చిరుతను మొబైల్ లో క్యాప్చర్ చేసిన యువకులు అటవీ ప్రాంతంలోకి తరిమేసే ప్రయత్నం చేసారు. ఆటో, బైక్ లైటింగ్ సాయంతో శబ్దాలు చేస్తూ చిరుతను తరిమేందుకు ప్రయత్నం చేశారు. కాసేపు అక్కడే మాటు వేసిన చిరుత ఆ తరువాత అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోవడంతో అలిపిరి నుంచి జూ పార్క్ రోడ్డులో వెళ్లేవాళ్లు, కంటి ఆసుపత్రికి వచ్చిన వారు ఊపిరి పీల్చుకున్నారు.శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న చిరుతలు జనాన్ని భయపెడుతున్నాయి. జనావాసాల్లోకి వచ్చి సందడి చేస్తుండడంతో భక్తుల్లో అలజడి రేపుతోంది. జులై 1 …
Read More »TimeLine Layout
July, 2025
-
2 July
హైదరాబాద్లో ఏనుగు దంతాల కేసు.. కట్చేస్తే.. తిరుమల శేషాచలంలో కదిలిన డొంక..!
శేషాచలం అటవీ ప్రాంతం దట్టమైన అడవులు అరుదైన వృక్ష జంతు జాతులకు నిలయం. అయితే ఈ మధ్య స్మగ్లర్ల బెడద శేషాచలం కొండల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎర్రచందనం స్మగ్లర్ల అలజడి ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే ఇప్పుడు ఏనుగుల దంతాల కేసు మూలాలు శేషాచలం అటవీ ప్రాంతానికి ముడి పెట్టడంతో అటవీశాఖలో ఆందోళన ప్రారంభమైంది. ఎర్రచందనం చెట్లు నేలకొరుగుతున్నట్లే వన్యప్రాణులు కూడా అంత మొందుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. తాజాగా హైదరాబాదులో నమోదైన ఏనుగు దంతాల కేసు ఉమ్మడి చిత్తూరు జిల్లా అటవీ శాఖను భయపెడుతోంది. …
Read More » -
2 July
మినీ యుద్ధ ట్యాంకర్ ను తయారు చేసి.. దేశ రక్షణకు నేను సైతం అంటున్న కాకినాడ కుర్రోడు
పాకిస్తాన్ కి భారతదేశానికి యుద్ధం జరిగిన ప్రతిసారి దేశ రక్షణలో తను కూడా భాగస్వామ్యం అవలేనందుకు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు ఓ యువకుడు. యుద్ధంలో పాల్గొనేందుకు తనకి వీలు లేకపోవడంతో యుద్ధానికి ఉపయోగపడే ఓ డమ్మీ వెపన్ లను, యుద్ధ ట్యాంకర్ వాహనాన్ని. తయారు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహాయం చేస్తే దేశ రక్షణ కోసం యుద్ద పరికరాలు చేస్తానని చెబుతున్నాడు.కాకినాడ జిల్లాకు చెందిన యువకుడు గతంలో ఏకీ 47, ఆర్ ఎఫ్ ఎల్ రైఫిల్, మినీ యుద్ధ …
Read More » -
2 July
ఏపీ విద్యార్ధులకు బిగ్ అలెర్ట్.. రూ. 15 వేలు కావాలంటే ఇలా చేయాల్సిందే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల తల్లుల కోసం అమలవుతున్న “తల్లికి వందనం” కార్యక్రమానికి నేటితో (జూలై 2, మంగళవారం) చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ఒకటో తరగతిలో చేరిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు బదిలీ చేస్తోంది. ఇవాళ సాయంత్రం వరకే ఆఖరి అవకాశం ఉన్నందున విద్యార్థుల తల్లులు అవసరమైన వివరాలు వెంటనే సమర్పించాలని అధికారులు సూచించారు. తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, విద్యకు ప్రాధాన్యతనిస్తూ “తల్లికి వందనం” పథకాన్ని పునఃప్రారంభించింది. ఈ పథకం …
Read More » -
2 July
ఆషాడ మాసంలో.. శాంకాంబరిగా అన్నపూర్ణమ్మ ప్రత్యేక అలంకరణ!
భీమవరం పంచారామ క్షేత్రం శ్రీఉమా సోమేశ్వరజనార్దన స్వామి ఆలయంలో కొలువై ఉన్న అన్నపూర్ణాదేవి అమ్మవారికి ఆషాడ మాసం సందర్భంగా శాకాంబరీ అలంకరణ చేశారు. వంద కిలోల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలుతో ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. సోమేశ్వరస్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి..పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రం శ్రీఉమా సోమేశ్వరజనార్దన స్వామి ఆలయంలో కొలువై ఉన్న అన్నపూర్ణాదేవి అమ్మవారికి ఆషాడ మాసం సందర్భంగా శాకాంబరీ అలంకరణ చేశారు. వంద కిలోల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలుతో ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. …
Read More » -
2 July
పాకీజా దీన స్థితికి చలించిన పవన్ కల్యాణ్.. నటికి తక్షణ సాయం.. ఎంతంటే?
ఒకప్పుడు పాకీజాగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటి వాసుకి ఇప్పుడు దీన స్థితిలో ఉన్నారు. తనను ఆదుకోవాలంటూ ఆమె ఇటీవల ఒక వీడియోను రిలీజ్ చేశారు. నటి దీన స్థితిని చూసి చలించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాకీజాకు తక్షణ సాయం ప్రకటించారు.తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆపన్న హస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవర్ స్టార్ రూ. 2 లక్షల రూపాయలు …
Read More » -
2 July
మనుషుల ప్రాణాలంటే జగన్కు లెక్కలేదు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
జగన్కు మనుషుల ప్రాణాలంటే లెక్కలేదన్నారు సీఎం చంద్రబాబు. తన కారు కింద పడి మనిషి చనిపోయినా రాజకీయం చేయడం ఆయనకే చెల్లిందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలతో ఏపీ అభివృద్ధి వెనక్కి వెళ్లిందన్నారు చంద్రబాబు. వైసీపీ అధినేత జగన్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు సీఎం చంద్రబాబు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో పాలన పడకేసిందన్నారు. పది లక్షల కోట్ల అప్పులు చేసి జగన్ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారన్నారు. సీఎంగా 15 ఏళ్ల అనుభవం ఉన్న తనకే రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఏడాది సమయం …
Read More » -
1 July
ఆటగదరా శివ.! ఆర్య సమాజ్లో ప్రేమ పెళ్లి.. ఆపై రెండు నెలలకే ఆ ఇద్దరూ..
ఇద్దరి మనసులు కలిశాయి. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనుకున్నట్లుగానే రెండు నెలల క్రితం వారు ఉంటున్న ఇంటి ఓనర్ సహాయ సహకారాలతో ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలల క్రితం రమ్యశ్రీకి కూడా నిఖిల్ రెడ్డి చేస్తున్న కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించాడు. తమకు నచ్చినవారితో జీవితం కొనసాగించాలని ప్రేమ వివాహం చేసుకుని.. తమ జీవితాన్ని ఎంతో హాయిగా గడపాలని ఎన్నెన్నో కలలు కన్న ఒక జంట.. వివాహమైన రెండు నెలలకే వారి జీవితాలకు చివరి రోజులు వచ్చేస్తాయని ఊహించలేకపోయారు. ఒకే చోట …
Read More » -
1 July
సత్యసాయి గ్రామంలో మ్యూజిక్ మాస్ట్రో AR రెహమాన్ సందడి.. సాయి సంఫనీ ఆర్కెస్ట్రాపై ప్రశంసల జల్లు!
సత్యసాయి గ్రామంలో నిర్వహించిన సాయి సింఫనీ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ సందర్శించారు. ఇందులో గ్రామీణ, పేద నేపథ్యాల నుంచి వచ్చిన 170 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్వదేశీ ఆర్కెస్ట్రా. రెహమాన్ సత్యసాయి గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా విద్యార్థులు ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు..మ్యూజిక్ మాస్ట్రో, గ్రామీ, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సత్యసాయి గ్రామాన్ని సందర్శించారు. గ్లోబల్ హ్యుమానిటేరియన్, ఆధ్యాత్మికవేత్త మధుసూదన్ సాయి నేతృత్వంలోని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వివిధ మానవతా కార్యక్రమాలను పర్యవేక్షించారు. …
Read More » -
1 July
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు BV పట్టాభిరామ్ కన్నుమూత..!
ప్రఖ్యాత హిప్నాటిస్ట్, సైకాలజిస్ట్, వ్యక్తిత్వవికాస నిపుణులు డాక్టర్ పట్టాభి రామ్ (75) కన్నుమూశారు. సోమవారం (జూన్ 30) రాత్రి 9.45 గంటలకు గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఇంద్రజాలకుడిగా (మెజీషియన్) తన ప్రయాణాన్ని ప్రారంభించి, కెరీర్లో అంచలంచెలుగా ఎదిగారు. ఆయన తన జీవితకాలంలో అనేక బెస్ట్ సెల్లింగ్ మోటివేషనల్ పుస్తకాలను రచించారు. యువతకు లెక్కకుమించి మోటివేషన్ స్పీచ్లు ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్ధులు, యువత కోసం ఆయన అహోరాత్రులు కష్టించారు. సానుకూల ఆలోచనలను రేకెత్తించడానికి, ప్రేరేపించడానికి, జీవిత సవాళ్లను అధిగమించి ఉన్నతంగా ఎదగడం.. వంటి ఎన్నో …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal