మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చారు. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్రెడ్డితో కలిసి సీఎంవో కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పురోగతిపై అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు సునీత ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసినట్లు తెలుస్తోంది. గతవారం సునీత కడపలో ఎస్పీని కూడా కలిశారు.. ఇప్పుడు తాజాగా అసెంబ్లీకి రావడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖపై …
Read More »వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు.. వివేకా హత్య కేసులో కీలక పరిణామం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ.. వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన వ్యక్తిని.. శివశంకర్రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి బెదిరించారని.. వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీం కోర్టు ధర్మాసనానికి …
Read More »మిరాకిల్: గంటన్నర పాటు ఆగిపోయి.. మళ్లీ కొట్టుకున్న సైనికుడి గుండె.. !
గుండె ఆగిపోవడం అంటే దాదాపు మరణించినట్టే. కానీ, ఓ సైనికుడి గుండె 90 నిమిషాలు పాటు ఆగిపోయి.. మళ్లీ కొట్టుకుంది. వైద్యులు చేసిన కృషితో ఆ జవాన్ తిరిగి ఈ లోకాన్ని చూశాడు. ఆధునిక వైద్యశాస్త్రం చేసిన ఈ అద్భుతం ఒడిశా రాజధాని భువనేశ్వర్ ఎయిమ్స్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుభాకాంత్ సాహు (24) అనే యువకుడు సైన్యంలో పనిచేస్తున్నాడు. తీవ్ర అనారోగ్యానికి గురైన అతడ్ని చికిత్స కోసం అక్టోబరు 1న భువనేశ్వర్ ఎయిమ్స్కు తరలించారు. అక్కడకు తీసుకొచ్చిన తర్వాత కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్ట్కు …
Read More »Jio 5G Voucher: జియో బంపర్ ఆఫర్.. రూ.601కే ఏడాదంతా అన్లిమిటెడ్ 5జీ డేటా!
Jio 5G Voucher: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లు తీసుకొస్తోంది. ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న క్రమంలో తమ నెట్వర్క్ వీడుతున్న యూజర్లను అట్టిపెట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. ఇప్పుడు మరో సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. 5జీ వోచర్ తీసుకొచ్చింది. దీని ద్వారా సంవత్సర కాలం పాటు 5జీ డేటాను వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అందుకు కేవలం రూ.601తో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ మేరకు రూ.601 …
Read More »రేషన్ కార్డుదారులకు బ్యాడ్న్యూస్.. ఆ హామీ మరింత ఆలస్యం, ఇక ఉగాది నుంచే..!
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ఇది నింజగా బ్యాడ్న్యూసే. జనవరి నుంచి రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వ హాస్టల్స్, అంగన్నాడీ కేంద్రాలకు మాత్రమే సన్న బియ్యం పంపిణీ చేస్తుండగా.. జనవరి నుంచి లబ్దిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. రేషన్ కార్డులు ఉన్న ప్రతి లబ్దిదారుడికి కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి 6 కేజీల చొప్పున ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. …
Read More »తెలంగాణ వెదర్ రిపోర్ట్.. పెరుగుతున్న చలి తీవ్రత
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో దక్షిణం, ఉత్తరాన రెండు ఆవర్తనాలు ఉన్నాయని చెప్పారు. అయితే వాటి ప్రభావం ఏపీ, తెలంగాణలపై ప్రస్తుతానికి లేదన్నారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా వర్షాలు కురిసే అవకాశం లేదని చెప్పారు. అయితే ఈనెల 26 లేదా 27 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. దాని ప్రభావంతో రాయలసీమ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. తెలంగాణలోని దక్షిణ తెలంగాణ జిల్లాల్ల్లో వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. ఇక తెలంగాణలో చలి …
Read More »ఎలాన్ మస్క్ రాకెట్ ద్వారా నింగిలోకి ఇస్రో ఉపగ్రహం జీ శాట్-20.. ప్రత్యేకతలివే
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) రూపొందించిన అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్-20 (GSAT 20) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఎలాన్ మస్క్ అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX)కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. ల్యాంచింగ్ ప్యాడ్ నుంచి రాకెట్ బయలుదేరిన 34 నిమిషాల అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. కొద్ది రోజుల్లో కర్ణాటక హసన్లో ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి …
Read More »ఆ మూడు పదాలు తొలగింపు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ చేసిన సూచనలను అనుసరించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్టం – 1986కు సవరణను చేసింది. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ ఆమోదించగా.. హెల్త్ వర్సిటీ చట్టం నుంచి ‘కుష్ఠు, చెవిటి, మూగ’ పదాలు తొలగించింది. వర్సిటీ బోర్డులో కుష్ఠు రోగులు, చెవిటి, మూగ సమస్యలు కలిగిన వారు సభ్యులుగా చేరేందుకు అర్హులు కాదని విశ్వవిద్యాలయం చట్టంలో పేర్కొన్నారు. అయితే వీరిపై వివక్ష చూపరాదంటూ ఎన్హెచ్ఆర్సీ అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన …
Read More »Mahakumbh Mela: 2025లో మహాకుంభమేళా ఎప్పుడు? పుణ్య స్నానం తేదీలు గురించి తెలుసుకోండి..
మహాకుంభమేళా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మహా కుంభమేళా 2025లో జరగనుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మహా కుంభ మేళాలో నదీ స్నానం చేయడం వల్ల సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో 2025లో మహా కుంభమేళా ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం. కుంభమేళా అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన పండుగ. దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మహా కుంభమేళా సందర్భంగా పవిత్ర నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ హరిస్తాయని నమ్మకం. కుంభమేళా సమయంలో కోట్లాది మంది …
Read More »వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (నవంబర్ 19, 2024): మేష రాశి వారు ఆర్థిక వ్యవహారాలలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగం హోదాతో పాటు పనిభారం ఎక్కువవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal