Kadam

బెయిల్ నిరాకరణ.. అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్.. చంచలగూడా జైలుకు అల్లు అర్జున్

12గంటల 15నిమిషాలకు జూబ్లీహిల్స్‌ నివాసంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఆయన సతీమణి స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. చంచలగూడా జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు పోలీసులు. ఏ 11 కి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ,7 మందిని అరెస్ట్  చేశారు పోలీసులు.  సంధ్య థియేటర్ …

Read More »

అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. పోలీసుల తీరుపై ఆగ్రహం

సినీ నటుడు అల్లు అర్జున్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో భాగంగా చిక్కడ పల్లి పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇది అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు అందరినీ షాక్ కు గురిచేసింది. ముఖ్యంగా బన్నీ అరెస్ట్ పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ …

Read More »

జపాన్‌లో ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు.. ఎంపికైతే నెలకు రూ.2 లక్షల వరకు జీతం

తెలంగాణ నిరుద్యోగులకు జపాన్ లో ఉద్యోగం పొందే ఛాన్స్ ఇంటి గుమ్మంలోనే ఎదురు చూస్తుంది. మీరు చేయాల్సిందల్లా నేరుగా ఇంటర్వ్యూ జరుగుతున్న అడ్రస్ కు వెళ్లడమే. శుక్రవారం నాడు హైదారాబాద్ లో ఈ కింది అడ్రస్ లో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఎంపికైతే నెలకు రూ. 2 లక్షల వరకు జీతంగా పొందొచ్చు..జపాన్‌లో నర్సు ఉద్యోగాలకు అధిక డిమాండ్‌ ఉంది. అక్కడ ఉద్యోగం చేయాలనుకునే వారికి సదావకాశం వచ్చింది. మనదేశంలోనే నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి జపాన్‌లో ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం డిసెంబర్‌ 13న మల్లేపల్లి …

Read More »

 నీట్‌ పీజీ 2025 పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. ఇంటర్న్‌షిప్‌ గడువు తేదీ ఇదే

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే నీట్‌ పీజీ పరీక్ష 2025 తేదీని నేషనల్ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (NBE) ప్రకటించింది. వచ్చే ఏడాది జూన్‌ 15వ తేదీన నీట్‌ పీజీ 2025 పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నేషనల్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు తన ప్రకటనలో పేర్కొంది. ఆ పరీక్షకు హాజరుకావాలనుకునే వారు వచ్చే ఏడాది జులై 31వ తేదీ నాటికి ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయాల్సి …

Read More »

వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌.. పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ..

వన్‌నేషన్‌ వన్‌ ఎలక్షన్‌.. జమిలి ఎన్నికల బిల్లుకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇక్కడి నుంచి రాజకీయం మరో మెట్టు ఎక్కబోతోంది. అయితే పార్లమెంటులో శుక్రవారం, శనివారం రాజ్యాంగంపై చర్చ జరగనుంది. ఈరోజు రక్షణశాఖామంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంటులో మాట్లాడనున్నారు. మొత్తం 12 గంటల సమయాన్ని కేటాయించారు. రాజ్యసభలో కేంద్ర హోంశాఖామంత్రి అమిత్‌షా ప్రసంగిస్తారు. అయితే రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందంటూ.. ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్న సమయంలో.. శనివారం ప్రధాని మోదీ పార్లమెంటు వేదికగా ప్రసంగించనున్నారు. అయితే ఈరోజు కాంగ్రెస్‌ నుంచి ఎంపీ ప్రియాంక …

Read More »

అల్లు అర్జున్ అరెస్ట్.. కేటీఆర్ రియాక్షన్ ఇది

సంధ్య థియేటర్ ఘటన నేపధ్యంలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. జాతీయ పురస్కారం అందుకున్న స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌.. పాలకుల అభద్రతాభావానికి పరాకాష్ట అని కేటీఆర్‌ విమర్శించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను.. సాధారణ నేరస్తుడిగా ట్రీట్‌ చేయడం సరికాదని తెలిపారు. ప్రభుత్వ తీవ్రచర్యను ఖండిస్తున్నాను. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్‌రెడ్డిని …

Read More »

SSC Time Table 2025: టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్.. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ బడుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు సంబంధించి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభమై 31వ తేదీతో ముగియనున్నాయి. అయితే ఈ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. మార్చి 31న సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తొలుత ప్రకటించగా.. సరిగ్గా అదే రోజున …

Read More »

AP 2025 Holidays: 2025 సెలవుల జాబితా విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. ఎన్ని రోజులో తెలుసా?

సాధారణ సెలవుల్లోనూ రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం, ఇతర పండగలు ఆదివారాలు కలిపి ఉన్నాయి. అయితే జనవరి, ఏప్రిల్, ఆగస్టు మాసాల్లో మాత్రం నాలుగేసి రోజులు హాలీ డేస్ వచ్చాయి.. 2025 సంవత్సరానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ, ఐచ్ఛిక సెలవులను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. వచ్చే ఏడాది 2025కు సాధారణ, ఆప్షనల్ సెలవులను ప్రకటించింది. ఇందులో మొత్తం 23 సాధారణ సెలవులు ఉంటాయని పేర్కొంది. ఇక 21 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు తెలిపింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన …

Read More »

Biggestn Breaking: అల్లు అర్జున్ అరెస్ట్..పోలీస్ స్టేషన్‏కు తరలింపు..

సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు.సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్  చేశారు చిక్కడపల్లి పోలీసులు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.  పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా 4వ తేదీన సంథ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.  తొక్కిసలాటలో  రేవతి అనే మహిళ మృతి చెందారు. దాంతో తొక్కిసలా ఘటనపై చిక్కడ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో అల్లు అర్జున్‌ను కూడా నిందితుడిగా …

Read More »

మిత్రమా.. ఇంకా ఒక రోజు మాత్రమే గడువు.. ఆ తర్వాత ఏంటో తెలుసా?

Aadhaar Update: ఆధార్ కార్డ్ హోల్డర్‌లు తమ ఆధార్ కార్డును పుట్టిన తేదీ, బయోమెట్రిక్‌లు, చిరునామా, ఇతర అప్‌డేట్‌లతో సహా నిర్దిష్ట గడువు వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రకటించింది. ఇప్పుడు ఈ గడువు దగ్గరపడింది. మీ ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి మీకు ఇంకా ఒక రోజు సమయం మాత్రమే ఉంది. అటే డిసెంబర్‌ 14 వరకు మాత్రమే గడువు. ఆ తర్వాత అప్‌డేట్‌ చేసుకుంటే రూ.50 ఛార్జ్‌ చెల్లించాల్సి ఉంటుంది. మీరు …

Read More »