక్తులు వడలతో అభిషేకం చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. జిల్లాలోని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ లోగల ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీ ఆంజనేయ ట్రాలీ రిక్షా యూనియన్ కార్మికులు అంజనీసుతునికి నోరూరించే 10,116 (పదివేల నూటపదహారు) వడలతో అభిషేకం చేసి పట్టణంలో హాట్ టాపిక్ గా నిలిచారు.ఆంజనేయ స్వామికి వడలు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయనకు చాలామంది భక్తులు వడలను నైవేద్యంగా సమర్పిస్తారు. కొందరు ఈ వడలనే మాలగా కూర్చి వడ …

Read More »

పాశమైలారం ప్రమాదంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. ఫార్మా ఇండస్ట్రీస్‌లో తప్పనిసరి ప్రోటోకాల్స్

పాశమైలారం ప్రమాదంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కెమికల్ ఫ్యాక్టరీల్లో సెఫ్టీ కమిటీ సమావేశాలు నిర్వహించాలి, మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ ఏపీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రమాదం అంతులేని విషాదం నింపింది. బాధితుల ఆర్తనాదాలతో ఫ్యాక్టరీ ప్రాంగణం సహా హాస్పిటల్ పరిసరాలు కంటతడి పెడుతున్నాయి. ఎవరిని కదిలించినా కన్నీళ్లు దారలైపోతున్నాయి. ఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రసాయన కంపెనీల్లో తనిఖీలు నిర్వహించి లోపాలు గుర్తించాలన్నారు. పాశమైలారం ప్రమాదంతో …

Read More »

తిరుమలలో చిరుత సంచారం.. అన్నమయ్య భవన్ సమీపంలో మాటువేసి..

చిరుతను మొబైల్ లో క్యాప్చర్ చేసిన యువకులు అటవీ ప్రాంతంలోకి తరిమేసే ప్రయత్నం చేసారు. ఆటో, బైక్ లైటింగ్ సాయంతో శబ్దాలు చేస్తూ చిరుతను తరిమేందుకు ప్రయత్నం చేశారు. కాసేపు అక్కడే మాటు వేసిన చిరుత ఆ తరువాత అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోవడంతో అలిపిరి నుంచి జూ పార్క్ రోడ్డులో వెళ్లేవాళ్లు, కంటి ఆసుపత్రికి వచ్చిన వారు ఊపిరి పీల్చుకున్నారు.శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న చిరుతలు జనాన్ని భయపెడుతున్నాయి. జనావాసాల్లోకి వచ్చి సందడి చేస్తుండడంతో భక్తుల్లో అలజడి రేపుతోంది. జులై 1 …

Read More »

హైదరాబాద్‌లో ఏనుగు దంతాల కేసు.. కట్‌చేస్తే.. తిరుమల శేషాచలంలో కదిలిన డొంక..!

శేషాచలం అటవీ ప్రాంతం దట్టమైన అడవులు అరుదైన వృక్ష జంతు జాతులకు నిలయం. అయితే ఈ మధ్య స్మగ్లర్ల బెడద శేషాచలం కొండల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎర్రచందనం స్మగ్లర్ల అలజడి ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే ఇప్పుడు ఏనుగుల దంతాల కేసు మూలాలు శేషాచలం అటవీ ప్రాంతానికి ముడి పెట్టడంతో అటవీశాఖలో ఆందోళన ప్రారంభమైంది. ఎర్రచందనం చెట్లు నేలకొరుగుతున్నట్లే వన్యప్రాణులు కూడా అంత మొందుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. తాజాగా హైదరాబాదులో నమోదైన ఏనుగు దంతాల కేసు ఉమ్మడి చిత్తూరు జిల్లా అటవీ శాఖను భయపెడుతోంది. …

Read More »

మినీ యుద్ధ ట్యాంకర్ ను తయారు చేసి.. దేశ రక్షణకు నేను సైతం అంటున్న కాకినాడ కుర్రోడు

పాకిస్తాన్ కి భారతదేశానికి యుద్ధం జరిగిన ప్రతిసారి దేశ రక్షణలో తను కూడా భాగస్వామ్యం అవలేనందుకు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు ఓ యువకుడు. యుద్ధంలో పాల్గొనేందుకు తనకి వీలు లేకపోవడంతో యుద్ధానికి ఉపయోగపడే ఓ డమ్మీ వెపన్ లను, యుద్ధ ట్యాంకర్ వాహనాన్ని. తయారు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహాయం చేస్తే దేశ రక్షణ కోసం యుద్ద పరికరాలు చేస్తానని చెబుతున్నాడు.కాకినాడ జిల్లాకు చెందిన యువకుడు గతంలో ఏకీ 47, ఆర్ ఎఫ్ ఎల్ రైఫిల్, మినీ యుద్ధ …

Read More »

ఏపీ విద్యార్ధులకు బిగ్ అలెర్ట్.. రూ. 15 వేలు కావాలంటే ఇలా చేయాల్సిందే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యార్థుల తల్లుల కోసం అమలవుతున్న “తల్లికి వందనం” కార్యక్రమానికి నేటితో (జూలై 2, మంగళవారం) చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ఒకటో తరగతిలో చేరిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు బదిలీ చేస్తోంది. ఇవాళ సాయంత్రం వరకే ఆఖరి అవకాశం ఉన్నందున విద్యార్థుల తల్లులు అవసరమైన వివరాలు వెంటనే సమర్పించాలని అధికారులు సూచించారు. తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, విద్యకు ప్రాధాన్యతనిస్తూ “తల్లికి వందనం” పథకాన్ని పునఃప్రారంభించింది. ఈ పథకం …

Read More »

ఆషాడ మాసంలో.. శాంకాంబరిగా అన్నపూర్ణమ్మ ప్రత్యేక అలంకరణ!

భీమవరం పంచారామ క్షేత్రం శ్రీఉమా సోమేశ్వరజనార్దన స్వామి ఆలయంలో కొలువై ఉన్న అన్నపూర్ణాదేవి అమ్మవారికి ఆషాడ మాసం సందర్భంగా శాకాంబరీ అలంకరణ చేశారు. వంద కిలోల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలుతో ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. సోమేశ్వరస్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి..పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రం శ్రీఉమా సోమేశ్వరజనార్దన స్వామి ఆలయంలో కొలువై ఉన్న అన్నపూర్ణాదేవి అమ్మవారికి ఆషాడ మాసం సందర్భంగా శాకాంబరీ అలంకరణ చేశారు. వంద కిలోల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలుతో ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. …

Read More »