Blog Layout

ఏపీలో వాలంటీర్లకు గుడ్‌న్యూస్.. 

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. సాంఘిక సంక్షేమశాఖపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై చర్చకు వచ్చింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని.. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ మేరకు ఆ దిశగా కసరత్తు …

Read More »

ఆ రాశి వారు వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 31, 2024): మేష రాశి వారు ఈ రోజు ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమవుతుంది. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్తలు అందే అవకాశం ఉంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతి …

Read More »

పెన్షన్ల విషయంలో మోదీ సర్కార్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రూ.2 లక్షలు ఫైన్

Supreme Court: కేంద్ర ప్రభుత్వం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం అమలు చేయడంలో చేస్తున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన సైనిక అధికారులకు వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ పథకం ప్రకారం.. పింఛను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్రంగా మండిపడింది. ఈ వన్ ర్యాంక్ వన్ పెన్షన్లపై నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని సుప్రీం కోర్టు తీవ్రంగా విమర్శించింది. ఈ వ్యవహారంలో నరేంద్ర మోదీ సర్కార్‌కు చివరి అవకాశం ఇస్తున్నట్లు …

Read More »

బడ్జెట్‌లో చిన్నారుల కోసం కేంద్రం కొత్త స్కీమ్..

NPS Vatsalya Tax Benefits: 2024 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కొత్త స్కీమ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం NPS వాత్సల్య పథకం తీసుకొచ్చారు. 18 సంవత్సరాల లోపు బాలబాలికల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ అకౌంట్ తీసుకోవచ్చు. పిల్లలు మేజర్లు అయిన తర్వాత ఈ అకౌంట్ సాధారణ ఎన్‌పీఎస్ అకౌంట్‌గా మారుతుంది. పిల్లల భవిష్యత్ కోసం ముందు నుంచే పెట్టుబడుల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ స్కీం తీసుకొచ్చారు. …

Read More »

ఆర్‌బీఎల్ బ్యాంకు కీలక నిర్ణయం..?

ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన ఆర్‌బీఎల్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరిస్తున్నట్లు ప్రకటించింది. రూ. 3 కోట్లకు లోబడిన బ్యాంకు డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లను తీసుకొచ్చింది. 2024, జులై 29 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బ్యాంక్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లపైనా వడ్డీ రేట్లు సవరించింది. ఇది మాత్రం జులై 1 నే అమల్లోకి వచ్చిందని పేర్కొంది. ఇప్పుడు సవరించిన తర్వాత ఈ బ్యాంకులో అత్యధికంగా 500 రోజుల …

Read More »

పోలీసులకు గుడ్ న్యూస్.. హోం మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసులకు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత శుభవార్త చెప్పారు. పోలీసులకు వీక్ ఆఫ్‌లు, సరెండర్ లీవ్‌లకు నిధులపై అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి గంజాయి నివారణ, పోలీసుల సంక్షేమంపై అన్ని జిల్లాల ఎస్పీలతో హోంశాఖ మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం విశాఖ పోలీస్ కమిషనరేట్ హాల్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులకు వంగలపూడి అనిత గుడ్ న్యూస్ వినిపించారు. పోలీసులకు వీక్ ఆఫ్ మీద పరిశీలన చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే వైసీపీ …

Read More »

వాడిన టీ పౌడర్‌తో ఇలా చేస్తే మోచేతులు, అండర్‌ ఆర్మ్స్‌పై నలుపుదనం తగ్గుతుంది

టీ పొడితో మనం టీని తయారు చేయడం మాత్రమే.. మీ అందాన్ని కూడా పెంచుకోవచ్చు. టీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ముఖానికి రాసినప్పుడు స్కిన్ టోన్ మెరుగవుతుంది. అంతేకాదు, చర్మంపరై ముడతలు తగ్గి అందంగా కనిపిస్తుంది. దీనికోసం టీ పొడిని ఎలా వాడాలో తెలుసుకోండి. ఇందుకోసం తాజా టీ పొడి అవసరం లేదు. వాడిన టీ పౌడర్‌ని కూడా వాడొచ్చు. దీనిని ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఎలా వాడాలి.. దీనిని వాడడం వల్ల పెద్ద రంధ్రాలు తగ్గి ముడతలు, …

Read More »

పెళ్లి కాలేదు కానీ.. 12 దేశాల్లో 100 మందికిపైగా పిల్లలు: టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్

Telegram: పెళ్లి కాకుండానే తాను వంద మందికిపైగా పిల్లలకు తండ్రిని అయినట్లు టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా తన సంతానం విస్తరించి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని 12 దేశాల్లో తనకు 100 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని పావెల్ దురోవ్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. అయితే తాను అంత మంది పిల్లలకు ఎలా తండ్రిని అయ్యానో కూడా ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. తన టెలిగ్రామ్ …

Read More »

పొలిటికల్ ఎంట్రీపై అలేఖ్య తారకరత్న.. 

అలేఖ్య తారకరత్న తాజాగా తన ఫాలోవర్లతో ఇన్ స్టాలో చిట్ చాట్ చేసింది. తన బర్త్ డే సందర్భంగా అలేఖ్య అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. బాలయ్య బాబు విష్ చేశాడా? అని ఓ నెటిజన్ అడిగితే.. విష్ చేయలేదు.. ఆయన బిజీగా ఉండి ఉంటారు అని సమాధానం ఇచ్చేసింది. ఇక విజయ సాయి రెడ్డి మీద వస్తోన్న రూమర్ల మీద, నందమూరి కుటుంబం దూరం పెట్టడం.. నారా లోకేష్ ఆర్థిక సాయం ఇలా అనేక అంశాల మీద అలేఖ్య సమాధానం చెప్పింది. …

Read More »

తుడిచిపెట్టుకుపోయిన 4 గ్రామాలు.. వయనాడ్ కొండ చరియల విధ్వంసం.. ఆ 250 మంది సంగతేంటో?

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సహాయక చర్యలు చేపట్టి.. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ.. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. ఇక తమ కుటుంబ సభ్యులు, బంధువుల ఆచూకీ తెలియక చాలా మంది దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్నారు. మరోవైపు.. శిథిలాల కింద చిక్కుకున్న వారు కూడా తమను కాపాడాలంటూ ఫోన్లు చేస్తుండటం గమనార్హం. సహాయక సిబ్బందికి తోడు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ కూడా రంగంలోకి దిగడంతో.. వయనాడ్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. …

Read More »