Blog Layout

Election Results 2024 Live: ఎన్డీయే, ఇండియా కూటమిలకు అగ్ని పరీక్ష

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 45 శాసనసభ సీట్లు, రెండు పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మహారాష్ట్రలోని 288 స్థానాలుకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించగా… ఝార్ఖండ్‌లోని 81 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. ఇక, కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప-ఎన్నిక జరగ్గా.. అక్కడ నుంచి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ బరిలో నిలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీకి దిగడం ఇదే మొదటిసారి. దీంతో ఆ స్థానంలో ఫలితంపై ఆసక్తి నెలకుంది. …

Read More »

‘మెకానిక్‌ రాకీ’ మూవీ రివ్యూ

ఆశకి అవసరానికి మధ్య కొట్టిమిట్టాడే మధ్య తరగతి వాడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఏవిధంగా చిక్కుకుంటున్నాడనే బర్నింగ్ ఇష్యూని సందేశాత్మకంగా చూపించారు. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకుని.. ఇన్సూరెన్స్ పేరుతో జరిగే మోసాలను కళ్లకి కట్టే ప్రయత్నం చేశారు. ఏదో బలమైన సందేశాన్ని జనాలకు ఇవ్వాలనే థీమ్‌లో కాకుండా.. ఎంటర్‌టైన్మెంట్‌ మోడ్‌లోని కథని ముందుకు తీసుకుని వెళ్తూ.. బర్నింగ్ ఇష్యూని రిపేర్ చేసే ప్రయత్నం చేశాడు మెకానిక్ రాకీ. మరి ఇతని రిపేర్ ఏ స్థాయిలో పనికొచ్చింది.. బొమ్మకి మంచి మైలేజ్ ఇచ్చిందా? …

Read More »

జీబ్రా’ మూవీ రివ్యూ – Zebra Review

బ్యాంకింగ్ సిస్టమ్, అందులోని లోపాలను చూపెడుతూ ఈ మధ్య ఎక్కువగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. హర్షద్ మెహతా కథ మొదలుకొని మొన్న వచ్చిన లక్కీ భాస్కర్ వరకు బ్యాంకింగ్ సిస్టం మీద కథలు వచ్చాయి. ఈ జీబ్రా కూడా అలాంటి నేపథ్యంలోనే తెరకెక్కిందని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. మరి ఈ జీబ్రా అందరినీ ఆకట్టుకుందా? లేదా? అన్నది చూద్దాం. కథసూర్య (సత్య దేవ్) బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్‌లో రిలేషన్ షిప్ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. స్వాతి (ప్రియా భవానీ శంకర్) …

Read More »

ఏపీకి మరో ఇంటర్నేషనల్ కంపెనీ.. 300 ఎకరాల్లో ప్లాంట్, వెండార్ పార్క్! దశ తిరిగినట్లే..

టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలు ఎంవోయూలు కూడా కుదిరాయి. తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. ప్రముఖ ఎలక్ర్టానిక్స్ సంస్థ ఎల్‌జీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎల్‌జీతో పాటుగా ఆ కంపెనీకి విడిభాగాలు సరఫరా చేసే కొరియా, చైనీస్ సంస్థలు కూడా.. భారతదేశంలో రూ.7000 కోట్లు పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. రూ.7 వేల కోట్లతో ఎల్‌జీ …

Read More »

మూడు నెలల్లో తిరుమలలో ఆ సమస్యకు చెక్.. టీటీడీ ఈవో హామీ

టీటీడీ ఈవో జె. శ్యామలరావు తిరుమలలో శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గోగ‌ర్భం జ‌లాశ‌యం స‌మీపంలోని కాకుల‌మాను దిబ్బ వ‌ద్ద ఉన్న డంపింగ్ యార్డును టీటీడీ ఈవో తొలుత ప‌రిశీలించారు. దశాబ్దాల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తిరుమలలో 30 ఏళ్ల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందన్న టీటీడీ ఈవో శ్యామలరావు.. దీని వలన అనేక …

Read More »

తిరుమల రూపురేఖలు మారబోతున్నాయి.. త్వరలోనే, టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు

తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. తిరుపతిలోని పరిపాలన భవనంలోని మీటింగ్‌ హాల్‌లో తిరుమలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా డిజైన్లు రూపొందించాలన్నారు. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణావసరం అని, టీటీడీకి అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తిరుమలలో పాదచారులకు అనుకూలంగా ఫుట్‌పాత్‌లను మార్చడంతో పాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు …

Read More »

Horoscope Today: వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

Today Horoscope (November 22, 2024): మేష రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలగడానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆదాయానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. మిథున రాశి వారికి ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది కానీ, కుటుంబ ఖర్చులు, దైవ కార్యాలపై ఖర్చులు బాగా పెరుగుతాయి. మేష రాశి మొదలు మిథున రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయం బాగా వృద్ది …

Read More »

వైసీపీకి అసెంబ్లీలో షాక్.. జనసేన ఎమ్మెల్యేకు కేబినెట్ హోదా పదవి ఫిక్స్!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. పీఏసీ (ప్రజాపద్దుల కమిటీ) ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసినా సరే పదవి దక్కే పరిస్థితి కనిపించడం లేదు. అనుకున్నట్లుగానే జనసేన పార్టీకి ఈ పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌‌గా భీమవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నిక దాదాపు ఖాయమైందని చెబుతున్నారు. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. ఇవాళ వైఎస్సార్‌సీపీ నామినేషన్ ఉపసంహరించుకోకపోతే అసెంబ్లీ కమిటీహాల్‌లో పీఏసీ సభ్యత్వానికి పోలింగ్‌ జరుగుతుంది. ఈ ఎన్నిక బ్యాలెట్‌ …

Read More »

ఏపీలో ఆ ఉద్యోగులందరూ తొలగింపు.. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎండీసీ (ఖనిజాభివృద్ధి సంస్థ)లో మరోసారి ఉద్యోగుల్ని తొలగించారు. గత ప్రభుత్వం (2019-2024) మధ్య పొరుగుసేవలు, కాంట్రాక్ట్‌ విధానంలో సిఫార్సులతో చేరిన మరో 90 మందిని తొలగిస్తూ ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సిఫార్సులతో ఉద్యోగుల్ని చేర్చుకున్నారు. అప్పటి గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు, పలువురు ప్రజా ప్రతినిధు సిఫార్సులతో వందల మంది ఉద్యోగులు చేరారు. 2019లో ఏపీఎండీసీ ఇసుక వ్యాపారం చేసినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500 మందిని ఔట్ …

Read More »

Ram Charan: గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ.. ‘దీనమ్మ దిమ్మతిరిగి బొమ్మ కనబడింది’

గేమ్ ఛేంజర్ సినిమాను దాదాపుగా మూడేళ్లుగా చెక్కుతూనే ఉన్నారు డైరెక్టర్ శంకర్. మధ్యలో వేరే శిల్పాన్ని (ఇండియన్ 2) కూడా చెక్కారనుకోండి అది వేరే విషయం. అయితే గేమ్ ఛేంజర్ మాత్రం అదిరిపోతుంది.. తిరుగేలేదంటూ శంకర్ ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు చెబుతూనే ఉన్నారు. కానీ ఎక్కడో కొడుతుంది శీనా అన్నట్లు ఫ్యాన్స్ పైకి చెప్పకపోయినా శంకర్ మీద కాస్త డౌటానుమానంతోనే ఉన్నారు. కానీ వీటిని గేమ్ ఛేంజర్ టీజర్ కాస్త కొంతవరకూ పోగొట్టింది. రామ్ చరణ్ చేసిన రెండు పాత్రల వేరియేషన్స్.. శంకర్ …

Read More »