Blog Layout

విద్యార్థులకు ఉపాధ్యాయుడు బైబిల్ పంపిణీ..కట్ చేస్తే.. సీన్ సితారయ్యింది

విద్యా బోధనలు నేర్పించే పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు మత ప్రచారం చేశాడు. క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో విద్యార్థులకు బైబిల్‌ను పంపిణీ చేశాడు. ఇది తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఉపాధ్యాయుడితో ఆందోళనకు దిగారు.ప్రభుత్వ పాఠశాల మత ప్రచారం కేంద్రంగా మారింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు మత బోధకుడిగా మారిపోయాడు. ఏకంగా విద్యార్థులకు బైబిల్ పంపిణి చేశాడు. ఈ విషయం పేరెంట్స్‌కి తెలియడంతో ఉపాధ్యాయుడిని నిలదీశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. రాజన్న …

Read More »

రాజమండ్రి టూ ఢిల్లీ.. 2 రోజులు కాదు.. ఇక 2 గంటలే.! వివరాలు ఇవిగో

సాధారణంగా మనం రాజమండ్రి నుంచి ఢిల్లీ వెళ్లాలంటే.. బస్సు లేదా రైలులో 32 గంటల నుంచి 36 గంటల సమయం పడుతుంది. అయితే ఇకపై ఆ వర్రీ ఉండదు.. కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు.. ఆ వివరాలు..ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్‌. ఇక రాజమండ్రి నుంచి నేరుగా ఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్‌ ప్రారంభమైంది. అంతకు ముందు ఢిల్లీ నుంచి రాజమండ్రికి వచ్చిన మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ పురందేశ్వరి చేరుకున్నారు. రన్‌వే పై …

Read More »

తుఫాన్ ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది.. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది.. ఈ అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక తీరం వైపు కదులుతుండటంతో రానున్న మూడురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.. కాగా.. తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉమ్మడి చిత్తూరు జిల్లాపై ప్రభావం చూపుతోంది. తిరుపతి, తిరుమల సహా శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరిలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. చిత్తూరు, సత్యవేడు, …

Read More »

గూగుల్ తల్లికే తెలియని అడ్రస్.. ఏపీలో ఓ పాకిస్తాన్ ఉందని తెల్సా.!

సాధారణంగా మనకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే.. అది గూగుల్ తల్లినో, లేక మరెవరినైనా అడిగి తెలుసుకుంటాం. అయితే గూగుల్ తల్లికే తెలియని విషయాలుంటే.? ఏంటి ఆశ్చర్యపోతున్నారా.? అవునండీ.! మన ఏపీలోని విజయవాడలో పాకిస్తాన్ ఉంది..గూగుల్ మ్యాప్స్, గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లకు కూడా అడ్రస్ లభించని ప్రాంతం అది. దాని పేరు పాకిస్తాన్.! అది కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.. ఎక్కడని అనుకుంటున్నారా.. బెజవాడలోని ఓ కాలనీ పేరు పాకిస్తాన్. ఇందిరా గాంధీ హయాంలో నిర్మించిన ఈ కాలనీ గూగుల్‌లో కూడా మీకు దొరకదు. …

Read More »

చిన్న వయస్సులోనే రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది? నిపుణులు ఏమంటున్నారు?

అకాల పీరియడ్స్ రావడం కూడా ఈ వ్యాధి ముప్పును పెంచుతుందని డాక్టర్ శృతి అంటున్నారు. అంతే కాకుండా స్థూలకాయం, వ్యాయామం లేకపోవడం, మితిమీరిన మద్యపానం, ధూమపానం వంటి జీవనశైలి కారకాలు..కొన్ని దశాబ్దాల క్రితం వరకు 50 ఏళ్లు పైబడిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు వచ్చేవి. కానీ ఇప్పుడు 30 నుండి 40 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఈ క్యాన్సర్ బాధితులుగా మారుతున్నారు. ICMR ప్రకారం.. 2020 సంవత్సరంలో భారతదేశంలో 13.9 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇది 2025 నాటికి 15 …

Read More »

చిన్న విషయానికే ఇంతలా శిక్ష వేయాలా..? మూగ జీవులపై ప్రతాపం.. టెంపుల్ సిటీలో కలకలం

టెంపుల్ సిటీ తిరుపతిలో శునకాలపై వరుస దాడుల వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. కొందరు శునకాలపై కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్న తీరు భయపెడుతోంది. నాలుగు రోజుల క్రితం తిరుపతిలో పెంపుడు కుక్క హత్యకు గురైన ఘటన మరువక ముందే.. ఓ పెంపుడు కుక్కను పైశాచికంగా కొట్టిన ఓ వ్యక్తి వ్యవహారం కలకలం రేపింది.. మూగ జీవి అని కూడా చూడకుండా దారుణంగా దాడి చేశాడు.. విచక్షణ కోల్పోయి మరి కర్రతో ఎలా పడితే అలా కొట్టాడు.. వివరాల్లోకెళితే.. స్కావెంజర్స్ కాలనీలో లావణ్య అనే మహిళకు చెందిన పెంపుడు …

Read More »

ఇది మంచి పద్దతి కాదు.. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా.. సంచలన వ్యాఖ్యలు

సాధారణ ఎన్నికల్లో అసాధారణ ఓటమిని మూటగట్టుకున్న వైసీపీకి.. షాకుల మీదద షాకులు తగులుతున్నాయి.. ఇప్పటికే, పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, పలువురు నేతలు పార్టీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. తాజాగా.. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ రాజీనామా చేశారు..సాధారణ ఎన్నికల్లో అసాధారణ ఓటమిని మూటగట్టుకున్న వైసీపీకి.. షాకుల మీదద షాకులు తగులుతున్నాయి.. ఇప్పటికే, పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, పలువురు నేతలు పార్టీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. తాజాగా.. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ రాజీనామా చేశారు.. పార్టీ, …

Read More »

ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి కీలక ఆదేశాలు

ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కలెక్టర్‌ల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల పరిశీలనకు డెడ్‌లైన్ విధింంచిన మంత్రి.. పొరపాట్లకు తావులేకుండా సర్వే నిర్వహించాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌ను పకడ్బందీగా చేప‌ట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి జిల్లా. ఇందిరమ్మ ఇండ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న, సామాజిక స‌ర్వే త‌దిత‌ర అంశాల‌పై సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి. ఈకార్యక్రమంలో సీఎం సలహాదారు, సీఎస్ …

Read More »

షార్ట్‌ లిస్ట్ రెడీ.. సంక్రాంతికి విడుదల..! ఢిల్లీకి చేరిన తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయం

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో ఆరుగురు అదృష్టవంతులు ఎవరో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. అన్నీ కుదిరితే సంక్రాంతికి తెలంగాణ కేబినెట్‌లో కొత్త అమాత్యులు చేరబోతున్నారు. ఇందు కోసమే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ పర్యటనకు వెళ్లారని చర్చ జరుగుతోంది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సహా మరో 11 మంది మంత్రులతోనే రేవంత్ సర్కార్ నడుస్తోంది. ఇంకా మరో ఆరుగురికి కేబినెట్‌లో అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతీ …

Read More »

మనసంతా విశాఖపైనే.. చంద్రబాబు సర్కార్ ఫుల్ పోకస్.. మూడు దశల్లో రూ.84,700 కోట్లు..

స్టీల్ సిటీని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఓ వైపు అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఇంకోవైపు మనసంతా విశాఖే అని చాటుకుంటోంది. ప్రకృతి సోయగాలకు నిలయమైన సుందర నగరాన్ని.. అన్ని రంగాల్లో దూసుకెళ్లేలా వ్యూహాలు రచిస్తోంది.మొన్న టీసీఎస్‌.. నిన్న గూగుల్‌తో ఎంవోయూ.. ఇంకోవైపు పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు. హెచ్‌పీసీఎల్‌, ఎన్టీపీసీ హైడ్రో పవర్‌ లాంటి వాటిలో లక్షల కోట్ల పెట్టుబడులు. వీటితో పాటు టూరిజం, ఫార్మా అన్ని రకాలుగా విశాఖకు పెద్దపీట వేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. …

Read More »