Blog Layout

చూడటానికి తియ్యటి చాక్లెట్స్‌లా ఉన్నాయి.. ఓపెన్ చేసి చూస్తే గుండె ధడేల్..!

చూడటానికి తియ్యటి చాక్లెట్స్ లాగే ఉంటాయి.. రంగుల కాగితం చుట్టి, చూస్తే తినాలి అనిపించేంత అందంగా ఉంటాయి. కానీ, అవి బయట షాపుల్లో దొరికే చిన్న పిల్లలు తినే చాక్లెట్లు అనుకుంటే మీరు పొరబడినట్లే.. అచ్చంగా గంజాయి చాక్లెట్లు.. ఏకంగా 4 కేజీల, 957 గ్రాముల గాంజా చాక్లెట్స్ సీజ్ చేసి, అవి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ప్రాంతంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం రైడ్స్ చేపట్టింది. ఇందులో భాగంగా గాంజా చాక్లెట్స్ విక్రయిస్తున్న వీరేంద్ర పాండే …

Read More »

ఇదెక్కడి దరిద్రంరా నాయనా.. బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్లి..

హైదరాబాద్‌ ఉప్పల్‌ ప్రాంతంలోని భరత్‌ నగర్‌లో ఇటీవల కాలంలో చెప్పులు, షూలు మాయమవుతున్న ఘటనలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. అయితే, చెప్పులు, షూలు మాయమవ్వడం సాధారణ దొంగతనంగా భావించిన స్థానికులు.. కొంతకాలానికి దీని వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుసుకున్నారు. చెప్పులు, షూలు, స్లిప్పర్లను చోరీ చేస్తూ.. అవి విక్రయించడానికి ఓ దంపతులు వినూత్న పద్ధతిని ఉపయోగించారు. వారి ఇంటిని చెప్పుల గోడౌన్‌గా మార్చి, భారీగా దొంగతనాలకు పాల్పడుతూ స్థానికులను భయాందోళనకు గురిచేశారు. బుధవారం, స్థానిక వ్యక్తి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తిని గుర్తించి …

Read More »

అబద్దాల మోహన్‌ బాబు.. మీడియానే కాదు పోలీసులపై కూడా విమర్శలు.. ఆ రోజు అసలేం జరిగిందంటే..

మీడియాపై తాను చేసిన దాడి గురించి నటుడు మోహన్‌బాబు వివరణ ఇస్తూ ఓ ఆడియో విడుదల చేశారు. దానిలో తను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అబద్ధాల కవరింగ్‌తో, తన నటనా చాతుర్యపు కలరింగ్‌తో…. వాస్తవాలకు మసి పూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు మోహన్‌బాబు… అసలు ఆరోజు ఏం జరిగిందో మొత్తం గమనించగలరు..హైదరాబాద్‌ శివార్లలోని జల్‌పల్లి వేదికగా…నటుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో కొద్ది రోజులుగా రచ్చ జరుగుతోంది. మోహన్‌బాబు, ఆయన పెద్దకొడుకు విష్ణు ఓవైపు, చిన్న కుమారుడు మంచు మనోజ్‌ మరోవైపు …

Read More »

ఒడిశా నుంచి ఏపీకి హైస్పీడ్‌తో ఎంటరయిన లారీ.. ఆపి చెక్ చేయగా

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో పెద్దఎత్తున గంజాయి పట్టుబడింది. కొట్టెక్కి చెక్‌పోస్ట్‌ నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్‌ చేశారు. అందులోని 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో గంజాయి ఉందని అనుమానంతో ఒరిస్సా నుంచి ట్రాక్ చేసి లారీని కొట్టెక్కి చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నారు పోలీసులు. లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొన్నామన్నారు. లారీ, రెండు బొలెరో వాహనాలు సీజ్ చేశారు. ఈ ఘటనలో ఖాకీలు కేసు నమోదు చేసి దర్యాప్తు …

Read More »

బాబోయ్.! ఏపీలో జోరుగా వానలే వానలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పలు జిల్లాలను భయపెడుతోంది. ఈ అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక తీరం వైపు కదులుతుండటంతో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.ఉమ్మడి చిత్తూరు జిల్లాపైనా అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తిరుపతి, తిరుమలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత నెలలో ఫెయింజల్‌ తుఫాన్‌ ప్రభావంతో అపారనష్టం జరిగింది. …

Read More »

అయ్యో.. భారీగా పడిపోయిన టమోటా ధరలు.. కిలో ఎంతో తెలిస్తే ఖంగుతినాల్సిందే..!

కర్నూలు జిల్లాలో టమోటా ధరలు పాతాళానికి పడిపోయాయి. కిలో ఒకటి నుంచి రెండు రూపాయలకు ధర పడిపోయింది. దీంతో టమోటా రైతులు విలవిలలాడుతున్నారు.టమోటా లేని ఇల్లు వంట బహుశా ఉండదేమో. అలాంటి టమోటా ధర మొన్నటి వరకు కిలో రూ.50. నేడు కిలో రూపాయి మాత్రమే. చాలా విచిత్రంగా ఉంది కదూ. నిజమే రైతులకు కిలో టమోటాకు దక్కుతున్నది కేవలం రూపాయి మాత్రమే. టమోటా కిలో రూ.20 నుంచి 25 రూపాయల వరకు బహిరంగ మార్కెట్లో విక్రయం జరుగుతోంది. పంట పండిస్తున్న రైతుకు కిలో …

Read More »

అసభ్యకర పోస్టులపై చంద్రబాబు సర్కార్ సీరియస్.. ఇక నుంచి మామూలుగా ఉండదు..

సోషల్ మీడియా సైకోలకు కళ్లేం వేసేలా కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. అసభ్యకర పోస్టులు పెట్టే వారి బెండు తీసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజల గౌరవాన్ని, నైతిక విలువలు కాపాడడమే లక్ష్యంగా.. దేశానికే ఆదర్శంగా నిలిచేలా చర్యలు చేపడుతోంది.సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన పలువురిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అధికారులు. దీనిపై ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, నేరస్థుల ప్రవర్తన, …

Read More »

 కేబినెట్‌లో చోటు దక్కించుకునేదెవరు..? హైకమండ్‌ మదిలో ఎవరున్నారు…?

ఓవైపు మంతనాలు… మరోవైపు అధిష్టానానికి లేఖలు. యస్… తెలంగాణ కేబినెట్‌లో చోటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. స్టేట్‌లోనే కాదు ఢిల్లీలోనూ గట్టిగానే లాబీయింగ్‌ చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసిన షార్ట్‌ లిస్టులో ఎవరి పేర్లున్నాయ్…? హైకమండ్‌ మదిలో ఎవరున్నారు…? ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరు కాబోతున్నారు…!కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైనప్పటికీ… సీఎం రేవంత్‌ సహా మరో 11 మంది మంత్రులతోనే ప్రభుత్వం నడుస్తోంది. ఇంకా మరో ఆరుగురికి అవకాశం ఉన్నప్పటికీ…. ఆ దిశగా అడుగులు పడలేదు. …

Read More »

జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న గ్రామ పంచాయతీ.. ఏకంగా అవార్డు సొంతం.. ఎందుకంటే..?

బొమ్మసముద్రం కు జాతీయ అవార్డు లభించడంతో పంచాయతీలోని తిరువణంపల్లి, బొమ్మ సముద్రం గ్రామాల ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోని గ్రామ పంచాయతీకి అరుదైన గౌరవం దక్కింది. ఐరాల మండలం బొమ్మ సముద్రం పంచాయతీ బెస్ట్ హెల్త్ విలేజ్ గా జాతీయ అవార్డు పొందింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ రఘునాథ్, అధికారులతో కలిసి అవార్డు అందుకున్నారు. జిల్లా నుంచి డిల్లీకి వెళ్ళన జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, …

Read More »

వైసీపీకి డబుల్ షాక్ ఇచ్చిన ముఖ్యనేతలు.. ఆ ఇద్దరి ఫ్యూచర్‌ ప్లాన్స్‌ ఏంటి…?

వాలంటీర్ల వ్యవస్థ వచ్చాక ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు ఇతర ప్రజా ప్రతినిధులకు విలువ లేకుండా పోయిందని వైసీపీ వీడుతున్న నేతలు ఆరోపిస్తున్నారు.ఫ్యాన్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. సీనియర్‌ నేతలు పార్టీపై సీరియస్‌ అవుతూ సింపుల్‌గా రాజీనామా చేస్తున్నారు. అవంతి శ్రీనివాస్‌ రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే.. గ్రంధి శ్రీనివాస్‌ వైసీపీకి గుడ్‌బై చెప్పడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కొందరు ముఖ్య నేతలు వైసీపీని వీడగా, తాజాగా మరో ఇద్దరు ముఖ్యనేతలు పార్టీకి రాజీనామా చేసి షాక్‌ ఇచ్చారు. గురువారం ఉదయాన్నే మాజీ …

Read More »