తుడిచిపెట్టుకుపోయిన 4 గ్రామాలు.. వయనాడ్ కొండ చరియల విధ్వంసం.. ఆ 250 మంది సంగతేంటో?

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సహాయక చర్యలు చేపట్టి.. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ.. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. ఇక తమ కుటుంబ సభ్యులు, బంధువుల ఆచూకీ తెలియక చాలా మంది దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్నారు. మరోవైపు.. శిథిలాల కింద చిక్కుకున్న వారు కూడా తమను కాపాడాలంటూ ఫోన్లు చేస్తుండటం గమనార్హం. సహాయక సిబ్బందికి తోడు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ కూడా రంగంలోకి దిగడంతో.. వయనాడ్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. తీవ్ర విపత్తు వేళ వయనాడ్ గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది.

వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, మండకై, చురల్మల గ్రామాలు కొండలకు ఆనుకుని ఉంటాయి. ప్రకృతి ప్రేమికులను ఆకర్షించేలా ఉండే ఈ ప్రాంతాలు ఇప్పుడు శవాల దిబ్బలుగా మారిపోయాయి. సోమవారం అర్ధరాత్రి, మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రాంతాల్లో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. కొన్ని గంటల పాటు కుండపోత వర్షం పడటంతో కొండ చరియలు విరిగిపడ్డాయి.

అత్తమాల, నూల్‌పుజా, మండకై, మెప్పాడి గ్రామాల్లోని ఇళ్లపై కొండ చరియలు పడి.. ఆ ప్రాంతాలను తుడుచుపెట్టుకుపోయేలా చేసింది. కొండ ప్రాంతాల్లో నుంచి అతి వేగంతో దూసుకువచ్చిన రాళ్లు, మట్టి, బురద అంతా ఇళ్లను కప్పేసింది. ఈ 4 గ్రామాలు కొట్టుకుపోయాయి. ఆ ప్రాంతాల్లోని రోడ్లు, బ్రిడ్జిలు, ఇళ్లు అంతా కొండ చరియల ధాటికి విధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా బురదతో నిండిపోయి.. దారుణంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు 60 మందికి పైగా చనిపోగా.. దాదాపు 100 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

About amaravatinews

Check Also

దేశ రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి.. భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించిన భారత్!

దేశ రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి వ్యవస్థ అడుగుపెట్టింది. డ్రోన్‌ విధ్వంసక సూక్ష్మ క్షిపణి వ్యవస్థ ‘భార్గవాస్త్రను భారత్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *