తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. 

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా.. ఒక నెల ముందుగా నిర్వహించే స్వామివారి పుష్కరిణి మరమత్తు పనులు పూర్తయ్యాయి. కొత్త హంగులతో స్వామి పుష్కరిణిని సిద్ధం చేయగా.. ఆదివారం నుంచి శ్రీవారి భక్తులను టీటీడీ అనుమతించారు. కాగా ఈ మరమత్తు పనులు టీటీడీ ఆగష్టు 1వ తేదీన ప్రారంభించిన విషయం విదితమే. ఇందులో భాగంగా స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించడానికి వాటర్‌వర్క్స్‌ విబాగంవారు దాదాపు 100మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యమ్రాన్ని పూర్తి చేశారు.

అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు బంగారు రంగులు (పెయింటింగ్‌) అద్దకంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దాదాపు కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణి నింపి మరమత్తు పనులు పూర్తిచేశారు. అయితే గత నెల స్వామి పుష్కరిణి మరమత్తుల నేపథ్యంలో ప్రతిరోజూ నిర్వహించే పష్కరిణి హారతిని టీటీడీ నిలిపివేసింది. అదే విధంగా భక్తులను కూడా ఒక నెల రోజులపాటు స్వామి పుష్కరిణిలోనికి అనుమతించలేదు. సెప్టెంబర్‌ 1వ తేది నుంచి భక్తులను కూడా పుష్కరిణిలోనికి అనుమతించారు.

About amaravatinews

Check Also

నేడు వడగండ్ల వానలు, ఈదురు గాలులు.. ఆరంజ్ అలెర్ట్ జారీ!

తెలుగు రాషాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవేసు ద్రోణి ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన వానలు కురుస్తుంటే.. మరోవైపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *