జనసేన పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా రాష్ట్ర పార సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు శాసన సభాపతికి డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమాచారం అందించారు. పార్టీ చీఫ్ విప్గా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కార్యదర్భులుగా విశాఖ సాత్ ఎమ్మెల్యే చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ , రాజోలు ఎమ్మెల్యే …
Read More »Blog Layout
కేంద్ర బడ్జెట్లో విశాఖకు తీపి కబురు.. భారీగా నిధులు, పూర్తి వివరాలివే
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా కేటాయింపులు జరిగాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలే కాకుండా.. ఇతర ప్రయోజనాలు కూడా కలగనున్నాయి. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కలిగే అదనపు ప్రయోజనాల వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు బడ్జెట్లో రూ.620 కోట్లు కేటాయించగా.. గత బడ్జెట్తో పోలిస్తే రూ.63 కోట్లు తగ్గింది. అలాగే విశాఖలో ఏర్పాటుచేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీకి రూ.168 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.78 కోట్లు పెంచడం …
Read More »ఏపీకి కేంద్రం మరో అదిరిపోయే శుభవార్త..
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించింది. అమరావతి, పోలవరంతో పాటూ పలు కీలక ప్రకటనలు చేసింది. వీటితో పాటూగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వాటాపై కూడా క్లారిటీ వచ్చిది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.50,474.64 కోట్ల వాటా రానుంది.. ఇది గతేడాది కంటే రూ.5,776 కోట్లు (12.92%) అధికం అని కేంద్రం తెలిపింది. గత ఫిబ్రవరిలో రూ.49,364.61 కోట్లతో పోలిస్తే.. రూ.1,110 కోట్లు ఎక్కువ. కేంద్రం 2024-25 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.12,47,211.28 కోట్ల వాటాను పంచనుంది. ఇందులో 4.047% ఆంధ్రప్రదేశ్కు …
Read More »తిరుమలలో భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ నిర్దేశించిన రేట్లకే వాటర్ బాటిళ్లు విక్రయించాలని జేఈవో (విద్య, ఆరోగ్యం) గౌతమి చెప్పారు. తిరుమలలోని ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. తిరుమలలోని దుకాణదారులు టీటీడీ నిర్దేశించిన రేట్ల కంటే అధిక రేట్లకు వాటర్ బాటిళ్లు అమ్ముతున్నారని, కాళీ గాజు బాటిళ్లు తీసుకోవడం లేదని పలువురు భక్తులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు, తిరుమలలోని దుకాణదారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలోని అన్ని దుకాణాలలో ఒకే రేటుతో వాటర్ బాటిళ్లు …
Read More »ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వివాదం వేళ యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోని రాజీనామా
UPSC: యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోని రాజీనామా చేశారు. ఇంకా 5 ఏళ్ల పదవీ కాలం ఉండగానే మనోజ్ సోని.. తన పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం తీవ్ర ఊహాగానాలకు దారి తీస్తోంది. అయితే గత ఏడాది యూనియన్ పబ్లిక్ కమిషన్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మనోజ్ సోని.. ఉన్నట్టుండి రాజీనామా చేయడం కీలకంగా మారింది. మరోవైపు.. ఇటీవల కొన్ని రోజులుగా ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వివాదం కొనసాగుతుండగా.. ఈ సమయంలో యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనా చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. …
Read More »వైఎస్ జగన్కు ఎవరు ఇలాంటి సలహాలు ఇస్తున్నారో….?
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ శవ రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. వినుకొండ పర్యటనలో ఏపీ ప్రభుత్వం మీద వైఎస్ జగన్ చేసిన ఆరోపణలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ నాగబాబు వీడియో విడుదల చేశారు. వినుకొండ రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదన్న నాగబాబు.. పాత పగల కారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో రషీద్ హత్యకు …
Read More »ఏపీలో దంచికొడుతున్న వానలు.. మరో రెండు రోజులు ఇంతే..
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలలో భారీ వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శనివారం, ఆదివారం అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని ప్రకటించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని.. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా …
Read More »వైఎస్ జగన్-సాయిరెడ్డి మధ్య ‘శాంతి’పై చర్చ.. వివరణ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘శాంతి’ ఇష్యూపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై జగన్కు సాయిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అసలేం జరిగిందంటే..? తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎంపీలతో.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి మందు.. వైఎస్ జగన్- ఎంపీ విజయసాయి సాయిరెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ సమావేశానికంటే ముందే జగన్తో అరగంట పాటు.. విడిగా సాయిరెడ్డి, మిథున్ …
Read More »నేడు ఎంపీలతో చంద్రబాబు సమావేశం
జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఇవాళ సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు (Chandrababu) ఇవాళ సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. సమావేశానికి టీడీపీ (TDP) ఎంపీలు, కేంద్రమంత్రులు …
Read More »ఒకేరోజు రూ.8 లక్షల కోట్లు ఆవిరి
వరుస లాభాలతో రికార్డు గరిష్టాలకు చేరుకున్న దేశీయ సూచీలకు శుక్రవారం చాలా పెద్ద దెబ్బ తగిలింది. సెన్సెక్స్, నిఫ్టీతో పాటు మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు బాగా కరెక్ట్ అయ్యాయి. మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయంగా విమానయాన, బ్యాంకింగ్ రంగాలు తీవ్ర అంతరాయం ఎదుర్కొన్నాయి. వరుస లాభాలతో రికార్డు గరిష్టాలకు చేరుకున్న దేశీయ సూచీలకు (Stock Market) శుక్రవారం చాలా పెద్ద దెబ్బ తగిలింది. సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty)తో పాటు మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు బాగా కరెక్ట్ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal