Blog Layout

మచిలీపట్నంలో ఒక్కడి కోసం ఇద్దరమ్మాయిలు.. సినిమా రేంజ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఒక్కడి కోసం ఇద్దరు ప్రియురాళ్ల కొట్లాట చర్చనీయాంశమైంది. మచిలీపట్నానికి చెందిన విజయ్ అనే బిల్డర్‌‌పై అనూష అనే మహిళ సంచలన ఆరోపణలు చేశారు. మచిలీపట్నంలో విజయ్ అనే బిల్డర్‌ ముందు అనూష అనే మహిళను ప్రేమిస్తున్నానని చెప్పాడని.. అయితే ఆరు నెలలుగా తనతో ఉండం లేదని ఆమె చెప్పుకొచ్చారు. తన డబ్బులు, బంగారం తీసుకున్నాడని.. అడిగితే తననే బెదిరిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. విజయ్ అనిత అనే మరో మహిళత కలిసి ఉంటున్నాడని.. తనకు జరిగిన అన్యాయాన్ని భరించలేక.. తాను అక్కడికి వెళ్లి …

Read More »

పోలీసులకు చిక్కిన కొరియోగ్రాఫర్ జానీ.. పట్టుకున్న సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. తనపై కేసు నమోదైనప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతోన్న జానీ మాస్టర్ బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. అసిస్టెంట్‌ కొరియాగ్రాఫర్‌గా ఉన్న తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఓ షూట్ కోసం ముంబయికి వెళ్లినప్పుడు తనపై అత్యాచారానికి కూడా పాల్పడినట్లు బాధితురాలు చెప్పడం.. ఆ సమయంలో ఆమె మైనర్ …

Read More »

అమెరికా కోర్టు సంచలన నిర్ణయం.. భారత్‌కు సమన్లు జారీ!

ఖలీస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ తన హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ అమెరికా కోర్టులో సివిల్ దావా వేశారు. ఈ దావాను విచారణకు చేపట్టిన అమెరికా కోర్టు.. భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. సదరన్ న్యూయార్క్ డిస్ట్రిక్ట్ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు.. భారత ప్రభుత్వం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రిసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ సమత్ గోయల్, రా ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తాలకు సమన్లు జారీ అయినట్టు అంతర్జాతీయ …

Read More »

అక్కడి ప్రాజెక్టులపై ‘హైడ్రా’ గురి.. పక్కా ఆధారాలతో కూల్చివేతలకు సిద్ధం..!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) ఉక్కుపాదం మోపుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నగరంలోని వందల కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తిరిగి సర్కారుకు అప్పగించారు. ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. కూల్చివేతలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటంతో.. పక్కా ఆధారాలతో కూల్చేవేతలు చేపట్టాలని హైడ్రా భావిస్తోంది. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలకు చెందిన ‘లేక్‌ వ్యూ’ ప్రాజెక్టులపై ప్రస్తుతం హైడ్రా ఫోకస్ …

Read More »

గాంజా శంకర్ అటకెక్కిందా?.. శర్వాతో సంపత్ నంది కొత్త చిత్రం

సంపత్ నంది హిట్టు కొన్ని ఎన్నేళ్లు అవుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బెంగాల్ టైగర్ అంతో ఇంతో బాక్సాఫీస్ వద్ద ఆడేసింది. ఇక సీటీమార్, గౌతమ్ నందా అంటూ ఓ మోసర్తుగా మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ అవేవీ కూడా హిట్లు అని చెప్పలేం. ఇక కెరీర్ ప్రారంభంలో వచ్చిన పేరు, సక్సెస్ ఇప్పుడు కనిపించడం లేదు. సంపత్ నంది ప్రస్తుతం నిర్మాతగా, దర్శకుడిగా ఫుల్ బిజీగా మారిపోయాడు. ఓ వైపు నిర్మాతగా చిత్రాలు చేస్తూ, కథలను అందిస్తూనే ఉన్నాడు. మరో వైపు …

Read More »

విమానాశ్రయాల్లో సరికొత్త విధానం.. ఇకపై సెకెన్లలోనే ఇమ్మిగ్రేషన్ పూర్తి!

విమానాశ్రయాల్లో మరింత వేగంగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తిచేసేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల ప్రయోగాత్మకం చేపట్టిన ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్‌ను దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ అమలుచేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలోని ప్రధాన 20 ఎయిర్‌పోర్టులకు దీనిని విస్తరిస్తున్నట్టు పేర్కొంది. ఈ విధానం వల్ల ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సెకెన్ల నుంచి గరిష్టంగా 30 నిమిషాల్లోనే పూర్తవుతుందని తెలిపింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జూన్ 22న ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్‌ (FTI-TTP)ను కేంద్ర …

Read More »

విశాఖవాసులకు టీటీడీ అద్భుత అవకాశం.. ప్రతిరోజూ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం, ఎక్కడంటే!

విశాఖపట్నంవాసులకు టీటీడీ అద్భుతమైన అవకాశం కల్పించింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నగరంలో కూడా అందుబాటులోకి వచ్చింది. శ్రీవారి ప్రసాదానికి విశేష ఆదరణ వస్తోందని.. అందుకే ఎండాడ శ్రీమహాలక్ష్మీ గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (టీటీడీ)లో ఇకపై ప్రతి రోజు లడ్డూలు విక్రయించనున్నారు. గతంలో గురు, శుక్ర, శనివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు జరిగేవని.. భక్తుల కోరిక మేరకు గురువారం నుంచి ఇవి ప్రతిరోజు అందుబాటులో ఉంటాయని ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారి …

Read More »

‘ఫౌజీ’ కోసం మృణాల్‌ ఠాకూర్‌… ఇద్దరితో ప్రభాస్‌ రొమాన్స్‌?

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. సలార్‌, కల్కి 2898 ఏడీ సినిమాలతో సంచలన విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్‌ బ్యాక్ టు బ్యాక్‌ భారీ చిత్రాలతో రాబోయే రెండేళ్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్‌ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన పోస్టర్ గ్లిమ్స్ తో అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉంటుందనే నమ్మకం కలుగుతుంది. ఒకవైపు రాజాసాబ్‌ సినిమా చేస్తూనే మరో వైపు హను రాఘవపూడి దర్శకత్వంలో …

Read More »

కదిరి: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్.. ఏమైందంటే

శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ బాలుడి దవడలో బ్రష్ గుచ్చుకుంది. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురంలో 11 ఏళ్ల ప్రవీణ్ కుమార్ అనే బాలుడు ఉదయాన్నే లేచి పళ్ళు తోముతున్నాడు.. ఆ సమయంలో బాలుడు కిందపడటంతో బ్రష్‌లోని పదునైన భాగం దవడలోకి చొచ్చుకుపోయింది. బ్రష్ దవడలో అలాగే ఇరుక్కుపోగా.. వెంటనే తల్లిదండ్రుల్ని బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు బాలుడికి ఆపరేషన్ చేసి బ్రష్‌ను తొలగించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.. బాలుడికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.

Read More »

డీఎస్పీగా మహిళా బాక్సర్ నిఖత్ జరీన్.. వెల్‌కమ్ చెప్పిన తెలంగాణ డీజీపీ

భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం తెలంగాణ డీజీపీ జితేందర్‌ను కలిసిన జరీన్.. తన జాయినింగ్ రిపోర్టును సమర్పించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ డిపార్ట్‌మెంట్‌లోకి ఆమెకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, ఒలింపిక్ అథ్లెట్ నిఖత్ జరీన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్)గా కొత్త పాత్రను స్వీకరించినందున శుభాకాంక్షలు తెలిపుతూ.. ఆమెను …

Read More »