విశాఖ: రూ.1500కు కొనుగోలు చేసి రూ.25 వేలకు అమ్మకం.. ఐదేళ్లుగా నడుస్తోంది, పెద్ద ప్లానింగే

ఉత్తరాంధ్ర టు హైదరాబాద్.. అక్కడ తీగ లాగితే ఇక్కడ డొంక మొత్తం కదిలింది. కొంతకాలంగా హైదరాబాద్‌లో గంజాయి, డ్రగ్స్ దందాలు నడుస్తున్నాయి. కొంతమంది ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్‌‌లో విక్రయిస్తున్నారు. ఈ ముఠాను పట్టుకున్న పోలీసులు.. ఈ దందాపై ఆరా తీస్తే ఉత్తరాంధ్రలో డొంక కదిలింది.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. రెండు రోజుల క్రితం పోలీసులు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న బాలాజీ గోవింంద్‌‌ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు.. వారిని ప్రశ్నిస్తే ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది.

బాలాజీ గోవింద్ ఇంటర్‌లోనే చదువు మానేసి హైదరాబాద్‌తో పాటుగా‌ ఆంధ్రప్రదేశ్‌లో పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. ఇంతలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో (ఆంధ్రా-ఒడిశా) బోర్డర్‌లోని చిత్రకొండ అటవీ ప్రాంతానికి చెందిన గంజాయి సాగు చేసే రైతులతో పరిచయం ఏర్పడింది. అప్పుడు తన గంజాయి బిజినెస్ ప్లాన్‌ను అమలు చేశాడు.. గంజాయి సాగు చేస్తే తాను పెట్టుబడి సాయం చేస్తానని చెప్పాడు.. అలగే పండించిన గంజాయిని తనకు రూ.1500కే కేజీ విక్రయించాలని రైతులను కోరాడు. ఇలా రైతులకు అవసరమైన డబ్బులు సాయం చేసి.. గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసేవాడు. రూ.1500కు తీసుకొచ్చిన గంజాయిని కేజీ రూ.5వేల చొప్పున విక్రయించేవాడు.

About amaravatinews

Check Also

ఇక విద్యార్థుల సెల్‌ఫోన్లకే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. మంత్రి లోకేశ్‌ వెల్లడి

మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ 2.0 వెర్షన్‌ను మరిన్ని సేవలకు అనుసంధానిస్తున్నట్లు మంత్రి లోకేష్‌ శాసనసభలో తెలిపారు. ఈ ఏఐ ఆధారిత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *