Blog Layout

వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఆగస్టు 29, 2024): మేష రాశికి చెందిన వ్యాపారులకు ఈ రోజు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఉత్సాహపరుస్తాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఇష్టమైన బంధువులను, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ వ్యవహారాలను చక్క దిద్దడం …

Read More »

ఆ ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. మంత్రులకు కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశంలో తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అన్నారు. ఇన్నాళ్లు పార్టీ నిర్మించుకున్న మంచిపేరును కొందరు ఎమ్మెల్యేలు దెబ్బతీస్తున్నారని మంత్రులతో అన్నారు. ఆ ఎమ్మెల్యేలు చేసిన పొరపాట్లు పేపర్లలో వస్తున్నాయని ప్రస్తావించిన చంద్రబాబు.. వారికి వార్నింగ్ ఇచ్చారు. అలాంటి ఎమ్మెల్యేల పట్ల మంత్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వారి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తోందని చంద్రబాబు విచారం వ్యక్తం చేవారు. ఇదే సమయంలో మంత్రులు కూడా …

Read More »

తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం.. చెన్నై భక్తుడు పెద్ద మనసుతో, కొండపై పరిశుభ్రత కోసం

తిరుమల శ్రీవారికి చెన్నైకు చెందిన సంస్థ లారీని విరాళంగా అందజేసింది. చెన్నైకి చెందిన ట్రేటికొ ఇంజనీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ కార్తీక్ ‌ టీటీడీకి చెందిన లారీ చేసేస్ కు రూ.8 లక్షల విలువగల బాడి ఫిట్ చేసి తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు. ఈ మేర‌కు లారీ రికార్డుల‌ను తిరుమలలోని శ్రీవారి ఆలయం చెంత టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందించారు. ముందుగా వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, …

Read More »

సరిపోదా శనివారం ట్విట్టర్ రివ్యూ.. అదరగొట్టిన నాని, ఎస్ జే సూర్య

నాని, ప్రియాంక మోహన్‌లతో వివేక్ ఆత్రేయ తీసిన చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్రంలో విలన్‌గా ఎస్ జే సూర్య నటించాడు. ఆల్రెడీ టీజర్, ట్రైలర్‌లతో పోతారు.. మొత్తం పోతారు అంటూ హైప్ క్రియేట్ చేశారు. ఆగస్ట్ 29న ఈ చిత్రం థియేటర్లోకి వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో షోలు పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల షోలు కూడా పడ్డాయి. దీంతో తెల్లవారు ఝాము నుంచే ట్విట్టర్‌లో సరిపోదా హంగామా నడుస్తోంది. ఇప్పటికే నాని ఫ్యాన్స్ ట్విట్టర్‌ను ఊపేస్తున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ప్రతి శనివారం ఆన్‌లైన్‌లో టోకెన్లు, బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. ప్రతి శనివారం తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులకు కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టోకెన్లు.. ఇకపై లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ అంగప్రదక్షిణ టోకెన్లు కావాల్సిన భక్తులు గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత వీరికి సాయంత్రం 5 గంటలకు లక్కీడిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తారు. ఇలా లక్కీడిప్ లో టోకెన్లు పొందిన భక్తులకు …

Read More »

అన్నకు రాఖీ కట్టిన చెల్లి.. కవితను చూసి కన్నీళ్లు పెట్టుకున్న తల్లి.. భావోద్వేగ దృశ్యాలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి.. ఐదున్నర నెలల తర్వాత బెయిల్ మీద విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. నివాసానికి చేరుకున్న కవితను చూసి.. తన తల్లి తీవ్ర భావోద్వేగానికి లోనై.. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత.. కుటుంబ సభ్యులందరి సమక్షంలో తన అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టారు. దీంతో.. కవిత ఇంట్లో భావోద్వేగ దృశ్యాలు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More »

శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో బయటపడిన కొత్త రకం మోసం

Tirumala: శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది.. తిరుమలకు చేరుకుంటారు. అయితే రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి వచ్చే భక్తులకు అక్కడి నిబంధనలు, సౌకర్యాలు తెలియవు. అయితే ఇలాంటి భక్తులను టార్గెట్ చేసుకుని మోసాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వెరైటీ మోసం వెలుగులోకి వచ్చింది. లాకర్ల పేరుతో భక్తులను బెదిరింటి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. దీని వెనుక ఎవరి హస్తం ఉంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దితుడిని …

Read More »

వైసీపీకి మరో బిగ్ షాక్.. పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ సునీత రాజీనామా

అధికారం కోల్పోయిన తర్వాత ఏపీలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. సీనియర్ నేతల దగ్గర నుంచి జూనియర్ల వరకు అంతా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. కీలక నేతలు అంతా పార్టీకి, పదవులకు గుడ్ బై చెప్పి.. అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేసి త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో నాయకురాలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పోతుల సునీత.. వైసీపీకి, తన ఎమ్మెల్సీ పదవికి …

Read More »

తెలుగుదేశం పార్టీలో చేరే నేతలకు షాక్.. చంద్రబాబు సంచలన నిర్ణయం

TDP: తెలుగుదేశం పార్టీలో చేరేవారికి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. ఏపీలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ నుంచి భారీగా నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైకిల్ ఎక్కుతున్నారు. భవిష్యత్‌లో మరికొందరు నేతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలోకి వచ్చేవారు ఎవరైనా సరే.. తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే పసులు కండువా కప్పుకోవాలని …

Read More »

దేశ వ్యతిరేకంగా పోస్టులు పెడితే జీవితాంతం జైలుకే.. యోగి సర్కార్ కొత్త చట్టం

Yogi Adityanath: ప్రస్తుతం సోషల్ మీడియా ఉపయోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ ఏం జరిగినా మీడియా కంటే ముందే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏ మూలన జరిగినా క్షణాల్లో ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. అయితే ఇది ఒక రకంగా మంచిదే అయినా.. చాలా వరకు సోషల్ మీడియాను దుర్వినియోగం అవుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ కేసుల పాలై జైళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సరికొత్త చట్టాన్ని …

Read More »