మిస్ ఇండియా 2024గా నిఖితా పోర్వాల్.. ఇంతకీ ఆమె ఎవరంటే?

Nikita Porwal: ఈ ఏడాది మిస్‌ ఇండియా కిరీటం మధ్యప్రదేశ్‌కు చెందిన నిఖితా పోర్వాల్‌ దక్కించుకున్నారు. ముంబైలోని ఫేమస్ స్టూడియోస్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో అన్ని రాష్ట్రాలకు చెందిన అందాల తారలు పోటీ పడగా.. చివరికి నిఖితా పోర్వాల్‌నే విజయం వరించింది. మిస్ ఇండియాగా నిలిచిన నిఖాతా పోర్వాల్.. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భారత్‌ తరఫున బరిలోకి దిగనున్నారు. మిస్ ఇండియా టైటిల్ గెలిచిన తర్వాత నిఖితా పోర్వాల్.. సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక గత ఏడాది మిస్ ఇండియాగా నిలిచిన నందిని గుప్తా.. నిఖితా పోర్వాల్‌కు మిస్ ఇండియా కిరీటాన్ని అందించారు.

ముంబైలో జరిగిన 60వ ఫెమీనా మిస్‌ ఇండియా పోటీల్లో 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన యువతులు పాల్గొన్నారు. ఈ మిస్ ఇండియా పోటీల్లో తమ అందాలతోనే కాకుండా ప్రతిభతోనూ వారు జడ్జిల నుంచి అభినందనలు అందుకున్నారు. ఇక ఫైనల్ రౌండ్‌లో అదరగొట్టిన నిఖితా పోర్వాల్‌.. మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. ఇక మిస్ ఇండియా టైటిల్‌ గెలిచిన తర్వాత మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నిఖితా పోర్వాల్.. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు.

About amaravatinews

Check Also

మీ వద్ద చిరిగిపోయిన నోట్లు ఉన్నాయా..? కొత్త నోట్లను పొందడం ఎలాగంటే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాల ప్రకారం.. మీరు మ్యుటిలేట్ చేసిన నోట్లను కలిగి ఉంటే, మీరు వాటిని మార్చుకోవాలనుకుంటే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *