Blog Layout

ఏపీలో మహిళలకు తీపికబురు.. ప్రతి నెలా ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.1500

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో పథకం అమలు దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ భేటీ కొనసాగుతోంది. పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది.. నూతన మద్యం విధానం, వాలంటీర్ల వ్యవస్థపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఆడబిడ్డ నిధి పథకంపై చర్చ జరిగింది. పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ‌పరిశ్రమలకు భూముల కేటాయింపులపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది. సూపర్స్ సిక్స్‌‌లో భాగంగా.. …

Read More »

మోదీ ఓ అద్భుతం.. వచ్చే వారం కలుస్తా.. డొనాల్డ్ ట్రంప్

వచ్చేవారం తమ దేశంలో పర్యటించనున్న భారత్ ప్రధాని నరేంద్ర మోదీని తాను కలుస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మిచిగాన్‌లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ట్రంప్.. ప్రధాని మోదీ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ అద్భుతమైన వ్యక్తి అని ఆకాశనికెత్తేశారు. ‘వచ్చే వారం ఆయన ఇక్కడకు వస్తున్నారు.. నేను కలుస్తాను’ అని అన్నారు. అయితే, ఇరువురి భేటీకి సంబంధించిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో కలుసుకున్నారు. అమెరికా అధ్యక్షుడి …

Read More »

అనంతపురం వరకు ఆ రైలు పొడిగింపు.. బెంగళూరుకు ఈజీగా వెళ్లొచ్చు

ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులకు రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. బెంగళూరు-పుట్టపర్తి ప్యాసింజర్‌ రైలు (06515/06516)ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్యాసింజర్ రైలును పుట్టపర్తి వరకు కాకుండా అనంతపురం వరకు పొడిగించినట్లు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి నిత్యం బెంగళూరుకు రాకపోకలు ఉంటాయి.. ఇప్పుడు ఈ రైలును అనంతపురం వరకు పొడిగిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు పుట్టపర్తితో పాటుగా బెంగళూరుకు వెళ్లేందుకు రైలు సౌకర్యం కల్పించాలని అంబికా లక్ష్మీనారాయణ …

Read More »

గాడిద పాల పేరుతో రైతులకు కుచ్చు టోపీ.. రూ.9 కోట్లు దోచేసిన ఏపీకి చెందిన సంస్థ

గాడిద పాల వ్యాపారం పేరుతో కర్ణాటక రైతులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంస్థ నిండా ముంచేసింది. మొత్తం 200 మంది సామాన్య రైతుల నుంచి ఏకంగా రూ.9 కోట్లు దండుకుంది. చివరకు ఇది బోగస్ అని తేలడంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాకు చెందిన నూతలపాటి మురళి.. మూడు నెలల కిందట ‘జెన్ని మిల్క్‌’ అనే పేరుతో ఓ సంస్థ ఏర్పాటుచేశాడు. హొసపేటెలోని హంపీ రోడ్డులో హంగూ ఆర్భాటాలతో దీనిని ప్రారంభించి.. ఉద్యోగులను నియమించుకున్నాడు. గాడిద పాల వ్యాపారం చేస్తే లక్షాధికారులు …

Read More »

నెల ఆలస్యంగా ‘కంగువా’.. రజినీకాంత్ కోసం సూర్య వెనకడుగు

కోలీవుడ్‌ స్టార్‌ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్‌ ఫాంటసీ డ్రామా ‘కంగువా’ దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల చేయాలని భావించారు. కానీ అదే రోజున తమిళ్ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన వేట్టయ్యన్‌ సినిమా విడుదల అవ్వబోతుంది. రజినీకాంత్‌ సినిమాను దసరా బరిలో ఉంచడంతో పాటు, ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయడంతో కంగువా సినిమా విడుదల విషయంలో మేకర్స్‌ ఆలోచనలో పడ్డారట. రజినీకాంత్‌ సినిమాకు పోటీ గా కంగువాను విడుదల చేయడం …

Read More »

కేంద్రం కీలక నిర్ణయం.. పీఎఫ్ విత్ డ్రా లిమిట్ పెంపు.. ఒకేసారి రూ.1 లక్ష తీసుకోవచ్చు!

PF Withdrawal: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సబ్‌స్క్రైబర్లకు అదిరే శుభవార్త అందించింది కేంద్రం. ఉద్యోగులు ఇకపై తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా మంగళవారం వివరాలు వెల్లడించినట్లు హిందుస్తాన్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఇప్పటి వరకు పీఎఫ్ ఖాతా నుంచి ఒకసారి గరిష్ఠంగా రూ.50 వేలు మాత్రమే ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు దానిని రూ.1 లక్షకు …

Read More »

తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు బంపరాఫర్.. ఐడియా అదిరింది!

తెలుగు దేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పార్టీ సభ్యత్వాలను ప్రాంరభించాలని నిర్ణయం తీసుకుంది. అక్టోబర్2 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు చేపట్టాలని అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అలాగే రూ.లక్ష పైబడి సభ్యత్వం చెల్లించిన వారికి శాశ్వత సభ్యత్వం కల్పిద్దామని నేతలకు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, సమన్వయ కమిటీ సభ్యులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు.. వారందరితో మాట్లాడారు. ఈ సమావేశం మంగళవారం అర్ధరాత్రి వరకు సాగగా.. పార్టీకి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై చర్చించారు. …

Read More »

చపాతీలను ఇలా తింటే బరువు తగ్గుతారు

బరువు తగ్గేందుకు చాలా మంది ఎన్నో ప్రయత్నిస్తుంటారు. నిజానికీ బరువు తగ్గించడంలో మనం తీసుకునే ఆహారం కీ రోల్ పోషిస్తుంది. తర్వాత వర్కౌట్. బరువు తగ్గించడంలో చక్కెర, కార్బోహైడ్రేట్స్‌ని కంట్రోల్ చేయాలి. అందుకోసం చపాతీలు తినొచ్చు. ఎలా చపాతీలను తింటే రిజల్ట్ ఉంటుందో.. ఏ చపాతీలు మంచివో తెలుసుకోవాలి. దీని వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. చపాతీలు అనేక రకాల పిండిలతో చేసుకోవచ్చు. ఇందులో మల్టీగ్రెయిన్స్.. అంటే చిరు ధాన్యాలు. జొన్నలు, రాగులతో కూడా చేయొచ్చు. ఈ గ్రెయిన్స్‌లో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. …

Read More »

జమ్మూ కశ్మీర్‌‌ అసెంబ్లీకి పదేళ్ల తర్వాత ఎన్నికలు.. మొదలై తొలి విడత పోలింగ్

జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీకి పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. చివరిసారిగా 2014లో అక్కడ శాసనసభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 స్థానాలుండగా.. మూడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి విడతలో 24 నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మొదటి విడతలో వివిధ పార్టీలకు చెందిన 219 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 23 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతం కావడంతో భద్రతా …

Read More »

యువతకు మంచి అవకాశం.. నెలకు రూ.22 వేల వరకు జీతంతో ఉద్యోగాలు

ఏపీలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కృష్ణా జిల్లా ఉపాధి కల్పనా శాఖ, డీఆర్‌డీఏ, ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. గుడివాడలో ఎమ్మెల్యే రాము తన నివాసంలో ఉద్యోగ మేళా పోస్టర్‌ను విడుదల చేశారు.. జిల్లా ఉపాధి కల్పనాధికారి దేవరపల్లి విక్టర్‌ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్‌.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ నెల 20న గుడివాడలోని కేబీఆర్‌ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. …

Read More »