తిరుమల అన్నప్రసాద కేంద్రంలో కియోస్క్ మెషిన్‌.. జస్ట్ స్కాన్ చేస్తే చాలు, సింపుల్‌గా!

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఏర్పాటు చేసిన‌ కియోస్క్ మెషిన్‌ను టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ఈ మెషిన్‌ను సౌత్ ఇండియ‌న్‌ బ్యాంకు టీటీడీకి విరాళంగా అందించింది. టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు దీనిని ఏర్పాటు చేశారు. ఈ మెషిన్ల ద్వారా భక్తులు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు తమకు తోచిన మొత్తాన్ని కియోస్క్ మిషన్ లోని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా సులభతరంగా విరాళం ఇవ్వొచ్చు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ‌ధ‌ర్‌, డిప్యూటీ ఈవో రాజేంద్ర, సౌత్ ఇండియ‌న్‌ బ్యాంకు జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ టీఎం మోహన్, ఏజీఎం మ‌ధు, చీఫ్‌ మేనేజర్ వెంకట్రావు, తిరుప‌తి బ్రాంచ్ హెడ్ అశోక్ వ‌ర్ధ‌న్‌ పాల్గొన్నారు.

About amaravatinews

Check Also

ఈ సారి భారతరత్న దక్కేది ఎవరికి? రేసులో ముందున్న ఆ ఇద్దరు..!

రిపబ్లిక్ డే వేళ భారతరత్న ఈ సారి ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ మొదలయ్యింది. గత ఏడాది భారతరత్న చరిత్రలోనే అత్యధికంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *