వైసీపీకి మరో బిగ్ షాక్.. పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ సునీత రాజీనామా

అధికారం కోల్పోయిన తర్వాత ఏపీలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. సీనియర్ నేతల దగ్గర నుంచి జూనియర్ల వరకు అంతా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. కీలక నేతలు అంతా పార్టీకి, పదవులకు గుడ్ బై చెప్పి.. అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేసి త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో నాయకురాలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పోతుల సునీత.. వైసీపీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే మోపిదేవి వెంకటరమణ పార్టీ మారుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ.. పోతుల సునీత రాజీనామా చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్సీ పదవికి.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఎమ్మెల్సీ సునీత లేఖ పంపినట్లు తెలుస్తోంది. అయితే తాను ఇప్పటికీ రాజీనామా మాత్రమే చేస్తున్నట్లు ఎమ్మెల్సీ సునీత తెలిపారు. ఇంకా ఏ పార్టీలో చేరాలి అనే దానిపై భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. గతంలో టీడీపీలో పోతుల సునీతా పనిచేశారు. ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంతో.. ఆమె వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు వైసీపీ ఓటమి పాలు కావడంతో పార్టీకి, పదవికి గుడ్ బై చెప్పారు.

About amaravatinews

Check Also

ఈ సారి భారతరత్న దక్కేది ఎవరికి? రేసులో ముందున్న ఆ ఇద్దరు..!

రిపబ్లిక్ డే వేళ భారతరత్న ఈ సారి ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ మొదలయ్యింది. గత ఏడాది భారతరత్న చరిత్రలోనే అత్యధికంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *