ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ ‘హాట్‌స్పాట్లు’గా ఆ 2 సిటీలు.. పెరగనున్న భూముల ధరలు!

Real Estate: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేందుకు వేగంగా దూసుకెళ్తోంది. దేశాభివృద్ధిలో నగరాలు కీలక పాత్ర పోషిస్తాయి. 2050 నాటికి దేశంలోని 100 నగరాల్లో జనభా 10 లక్షలకుపైగా పెరగనుంది. ప్రస్తుతం 8 మెగా సిటీలకు ఇవి అదనం. పట్టాణాభివృద్ధికి ప్రధానంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటైజేషన్, టూరిజం, ఆఫీస్ డైనమిక్స్ వంటివి కీలక పాత్ర పోషిస్తాయి. దేశంలోని ముఖ్యమైన నగరాల్లో రానున్న 5-6 ఏళ్లలో రియల్ ఎస్టేట్ పరిస్థితులు, బలమైన వృద్ధి అవకాశాలను అంచనా వేస్తూ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కొలియర్స్ (Colliers) ఓ నివేదిక తయారు చేసింది.

దేశంలోని 100 నగరాలు ఎమర్జింగ్ సిటీలుగా ఉన్నట్లు కొలియర్స్ నివేదిక తెలిపింది. సమానమైన వృద్ధి, రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్స్‌గా ఉన్నట్లు తెలిపింది. ఈ 100 నగరాల్లో 30 నగరాల్లో అధిక వృద్ధి రేటు ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా వీటిలో 17 నగరాలు మూడు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి తరగతుల్లో వేగవంతమైన రియల్ ఎస్టేట్ అభివృద్ధిని సాధిస్తాయని పేర్కొంది. ఈ జాబితాలో ఆంధ్రప్రేదశ్ నుంచి రెండు నగరాలు చోటు దక్కించుకున్నాయి. అవి తిరుపతి, వైజాగ్ ఉన్నాయి. 17 నగరాల లిస్ట్ ఓసారి చూద్దాం.

  • ఉత్తర భారత్ నుంచి అమృత్‌సర్, అయోధ్య, జైపూర్, కాన్పూర్, లఖ్‌నవూ, వారణాసి ఉన్నాయి
  • తూర్పు భారత్ నుంచి పట్నా, పూరీలు ఉన్నాయి.
  • పశ్చిమ భారత్ నుంచి ద్వారకా, నాగ్‌పూర్, షిర్డీ, సూరత్ ఉన్నాయి.
  • ఇక దక్షిణ భారత్ విషయానికి వస్తే కోయంబత్తూర్, కొచ్చి, తిరుపతి, విశాఖపట్నం, ఇండోర్ ఉన్నాయి.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *