లక్షలాదిమంది రైతులకు గుడ్‌ న్యూస్‌ అంటోన్న కాంగ్రెస్‌ సర్కార్‌

లక్షలాదిమంది రైతులకు గుడ్‌ న్యూస్‌ అంటోంది తెలంగాణలోని కాంగ్రెస్‌ సర్కార్‌. తెలంగాణలో ఏప్రిల్ 14, సోమవారం నుంచి భూ భారతి చట్టం అమల్లోకి రాబోతుంది. ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్‌ కూడా అందుబాటులోకి రానుంది. ప్రజల నుంచి వచ్చే సూచనలు, సలహాలతో పోర్టల్‌ను మరింత పటిష్టంగా రూపొందించాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు.తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానుంది. ఆర్వోఆర్‌-2020 స్థానంలో ఆర్వోఆర్‌-2025 భూభారతి చట్టాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమల్లోకి తీసుకురానున్నారు. దీంతోపాటు ధరణి స్థానంలో భూ …

Read More »

ఇక సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులు.. ఉచిత రవాణా సౌకర్యం కూడా!

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై ప్రీ ప్రైమరీ తరగతులు కూడా ప్రారంభించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం సర్కారు బడుల్లో ఒకటో తరగతి నుంచి మాత్రమే చదువుకునే అవకాశం ఉంది. అంగన్‌వాడీ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ నిర్వహించేవారు. ఇక ప్రైవేట్‌ పాఠశాలల్లో అయితే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నడుస్తున్నాయి. దీంతో మూడేళ్లు నిండిన పిల్లలను తల్లిదండ్రులు ప్రైవేట్‌ పాఠశాలల్లో మాత్రమే చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తే అటు తల్లిదండ్రులకు ఆర్ధిక …

Read More »

రేపటితో ముగుస్తున్న ‘టెన్త్’ జవాబు పత్రాల మూల్యాంకనం.. ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. పరీక్షలు ముగిశాక ఏప్రిల్ 7వ తేదీ నుంచే జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ఏప్రిల్ 15వ తేదీతో ముగియనుంది. అయితే టార్గెట్ తేదీలోపు మూల్యాంకనం పూర్తి చేసేందుకు హడావుడిగా పేపర్లు దిద్దుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఒక్కో అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ చేత రోజుకు 50 పేపర్లు మూల్యాంకనం చేయిస్తున్నట్టు టీచర్లు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని …

Read More »

రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి!

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు నివాళులర్పించారు. దేశానికి ఆయన …

Read More »

శ్రీవారి సేవలో పవన్‌కల్యాణ్‌ సతీమణి.. స్వామివారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు చెల్లించుకున్న అన్నాకొణిదెల

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అన్నా లెజీనోవాల తనయుడు శంక‌ర్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడంతో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి తన మొక్కులు తీర్చుకున్నారు అన్నా లెజీనోవా. సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు.కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా కొణిదల గారికి వేద పండితులు …

Read More »

ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!

చదువంటే ఉద్యోగం తెచ్చిపెట్టే సాధనం మాత్రమే. అదే జీవితం కాదు. చదువులేని వారు కూడా ఎంతో మంది ఉన్నత శిఖరాలు చేరుకున్నారు. వారిని స్పూర్తిగా చేసుకుని కూడా నచ్చిన రంగాల్లో రాణించవచ్చు. ఒక్క పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, అనుకునన్ని మార్కులు రాలేదనో జీవితాన్నే బలితీసుకోవడం ఎంత వరకు న్యాయం..రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసిన విద్యార్ధుల ఫలితాలు శనివారం (ఏప్రిల్ 12) విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజా ఫలితాల్లో కొందరు విద్యార్ధులు ఫెయిల్‌ కావడంతో పలు చోట్ల వరుస ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ …

Read More »

అనకాపల్లి ఘటనపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన!

అనకాపల్లి జిల్లాలో బాణసంచా పేలుడు ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న కోటవురట్ల పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో ఇప్పటికే ఫోరెన్సిక్‌ టీమ్ ఆధారాలు సేకరించగా..పరిమితికి మించి బాణసంచా ఉండడంతోనే భారీ పేలుడు జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ 2012 నుంచి ఈ బాణాసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తుండగా..నిన్న జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో 8 మంది హాస్పిటల్‌లో చికిత్స …

Read More »

చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. మరో 44 వేల ఎకరాల భూ సేకరణకు సన్నద్ధం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటోంది. అమరావతిని ఒక సమగ్ర, ప్రగతిశీల రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. రాజధానిలో పెరుగుతున్న అవసరాలు, కీలక పౌర సదుపాయాలకు స్థలాభావం కారణంగా మరో 44,676 ఎకరాల భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటోంది. అమరావతిని ఒక సమగ్ర, ప్రగతిశీల రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. …

Read More »

గుడ్‌న్యూస్‌.. ఓలా, ఉబర్‌, ర్యాపిడో దోపిడికి చెక్‌.. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకార్‌ యాప్‌!

ప్రధాన నగరాల్లో ఓలా, ఉబర్‌, ర్యాపిడోల వినియోగం బాగా పెరిగిపోయింది. విపరీతంగా పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా.. ఆయా కంపెనీలు వినియోగదారుల నుంచి భారీగా ఛార్జీలు వస్తూలు చేస్తున్నాయి. అలా అని క్యాబ్‌ డ్రైవర్లు అంతే మొత్తం చెల్లించడం లేదు. కస్టమర్‌ నుంచి తీసుకున్న ఛార్జీలో భారీగా కోత విధించి.. మిగతా డబ్బును డ్రైవర్లకు, రైడర్లకు చెల్లిస్తున్నాయి. వీటిపై డ్రైవర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సూపర్‌ ఐడియాతో ముందుకు వచ్చింది. సహకార్‌ ట్యాక్సీ పేరుతో ఒక …

Read More »

కలియుగంలో అపర కుభేరుడు ఆయనే.. అంతకంతకూ పెరుగుతున్న వెంకన్న ఆదాయం

కలియుగంలో అపరకుభేరుడు ఆయనే. వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతుండటమే అందుకు నిదర్శనం.  అయితే ఇటు హుండీ, అటు డిపాజిట్లపై వచ్చే వడ్డీనే ఆదాయంలో సింహం భాగం. రూ. 5258 కోట్ల టీటీడీ అంచనా బడ్జెట్‌లో ఈ విషయం మరోసారి స్పష్టం అయ్యింది. రూ. 1729 కోట్లు హుండీ ఆదాయంతో పాటు డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూ. 1310 కోట్లు వరకు ఉండనుంది. కోవిడ్ తర్వాత దాదాపు రెండింతలైన హుండీ ఆదాయంతో వెంకన్న ఆస్తుల విలువ కొండంత అవుతోంది. తిరుమలేశుడు.. వెల కట్టలేని ఆస్తులున్న సంపన్నుడు. …

Read More »

యేళ్లుగా నానుతున్న కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం.. త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలన

రాష్ట్ర నిరుద్యోగులకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ తీపికబురు చెప్పారు. యేళ్లకేళ్లుగా నానుతున్న కానిస్టేబుల్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఎట్టకేలకు న్యాయం జరగనుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభంకానున్నట్లు తాజాగా వెల్లడించారు. దీంతో నిరుద్యోగుల్లో సంతోషం వెల్లివిరిసింది..యేళ్లకేళ్లుగా నానుతున్న 2018 బ్యాచ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఎట్టకేలకు సర్కార్ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ అభ్యర్ధులకు త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభంకానుందని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ వెల్లడించారు. ఆయన ఈ మేరకు వెల్లడించారని రాష్ట్ర …

Read More »

వారికి 30 ఏళ్లు పట్టింది.. తెలంగాణ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..

తానొక్కడనే పరుగెత్తడం కాదు.. ఇకపై మిమ్మల్నీ పరుగెత్తిస్తా.. బీ క్లియర్‌.. ఇవీ.. రెండోరోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కామెంట్స్‌.. ఎస్‌.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి వేదికగా జరిగిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సు ముగిసింది. పలు కీలక అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు.. చివరి రోజు సమావేశంలో ఏపీ అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులపాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సు గతానికి భిన్నంగా జరిగింది. సుదీర్ఘ ప్రజంటేషన్లు, పేజీలకు పేజీల …

Read More »

తగ్గేదేలే.. ఏపీలో ఉప ఎన్నికల పంచాయితీ.. 9 ప్రాంతాల్లో హోరీ హోరీ..

ఎలక్షన్‌ ఏదైనా ఎలక్షనే అంటున్నాయి..ఏపీలో అధికార, విపక్ష పార్టీలు.. అది జడ్పీ చైర్మన్‌ ఎన్నికైనా.. ఉపసర్పంచ్‌ ఎన్నికైనా తగ్గేదేలేదంటూ పోటాపోటీగా క్యాంప్‌ రాజకీయాలకు తెరతీశాయి.. దీంతో నేడు కడపసహా పలు జిల్లాల్లో జరగనున్న లోకల్ బాడీ బై ఎలక్షన్స్..హీట్‌ పుటిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ 9 చోట్ల లోకల్‌బాడీ ఉప ఎన్నికలు జరగనున్నాయి..ఎలక్షన్‌ ఏదైనా ఎలక్షనే అంటున్నాయి..ఏపీలో అధికార, విపక్ష పార్టీలు.. అది జడ్పీ చైర్మన్‌ ఎన్నికైనా.. ఉపసర్పంచ్‌ ఎన్నికైనా తగ్గేదేలేదంటూ పోటాపోటీగా క్యాంప్‌ రాజకీయాలకు తెరతీశాయి.. దీంతో నేడు కడపసహా పలు జిల్లాల్లో జరగనున్న …

Read More »

మెట్రో స్టేషన్లలో వాహనాలు పార్క్ చేస్తున్నారా..? అయితే మీరూ బాధితులే

డియర్ ప్యాసింజర్స్‌ దయచేసి వినండి.. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించేందుకు మీ బండిని స్టేషన్లలో పార్క్ చేస్తున్నారా? అయితే.. మీ వాహనం ఎండకు మాడిపోవచ్చు.. వానకు తడవొచ్చు.. గాలి దుమారానికి కొట్టుకుపోవచ్చు. అడిగినంత చార్జీలు చెల్లించండి.. కానీ కనీస సౌకర్యాలు ఎక్కడని అడగొద్దంటోంది హైదరాబాద్‌ మెట్రో. అంతేకాదూ.. గాడీ గాయబ్ అయినా ప్రశ్నించొద్దని తెగేసి చెబుతోంది. ఇన్ని చెబుతూనే.. బాదుడే బాదుడుకి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌ మెట్రో వసూళ్ల పర్వానికి.. సగటు వాహనదారుడు బెంబేలెత్తిపోతున్నాడు.హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో బాదుడే బాదుడు ఏ స్థాయిలో ఉందో ఓసారి …

Read More »

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్‌లో ఎన్ని రోజులు సెలవులో తెలుసా?

పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. సెలవుల్లో ఎంజాయ్‌ చేయాలనే ఆనందంలో మునిగిపోతారు. అయితే ఇప్పుడు సమ్మర్‌ హాలిడేస్‌ రానున్నాయి. కానీ అంతకు ముందు అంటే ఏప్రిల్‌ నెలలో కూడా పాఠశాలలకు సెలవులు వస్తున్నాయి. ఇందులో పండగలు, ఇతర కార్యక్రమాల సందర్బంగా సెలవులు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. మార్చి 31వ తేదీ రంజాన్ పండుగ ఉంది. ఈ నేపథ్యంలో మరుసటి రోజు అంటే ఏప్రిల్ 1వ తేదీ కూడా పండుగ సెలవులు ఉంటుంది. దీంతో రంజాన్‌కు రెండు రోజులు సెలవులు రానున్నాయి. …

Read More »