Blog Layout

అక్రమాస్తుల కేసులో జగన్‌కు బిగ్ రిలీఫ్

సుప్రీం కోర్టులో ఏపీ మాజీ సీఎం జగన్‌కు ఊరట లభించింది. సీబీఐ కేసుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. బెయిల్‌ రద్దుకు సహేతుకమైన కారణాలు లేవని, అలాంటప్పుడు రద్దు అవసరం లేదని ధర్మాసనం చెప్పింది. అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరమూ లేదని స్పష్టం చేసింది.వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ మరో ధర్మాసనానికి బదిలీ, ఆయన బెయిల్‌ రద్దు చేయాలన్న ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు పిటిషన్లపై సుప్రీంకోర్టులో …

Read More »

కిడ్నీ రాకెట్‌ అల్లాటప్పా కాదు.. కీలక విషయాలు చెప్పిన పోలీసులు

కిడ్నీ రాకెట్‌లో అలకనంద ఆస్పత్రి వెనుక అంతులేని రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి. లోకల్ గా ఏదో చోటా మోటా కేసుగా ముందు భావించినా..దీ నివెనుక భారీ కిడ్నీ రాకెట్ దాగుందని పోలీసులు అనుమానం. ఆస్పత్రి ముసుగులో ఓ భారీ కిడ్నీ దందాకు ఆముఠా తెరలేపినట్లు స్పష్టమవుతోంది. దొరికింది కొందరే. కానీ దొరకాల్సింది చాలా ఉందని పోలీసుల మాటల్లో అర్థమవుతోంది.తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఎల్బీనగర్ వేదికగా అలకనంద హాస్పిటల్‌లో గుట్టుగా సాగుతున్న కిడ్నీ మార్పిడి రాకెట్ …

Read More »

బైక్‌పై బ్యాగుతో అనుమానాస్పదంగా యువకుడు.. ఆపి తనిఖీ చేయగా..

ఇప్పటివరకు ఏజెన్సీ ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా పండించిన గంజాయిని అక్రమ రవాణా చేస్తుంటే పట్టుకునేవారు మన పోలీసులు. కానీ తాజాగా ఫారెన్ నుంచి గంజాయి మన ప్రాంతానికి వస్తుంది. అవును.. ఏకంగా అమెరికా నుంచి దిగుమతి అయిన గంజాయిని.. హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…హైటెక్స్ సిటీలో ఫారిన్ గంజాయి గుప్పుమన్నది. కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పెడ్లర్లుగా మారారు. తమకున్న సాఫ్ట్‌వేర్ తెలివితో ఏకంగా విదేశాలకు చెందిన గంజాయిని తీసుకువచ్చి తోటి ఉద్యోగులకు విక్రయిస్తున్నారు. అయితే వారి ఆటకట్టించారు పోలీసులు. హైదరాబాద్‌ గచ్చిబౌలి …

Read More »

ఓర్నాయనో.. ఒక్కో కిడ్నీ రూ.55లక్షలు.. ఇడ్లీలా మాదిరే అమ్మేశారు.. సంచలన విషయాలు..

తీగ లాగితే డొంక కదులుతోంది. కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. ప్రత్యేక టీంతో కేసును స్పీడప్ చేశారు పోలీసులు. కిడ్నీ రాకెట్ దందా ఏపీకి చెందిన ప్రధాన నిందితుడి కనుసన్నల్లో జరిగినట్లు గుర్తించారు. అతడి కోసం వేట కొనసాగిస్తున్నారు హైదరాబాద్‌ పోలీసులు.. అంతేకాకుండా.. మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు.హైదరాబాద్ కిడ్నీ రాకెట్‌ కేసులో సంచలన విషయాలు నమోదవుతున్నాయి. సరూర్‌నగర్‌లోని అలకనంద ఆసుపత్రిపై ఆకస్మిక దాడి చేసిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ముఠాలో కీలకంగా వ్యవహరించి పరారీలో ఉన్న ఇద్దరు …

Read More »

బాలయ్యకు పద్మభూషణ్.. ఇంటి కెళ్లి అభినందనలు తెలిపిన కిషన్ రెడ్డి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. సినీ కళాతమల్లికి అందించిన సేవలకు గుర్తింపుగా నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ పురస్కారం దక్కింది. దీంతో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ నందమూరి హీరోకు అభినందనలు తెలియజేస్తున్నారు.సినీ నటులు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్‌ అవార్డ్‌ రావడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. హైదరాబాద్‌లో బాలకృష్ణ ఇంటికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. వివిధ రంగాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న బాలకృష్ణకు పద్మభూషణ్‌ అవార్డ్‌ ప్రకటించిన కేంద్రానికి …

Read More »

తెలంగాణ ప్రజలకు పండగలాంటి వార్త.. నేడే అకౌంట్లలో నగదు జమ.. డిటైల్స్ ఇదిగో

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డు జారీ పథకాలను గణతంత్ర దినోత్సవం నాడు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.. అయితే.. ఈ నాలుగు పథకాలు జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని ప్రతి మండలంలోని ఒక్కో గ్రామంలో ఇవ్వాల్టి (జనవరి 27) నుంచి అమలుకానున్నాయి.. అయితే.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు రైతులు, రైతు కూలీలు ఖాతాల్లో జమ కాబోతున్నాయి. మండలానికో గ్రామం చొప్పున మొత్తం 606 గ్రామాల్లో రైతు భరోసా …

Read More »

తిరుపతి ఘటనతో TTD అలెర్ట్.. మినీ బ్రహ్మోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు..

తిరుమలలో ఫిబ్రవరి 4న రథ సప్తమి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మినీ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఏర్పాట్లపై సమీక్షించేందుకు టీటీడీ బోర్డు జనవరి 31న అత్యవసరంగా సమావేశంకానుంది.తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ అలెర్ట్) అయ్యింది. రథ సప్తమి సందర్భంగా ఫిబ్రవరి 4న ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు …

Read More »

మీరు మీ తల్లిదండ్రులకు ఏకైక కూతురా? అయితే ఈ స్కాలర్‌షిప్‌ మీకోసమే

పదో తరగతి పూర్తి చేసిన బాలికలకు సీబీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా కలిగిన బాలికా విద్యార్ధినులకు ప్రతియేటా మాదిరిగానే ఈ సారి కూడా సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ మెరిట్ స్కాలర్‌షిప్‌ అందించేందుకు ముందుకొచ్చింది. పదో తరగతి పాసై 11వ లేదా 12వ తరగతిలో ప్రవేశాలు పొందిన విద్యార్ధినులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు..తల్లిదండ్రులకు ఒకే ఒక సంతానంగా కలిగి ప్రతిభ కలిగిన బాలికలకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) బోర్డు యేటా సింగిల్‌ గర్ల్‌ …

Read More »

జన సైనికులకు పవన్ బహిరంగ లేఖ.. అలా చేయొద్దంటూ వినతి

జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  బహిరంగ లేఖ రాశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి జనసేన వారు ఎవరూ కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లిబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయొద్దని పవన్ కోరారు. ప్రతీ ఒక్కరూ చేయీ, చేయీ కలిపి నడవాల్సిన …

Read More »

డీపీఆర్‌ఓ అభ్యర్థులకు అలర్ట్‌.. ధ్రువపత్రాల పరిశీలన తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC).. డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ (డీపీఆర్‌ఓ) పోస్టులకు సంబంధించి కీలక అప్ డేట్ జారీ చేసింది. ఈ పోస్టులకు ఇప్పటికే రాత పరీక్ష పూర్తి కాగా మెరిట్ లిస్ట్ కూడా వెల్లడించింది. ఈ పోస్టలకు ఎంపికైన అభ్యర్ధులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించే తేదీని ఏపీపీఎస్సీ తాజాగా ప్రకటించింది..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ (డీపీఆర్‌ఓ) పోస్టులకు సంబంధించి ఇప్పటికే రాత పరీక్ష పూర్తైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ విడుదల చేయగా… …

Read More »