TimeLine Layout

October, 2024

  • 31 October

    తెలంగాణలో 3 కొత్త రైలు మార్గాలు.. నాలుగు లైన్లతో, ఆ ప్రాంతాలకు మహర్దశ

    తెలంగాణలోని రైలు ప్రయాణికులకు తీపి కబురు. రెల్వే కనెక్టివిటీ మరింత పెరగనుంది. ప్రయాణికులకు ఉపయోగపడే మూడు ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులు కీలకదశలో ఉన్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. పుణే, ముంబయి వైపు వెళ్లే సికింద్రాబాద్‌-వాడి మార్గం ప్రస్తుతం రెండు లైన్లతో ఉండగా.. దాన్ని విస్తరించనున్నారు. క్వాడ్రాప్లింగ్‌ (నాలుగు లైన్ల)కు విస్తరించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే సిద్ధమవుతోంది. ఈ లైన్ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ ఇప్పటికే రైల్వే బోర్డుకు అందింది. బోర్డు అనుమతి లభిస్తే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టే …

    Read More »
  • 31 October

    ఏపీ ఉచిత గ్యాస్ సిలండర్ల పథకం.. తొలిరోజు ఎంతమంది బుక్ చేసుకున్నారంటే, అంత తక్కువా!

    ఆంధ్రప్రదేశ్‌లో దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం మొదలైంది. ఈ నెల 29 నుంచి గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రారంభమైంది. ఈ దీపం పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబరు 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ప్రారంభించనున్నారని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సూపర్‌ సిక్స్‌లో అమలవుతున్న మొదటి పథకం ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకమని గుర్తు చేశారు. తొలిరోజు 4.3 లక్షల బుకింగ్‌లు అయ్యాయని.. లబ్ధిదారుల నుంచి భారీ స్పందన వస్తోందన్నారు. గ్యాస్ రోజుకు రెండున్నర …

    Read More »
  • 30 October

    విమానాలకు బెదిరింపు కాల్స్.. అజ్ఞాత వ్యక్తిని కనిపెట్టిన పోలీసులు.. వెళ్లి చూస్తే షాక్!

    దేశంలోని విమానయాన సంస్థలకు ఈ మధ్య ఓ కొత్త తలనొప్పి మొదలైంది. అజ్ఞాత వ్యక్తుల నుంచి వస్తున్న బెదిరింపు కాల్స్. మెయిల్స్ విమానయాన సంస్థలను బెదరగొడుతున్నాయి. విమానం ప్రయాణిస్తున్న సమయంలో.. లేదా ప్రారంభానికి ముందు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూ ఉండటంతో.. పలు విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. మరికొన్నింటిని హుటాహుటిన దారిమళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేసి పరిశీలించాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకూ వచ్చినవి అన్నీ ఫేక్ కాల్స్ కావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు కాల్స్ కారణంగా భారీగా నష్టం కూడా …

    Read More »
  • 30 October

    Hallmarking: బంగారు ఆభరణాలు కొంటున్నారా? వీటికి హాల్‌మార్కింగ్ అవసరం లేదు.. ఫుల్ లిస్ట్ ఇదే..

    Gold Hallmark Check: బంగారు ఆభరణాలు సహా ఇతర బంగారు కళాకృతులకు హాల్‌మార్కింగ్ అనేది కచ్చితంగా ఉండాలన్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడో హాల్ మార్కింగ్ తీసుకురావాలని చూసినా.. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇది వాయిదా పడింది. ఎట్టకేలకు ఏడాది కిందట దీనిని తీసుకొచ్చింది. ఇప్పుడు హాల్ మార్కింగ్ లేని బంగారు ఆభరణాలు విక్రయించేందుకు జువెల్లరీలకు అనుమతి లేదు. అందుకే గోల్డ్ జువెల్లరీ కొనుగోలు చేసే వారు.. ఈ హాల్ మార్కింగ్ గురించి తెలుసుకోవాలి. ఆభరణాలపైనే.. ఈ హాల్ మార్కింగ్ సంకేతాలు మనం గుర్తించాల్సి …

    Read More »
  • 30 October

    ఏపీలో కరవు మండలాల జాబితా విడుదల.. 5 జిల్లాల్లో 54 మండలాలు, పూర్తి వివరాలివే

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కరవు మండలాల జాబితాను విడుదల చేసింది. ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలపై రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 54 మండలాలు కరవుబారిన పడినట్లు తెలిపారు. అలాగే మిగిలిన 21 జిల్లాల్లో కరవు పరిస్థితులు లేనట్లుగా నివేదికలు వచ్చాయని ప్రస్తావించారు. ఈ మండలాల్లో 27 చోట్ల తీవ్రంగా.. మరో 27 మండలాల్లో కరవు …

    Read More »
  • 30 October

    ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త.. వచ్చే నెల 1 నుంచి పక్కా, నాలుగు రకాలు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డులు ఉన్నవారికి వచ్చే నెల నుంచి నాలుగు రకాల సరుకుల్ని అందజేయనుంది. వచ్చే నెల నుంచి నాలుగు రకాల సరకులు తెల్లరేషన్‌ కార్డుదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు సరుకులు చేరగా.. బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార, జొన్నలు పంపిణీ చేయనున్నారు. ఈ సరుకుల్ని కచ్చితమైన తూకాలు, నాణ్యమైనవి సరఫరా చేయనున్నారు. అక్టోబరు నెలలో 50 శాతానికిపైగా కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయగా.. నవంబరులో ప్రతి కుటుంబానికి నాలుగు వస్తువులు అందించబోతున్నారు. నవంబరులో …

    Read More »
  • 30 October

    ఏపీలో మందుబాబులకు అదిరే శుభవార్త.. ధరలు తగ్గింపు, కొత్త బ్రాండ్లు వస్తున్నాయి!

    ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు తీపికబురు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే నాణ్యతతో పాటు తక్కువ ధరకే మద్యాన్ని అందుబాటులోకి తీసుకురాగా.. త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అలాగే మద్యం ధరల తగ్గించే ఆలోచన చేస్తున్నామన్నారు.. రేట్ల తగ్గింపుపై కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీపీఎస్ పెట్టి సరకు పంపుతున్నామని.. మద్యం ధరలు తగ్గించి త్వరలోనే వాటిని అమలు చేస్తామన్నారు. అంతేకాదు అనుమతి లేకుండా పబ్‌లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిజిటల్ పేమెంట్ అనుమతిస్తామని.. కొత్త …

    Read More »
  • 30 October

    తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. అద్భుత అవకాశం, త్వరపడండి

    తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యంను న‌వంబ‌రు 7వ తేదీన టెండర్‌, వేలం వేయనున్నారు. ఇందులో మిక్సిడ్‌ బియ్యం 13,880 కేజీలు టెండర్‌, వేలంలో ఉంచనున్నారు. ఆసక్తి గలవారు నవంబరు 7వ తేదీలోపు ”కార్యనిర్వహణాధికారి, టీటీడీ” పేరిట రూ. 25,000/- ఈఎండి, సీల్డ్‌ టెండర్‌తో పాటు తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం, జనరల్‌ మేనేజర్‌(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు టెండర్లను తెరవడం జరుగుతుంది. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ …

    Read More »
  • 29 October

    కపిల్‌దేవ్, చంద్రబాబు భేటీ.. ఏపీలో ఆ మూడు చోట్లా గోల్ఫ్ కోర్టులు!

    Cricketer Kapil dev meets cm Chandrababu in Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రాంతాల్లో గోల్ఫ్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. అమరావతి, అనంతపురం, విశాఖపట్నంలో గోల్ఫ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. మంగళవారం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌, కేశినేని చిన్నితో కలిసి ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటు సహా వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కపిల్ దేవ్ …

    Read More »
  • 29 October

    అయోధ్యలోని వానరాలకు దీపావళి గిఫ్ట్.. హీరో అక్షయ్ కుమార్ మంచి మనసు

    Akshay Kumar: అయోధ్యలో ఉండే కోతులకు ఆహారాన్ని అందించి.. హీరో అక్షయ్ కుమార్ తన దాతృత్వాన్ని మరోసారి బయటపెట్టారు. దేశం నలుమూలల నుంచి అయోధ్య రామమందిరానికి వచ్చే భక్తులపై అక్కడ ఉండే కోతులు ఆహారం కోసం దాడి చేస్తుండటం తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్న వేళ.. బాలరాముడి ఆలయం వద్ద ఉన్న వానరాల కోసం అక్షయ్ కుమార్.. ఫీడింగ్ వ్యాన్‌ను పంపించారు. దీపావళి పండగ సందర్భంగా అక్షయ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన తల్లిదండ్రులకు నివాళులు అర్పిస్తూ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్షయ్ కుమార్ వెల్లడించారు. దీపావళి పండగ …

    Read More »