TimeLine Layout

October, 2024

  • 25 October

    AP Deepam Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. ఉచిత గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్కోండి మంత్రి కీలక ప్రకటన

    ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల దీపం పథకంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆధార్, తెల్ల రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ నెల 29 ఉదయం 10 గంటల నుంచి ఫ్రీ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సిలిండర్ బుక్ చేసుకోగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి SMS (మెసేజ్) వెళుతుందని చెప్పారు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక పట్టణాల్లో 24గంటలు, గ్రామాల్లో 48గంటల్లో సిలిండర్ సరఫరా అవుతుందని.. సిలిండర్ డెలివరీ అయ్యాక 48 గంటల్లోపు డబ్బు …

    Read More »
  • 25 October

    Ratan Tata Will: టాటా గొప్ప మనసు.. తన రూ. 10 వేల కోట్ల ఆస్తిలో బట్లర్ సుబ్బయ్య, కుక్ రాజన్ సహా కుక్కకు కూడా వాటా..!

    Ratan Tata Networth: మార్కెట్ విలువ పరంగా భారత్‌లో టాటా గ్రూప్ అతిపెద్దది. దీని మార్కెట్ విలువ రూ. 30 లక్షల కోట్లకుపైగానే ఉంటుంది. పలు దేశాల జీడీపీ కంటే కూడా దీని విలువే ఎక్కువ అని చెప్పొచ్చు. అయితే టాటా గ్రూప్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో టాటా సన్స్, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటా పాత్ర కీలకం. దశాబ్దాల పాటు సంస్థకు నేతృత్వం వహించి సంస్థను విస్తరించారు. ఆయన నేతృత్వంలో దాదాపు అన్ని రంగాల్లో కార్యకలాపాలు ప్రారంభించి.. ఎందరికో …

    Read More »
  • 25 October

    ఏపీలో రైతులకు ముఖ్య గమనిక.. ఆ డబ్బులు మీరే చెల్లించాలి

    ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ముఖ్యమైన గమనిక. రైతులకు 2019 ముందు నాటి పంటల బీమా విధానమే రబీ నుంచి అమలు చేస్తున్నామన్నారు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌. ఈ మేరకు పంటల వారీ నిర్ణయించిన ప్రీమియాన్ని రైతులే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రబీ పంటల బీమా అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యాన అధికారులు, ప్రణాళిక అధికారులు, లీడ్‌బ్యాంకు మేనేజర్లతో వీడియో సమావేశం జరిగింది. పీఎంఎఫ్‌బీవై (ప్రధానమంత్రి ఫసల్‌ బీమా), సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకాలపై రైతుల్లో అవగాహన …

    Read More »
  • 25 October

    Cyclone Dana: తీవ్ర తుఫానుగా తీరం దాటిన ‘దానా’..ఒడిశా, బెంగాల్‌లో పెను విధ్వంసం

    వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తీవ్ర తుఫాన్‌ (Cyclone Dana) గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటింది. ఒడిశాలోని బిత్తర్‌కనిక‌లోని హబలిఖాటి జాతీయ పార్క్‌, ధమ్రా మధ్య అర్ధరాత్రి 1.30 నుంచి మొదలైన ఈ ప్రక్రియ.. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు కొనసాగినట్టు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తీరం దాటిన ‘దానా’ శుక్రవారం ఉదయం 12 గంటల వరకు తీవ్ర తుఫానుగా కొనసాగి తర్వాత బలహీనపడి తుఫానుగా మారుతుందని, సాయంత్రానికి మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా, రాత్రికి వాయుగుండంగా …

    Read More »
  • 25 October

    ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త.. వచ్చే నెల నుంచి పక్కా, చాలా తక్కువ ధరకే

    ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో రైతు బజార్ల ద్వారా వంటనూనె, కందిపప్పును తక్కువ ధరకు పంపిణీ చేస్తోంది. ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో కంది పప్పు కేజీ రూ.180 ఉండగా.. రైతు బజార్లలో ఇప్పటికే కందిపప్పు కౌంటర్లు తెరచి కిలో రూ.110కే అందిస్తున్నారు. అయితే నవంబర్ నెల నుంచి కందిపప్పు, పంచదారను బియ్యంతో పాటుగా పంపిణీ చేయనున్నారు. రెండు నెలల కిత్రం దీని కోసం టెండర్లు పిలవగా.. గత నెల నుంచి గోడౌన్‌లకు చేరుతోంది. నవంబరులలో రేషన్‌కార్డులు …

    Read More »
  • 25 October

    Dana Cyclone: ఏపీపై దానా తుఫాన్‌పై ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు

    వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుఫాన్‌గా బలపడి హబాలిఖాతి నేచర్ క్యాంప్‌ (భిత్తర్కనిక)-ధమ్రాకు సమీపంలో తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుఫాన్ గురువారం అర్ధరాత్రి తర్వాత 1:30 నుంచి తెల్లవారుజాము 3:30గంటల మధ్యతీరం దాటింది. ఇది పశ్చిమ-వాయువ్యదిశగా కదులుతూ శుక్రవారం మధ్యాహ్నం వరకు క్రమంగా బలహీనపడుతుందన్నారు.. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయంటున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాలపై తుఫాన్ …

    Read More »
  • 25 October

    ఏపీలో పింఛన్‌లపై మరో శుభవార్త.. ఇకపై చాలా ఈజీగా, ఆరంచెల విధానం రద్దు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల లబ్ధిదారుల అర్హత నిర్ణయించేందుకు అనుసరించిన ఆరంచెల పరిశీలనకు గుడ్ బై చెప్పారు. ఈ విధానం ఇకపై ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ఇకపై రాష్ట్రంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందుతుందని చెప్పారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో అర్హత లేకపోయినా చాలామందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారంటూ ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించేందుకు మంత్రులతో కమిటీ వేయాలని ముందు అనుకున్నారు.. …

    Read More »
  • 25 October

    YS Sharmila: ఎవరి ఇంట్లో చెల్లిని, తల్లిని కోర్టుకు ఈడ్చారు..? జగన్‌కు షర్మిల కౌంటర్

    YS Sharmila: వైఎస్ కుటుంబంలో జగన్, షర్మిల మధ్య ఆస్తి తగాదాలు.. బయటికి రావడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఈ వివాదంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించగా.. ఆ వ్యాఖ్యలకు ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. అన్ని కుటుంబాల్లో ఉండే వివాదమే తమ ఇంట్లో ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయిన షర్మిల.. ప్రతీ ఇంట్లో తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఇది సామాన్యమైన విషయం కాదు …

    Read More »
  • 24 October

    Vizag: విశాఖ ఏజెన్సీవాసులకు గుడ్‌న్యూస్, ఆ సమస్యకు చెక్.. హోంమంత్రి అనిత కీలక ప్రకటన

    Vizag: విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు ఆహ్లాదకరంగా, అందంగా ఉంటాయి. కానీ మారుమూల పల్లెలకు రవాణా సౌకర్యం ఉండదు. కనీసం రోడ్లు కూడా లేక చెట్లు, కొండలు, గుట్టలు దాటుకుంటూ అక్కడి ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక వర్షాలు, చలికాలం.. ఇలాంటి సమయాల్లో వారి బాధ వర్ణనాతీతం. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే.. వాళ్లు అక్కడి నుంచి బయట పడాలంటే ఒక యుద్ధం చేయాల్సిందే. ఇక అనారోగ్యం బారిన పడినవారు, పురిటి నొప్పులు వచ్చిన గర్భిణీలు, చావుబతుకుల్లో ఉన్న …

    Read More »
  • 24 October

    DANA Cyclone: పెను తుఫానుగా ‘దానా’.. వందలాది రైళ్లు రద్దు,. ఎయిర్‌పోర్ట్‌లు మూసివేత

    తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఏర్పడిన ‘దానా’ తీవ్ర తుఫానుగా మారిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఈ తుఫాను పరదీప్‌కు దక్షిణ తూర్పు దిశలో 330 కిలోమీటర్లు, ధమ్రాకు 360 కి.మీ., సాగర ద్వీపానికి (పశ్చిమబెంగాల్‌) 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుఫాను ఉత్తర, పశ్చిమ దిశగా తీరానికి చేరువవుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం గంటకు 15 కిలోమీటర్ల వేగంతోవాయువ్య దిశగా దూసుకొస్తున్న ఈ తుఫాను.. పశ్చిమ్ బెంగాల్-ఒడిశా మధ్య పూరీ-సాగర్ ఐల్యాండ్‌కు సమీపంలోని భితార్‌కనిక-ధమ్రా వద్ద గురువారం …

    Read More »