ఏపీలో రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఈ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు

ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు బోగీలు జత చేయనున్నారు. ఈనెల 14 నుంచి 21 వరకు భువనేశ్వర్‌- కేఎస్‌ఆర్‌ బెంగుళూరు (18463), 15 నుంచి 22 వరకు కేఎస్‌ఆర్‌ బెంగళూరు- భువనేశ్వర్‌(18464) రైళ్లకు అదనపు బోగీలను జత చేస్తామని అధికారులు తెలిపారు. ఈ రైళ్లకు ఓ థర్డ్‌ ఏసీ బోగీని ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాదు ఈ నెల 16న భువనేశ్వర్‌- తిరుపతి (22879), 17న తిరుపతి- భువనేశ్వర్‌ (22880) రైళ్లకు ఓ థర్డ్‌ ఏసీ అదనపు బోగీని జత చేస్తామన్నారు.

అలాగే ఈ నెల 15 నుంచి 30 వరకు విశాఖ- న్యూఢిల్లీ (20805).. ఈ నెల 17 నుంచి డిసెంబరు 2 వరకు న్యూఢిల్లీ- విశాఖ (20806) రైళ్లకు ఓ సెకండ్‌ ఏసీ బోగీని జత చేస్తారు. ఈ నెల 24న విశాఖ- లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌ (22847).. 26న లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌- విశాఖ(22848) రైళ్లకు ఓ థర్డ్‌ ఏసీ బోగీని అదనంగా ఏర్పాటు చేస్తారు. ఈ నెల 28న విశాఖ- డిఘా (22874).. ఈ నెల 29న డిఘా-విశాఖ(22873) రైళ్లకు ఓ థర్డ్‌ ఏసీ బోగీని.. ఈ నెల 20, 27 తేదీల్లో గాంధీదామ్‌- పూరీ(22973).. ఈ నెల 23, 30 తేదీల్లో పూరీ- గాంధీదామ్‌ (22974) రైళ్లకు ఓ స్లీపర్‌ క్లాస్‌ బోగీని అదనంగా జత చేయనున్నారు. బుధవారం రాత్రి 11.55 గంటలకు బయల్దేరాల్సిన హౌరా-ఎంజీఆర్ చెన్నై (12839) మెయిల్ దాదాపు 7 గంటలు ఆలస్యంగా 14న ఉదయం 7 గంటలకు బయల్దేరి వెళ్లింది.

మరోవైపు గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17239) రైలును నేడు రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి గుంటూరు వచ్చే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు(17240)ను ఈ నెల 15వ తేదీన రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రైలు పట్టాలు తప్పిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

About amaravatinews

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *