రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడూల్ను ఉన్నత విద్యా మండలి ఈ రోజు విడుదల చేయనుంది. ఆయా ప్రవేశ పరీక్షల కన్వీనర్లతో సమావేశం నిర్వహించిన తర్వాత ప్రవేశ పరీక్షల తేదీలు, దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్లను ప్రకటించనుంది. గతకొంత కాలంగా షెడ్యూల్ విడుదలకు తీవ్ర జాప్యం నెలకొన్న సంగతి తెలిసిందే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడూల్ను ఉన్నత విద్యా మండలి గురువారం (ఫిబ్రవరి …
Read More »Blog Layout
సర్వే పేరుతో ఇంటి తలుపు కొట్టారు.. ఆపై వివరాలు అడుగుతూ.. ఒక్కసారిగా..
మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా..? అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే. అపరిచిత వ్యక్తులు తలుపుకొడితే అస్సలు తీయకండి. సర్వే అంటూ ఇంటికొచ్చినా.. లేదా మరో పేరు చెప్పినా అస్సలు డోర్లు ఓపెన్ చేయకండి. ఎందుకంటే వారు దొంగలు కావొచ్చు.. మీ ఇల్లు కొల్లగొట్టొచ్చు. తాజాగా ఖమ్మం జిల్లా పరిధిలో అలాంటి ఘటనే వెలుగుచూసింది….ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.. సర్వే పేరుతో, ఇంకా ఏ ఇతర అవసరాల కోసమే తలుపు కొడితే ఒక్క క్షణం ఆలోచించండి. తలుపు తీశారో.. మీ ఇల్లు గుళ్లవుతుంది. ప్రతిఘటిస్తే.. …
Read More »చేపలకు మేతగా బర్డ్ఫ్లూతో చనిపోయిన కోళ్లు! భయంతో వణుకుతున్న జనం..
బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయాని అధికారులు ప్రకటించడంతో ప్రజలు చికెన్ తినడం తగ్గించేశారు. గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను పూడ్చిపెడుతుంటే.. కొన్ని చోట్లా వాటిని చేపలకు మేతగా వేస్తున్నట్లు వీడియోలు బయటికి వస్తున్నాయి. దీంతో జంన మరింత భయపడుతున్నారు.ఇప్పటికే బర్డ్ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడుతున్న నేపథ్యంలో ప్రజలు చికెన్ తినాలంటేనే వణికిపోతున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని రోజులు చికెన్ తినకపోవడం ఉత్తమమని తెలిపింది. దీంతో చికెన్ ధరలు కూడా భారీగా పడిపోయాయి. ఏపీలోని గోదావరి జిల్లాలో బర్డ్ఫ్లూ వ్యాప్తి …
Read More »టారిఫ్స్, ఇమిగ్రేషన్.. ప్రధాని మోదీ, ట్రంప్ భేటిలో చర్చించే కీలకాంశాలు ఇవే
ఇద్దరు దేశాధినేతలు.. జాన్ జిగ్రీ దోస్తులు. సందర్భం వచ్చినప్పుడల్లా మా మంచి మిత్రుడని కితాబిచ్చుకుంటారు. మనం మనం కలిసి ముందుకెళ్దామని చేయి చేయి కలుపుతారు. అలాంటి ఫ్రెండ్స్ మరోసారి భేటీ కాబోతున్నారు. ఇంతకీ ఆ దేశాధినేతలు ఎవరు? వాళ్ల మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ ఏంటి? సమావేశంలో చర్చకొచ్చే అంశాలేంటి?ప్రధాని మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికా వెళ్లారు. ట్రంప్ ఎన్నికల విజయం.. రెండోసారి ప్రమాణ స్వీకారం తర్వాత ఇద్దరు నేతల మధ్య జరిగే తొలి సమావేశం ఇది. అయితే భేటీలో …
Read More »తెలంగాణలో మళ్లీ కులగణన సర్వే.. ప్రత్యేకంగా వారి కోసం మాత్రమే.. ఎప్పటినుంచంటే..
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో సమగ్ర కులగణన సర్వే రిపోర్ట్పై చేసిన ప్రకటనపై అటు ప్రతిపక్షాలు.. ఇటు బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. దీంతోపాటు.. మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది.. కులగణన సర్వే రిపోర్ట్ చరిత్రాత్మకమని ఈ సర్వే ద్వారా దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అవుతుందని ఆశించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్వేలో బీసీల జనాభా గణనీయంగా తగ్గడంపై బీసీ సంఘాల నుంచి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.. తెలంగాణలో మళ్లీ కులగణన సర్వే చేపట్టనున్నట్లు …
Read More »ఏపీలో బర్డ్ ప్లూ టెర్రర్.. మనిషికి సోకిన వైరస్
ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ టెన్షన్ పుట్టిస్తోంది. తాజాగా ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. టెస్టుల్లో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నమోదు కావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అలెర్టయ్యారు. బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని.. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు జిల్లా వైద్యశాఖ అధికారిని డాక్టర్ మాలిని.ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ప్లూ టెర్రర్ కొనసాగుతోంది. ఇప్పటివరకు కోళ్లకు మాత్రమే ఈ ప్లూ సోకగా.. …
Read More »కూటమి నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు: వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
రాష్ట్రంలో స్కామ్లు తప్ప ఏమీ జరగడంలేదని ఆరోపించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి… చట్టవిరుద్ధంగా, అన్యాయాలు చేసేవారెవ్వరినీ తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా వస్తుందని.. నేతలంతా ధైర్యంగా ఉండాలన్నారు. కొన్నాళ్లుగా వేర్వేరు జిల్లాల నేతలతో సమావేశమవుతూ వస్తున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులతో సమావేశమయ్యారు.టీడీపీ నాయకులు గ్రామాల్లోకి వెళ్లే వెళ్లే పరిస్థితులు లేవని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు హామీలు నిలబెట్టుకోకపోతే చొక్కాలు పట్టుకోవాలని …
Read More »మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయన్ని అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసే అయితే.. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రావాల్సి ఉంది..గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయన్ని అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. వంశీపై BNS సెక్షన్ …
Read More »జూనియర్ కాలేజీల్లో ముందస్తు అడ్మిషన్లు.. ఇంటర్ బోర్డు సీరియస్ వార్నింగ్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమై మార్చి 20వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షలు ఇంకా ముగియకముందే పలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇష్టారాజ్యంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు చేపట్టసాగాయి. దీంతో పలువురు ఇంటర్ బోర్డుకు ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన బోర్డు తాజాగా ప్రకటన జారీ చేసింది..రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీల్లో ముందస్తు అడ్మిషన్లపై ఇంటర్ బోర్డుకు ఫిర్యాదులు క్యూ కట్టాయి. దీనిపై ఇంటర్ బోర్డు బుధవారం ప్రకటన జారీ చేసింది. …
Read More »ఒక్క బడి కూడా మూసేయం.. ఇద్దరు పిల్లలున్నా కొనసాగిస్తాం: పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ వరుస నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా ఒడిఒడిగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 117ను ఈ నెలాఖరు నాటికి పూర్తిగా రద్దు చేస్తామని ఇప్పటికే పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు స్పష్టం చేశారు. తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసేయడం జరగదనీ, అన్నీ కొనసాగుతాయని ఆయన …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal