రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ కోటి.. ఏపీకి అశ్వనీదత్, ఆయ్ టీం విరాళం

రెండు తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం వరుణుడి దెబ్బకు అతలాకుతలం అవుతోన్నాయి. వరదల ధాటికి ఊర్లన్నీ నీటమునిగాయి. ఇంట్లోకి నీరు వచ్చి చేరింది. వాహనాలు కొట్టుకుపోయాయి. ఎంతో మందికి నిద్ర, ఆహారం కరవయ్యాయి. ప్రభుత్వం నిరవధికంగా సహాయక చర్యలు అందిస్తూనే ఉంది. ఈ వరదల వల్ల ఏపీలోని విజయవాడ, గుంటూరు ప్రాంతాలు ఎక్కువగా నష్టపోయాయి. ఇక ఈ వరదల ప్రభావం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లుతుంది. అందుకోసం టాలీవుడ్ నుంచి సెలెబ్రిటీలు ముందుకు వచ్చి ప్రభుత్వాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు యాభై లక్షల చొప్పున ఎన్టీఆర్ కోటి విరాళాన్ని ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50లక్షల విరాళం గా ప్రకటిస్తున్నాను. అని ట్వీట్ వేశాడు.

ఇక అశ్వనీదత్ కల్కి టీం నుంచి రేపటి కోసం అంటూ ఏపీ ప్రభుత్వానికి మాత్రమే రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆయ్ టీంకు ఈ వారం వచ్చే కలెక్షన్లలో 25 శాతం షేర్‌ని ప్రభుత్వానికి ఇస్తామన్నట్టుగా ప్రకటించారు. విశ్వక్ సేన్ అయితే ఏపీ ప్రభుత్వానికి రూ. 5 లక్షల విరాళాన్ని ఇచ్చాడు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే నిర్విరామంగా వరధ బాధితుల్ని పరామర్శిస్తూనే ఉన్నారు. వారి కోసం వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ ఆహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణలో ఖమ్మం ప్రాంతం మొత్తంగా నీట మునిగిన సంగతి తెలిసిందే. మరి మెగా ఫ్యామిలీ నుంచి ఇంకా ఈ విరాళాల ప్రవాహాం మొదలవ్వలేదు.

About amaravatinews

Check Also

వంశీ కేసులో దర్యాప్తు ముమ్మురం చేసిన పోలీసులు

– లెక్కలన్నీ తేలుస్తాం…! అందరిని బయటకు తీస్తాం..! అంటూ వల్లభనేని వంశీ కేసులో దూసుకుపోతున్నారు పోలీసులు. ఓవైపు టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌… …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *